Srilanka Crisis: శ్రీలంక సంక్షోభంపై జై శంకర్ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
indian Government holds all party meeting on Sri Lanka crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నేతృత్వంలో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సమావేశానికి హజరయ్యారు. శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితిని జైశంకర్ ఎంపీలకు వివరించారు. ఈ సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎండీఎంకే నేత వైకో, ఏడీఎంకే నేత తంబిదురై, కాంగ్రెస్ నుంచి పి. చిదంబరం, వైఎస్సార్సీపీ నుంచి విజయసాయి రెడ్డితో పాటు ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు.
అంతకుముందు ఆదివారం పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన సమావేశంలో తమిళ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు శ్రీలంక సంక్షోభంలో భారత్ జోక్యం చేసుకోవాలని కోరాయి. శ్రీలంకలో తమిళ జనాభా పరిస్థితితో పాటు రాష్ట్రంలోకి శరణార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో తమిళ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీకి, విదేశాంగ శాఖ జైశంకర్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ శ్రీలంకలో తమిళ ప్రజల పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంకల సంక్షోభ సమయంలో సహాయక సామాగ్రిని పంపించాలని సీఎం స్టాలిన్, కేంద్రాన్ని కోరారు.
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
- NCP: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్.? విలీనం దిశగా ఎన్సీపీ.. బీజేపీ ప్లాన్..
Read Also: Murugadoss Multi Starrer: సల్మాన్, షారూఖ్ తో మురుగదాస్ మల్టీస్టారర్
సంక్షోభ సమయంలో శ్రీలంకకు 3.8 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించేందుకు భారత్ అందించింది. సంక్షోభ సమయంలో ఏ దేశం శ్రీలంకను ఆదుకోకపోగా.. ఇండియానే శ్రీలంకకు సాయాన్ని అందిస్తోంది. ఇప్పటికే శ్రీలంకకు నిత్యావసరాలు, ఇంధనం, ఎరువులు, ఔషధాలను ఇండియా అందించింది. వీటి విలువ 1.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం భారత్ తమకు సాయం చేయాలని కోెరుతోంది. అక్కడి క్రికెటర్లు భారత్ ను శ్రీలంకకు పెద్దన్నగా పేర్కొంటూ..ఆపద సమయంలో తమకు అండగా నిలిచినందుకు ప్రశంసలు కురిపిస్తోంది. చివరకు డ్రాగన్ దేశం చైనా కూడా భారత్ సాయాన్ని కొనియాడింది. ఇదిలా ఉంటే రేపు శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. శ్రీలంక గత ఏడు దశాబ్ధాల్లో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంకలో గత ఆదివారంతో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు ప్రారంభమై వంద రోజులు పూర్తయ్యాయి.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కల్తీ ఆహారానికి చెక్.. హోటల్ యజమానులపై ఇక క్రిమినల్ కేసులు.!
-
US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!