Srilanka Crisis: శ్రీలంక సంక్షోభంపై జై శంకర్ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
indian Government holds all party meeting on Sri Lanka crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ నేతృత్వంలో అన్ని పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సమావేశానికి హజరయ్యారు. శ్రీలంకలో ప్రస్తుత పరిస్థితిని జైశంకర్ ఎంపీలకు వివరించారు. ఈ సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, డీఎంకే నేత టీఆర్ బాలు, ఎండీఎంకే నేత వైకో, ఏడీఎంకే నేత తంబిదురై, కాంగ్రెస్ నుంచి పి. చిదంబరం, వైఎస్సార్సీపీ నుంచి విజయసాయి రెడ్డితో పాటు ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు.
అంతకుముందు ఆదివారం పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగిన సమావేశంలో తమిళ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు శ్రీలంక సంక్షోభంలో భారత్ జోక్యం చేసుకోవాలని కోరాయి. శ్రీలంకలో తమిళ జనాభా పరిస్థితితో పాటు రాష్ట్రంలోకి శరణార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో తమిళ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటీవల జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీకి, విదేశాంగ శాఖ జైశంకర్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ శ్రీలంకలో తమిళ ప్రజల పరిస్థితి గురించి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీలంకల సంక్షోభ సమయంలో సహాయక సామాగ్రిని పంపించాలని సీఎం స్టాలిన్, కేంద్రాన్ని కోరారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Murugadoss Multi Starrer: సల్మాన్, షారూఖ్ తో మురుగదాస్ మల్టీస్టారర్
సంక్షోభ సమయంలో శ్రీలంకకు 3.8 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించేందుకు భారత్ అందించింది. సంక్షోభ సమయంలో ఏ దేశం శ్రీలంకను ఆదుకోకపోగా.. ఇండియానే శ్రీలంకకు సాయాన్ని అందిస్తోంది. ఇప్పటికే శ్రీలంకకు నిత్యావసరాలు, ఇంధనం, ఎరువులు, ఔషధాలను ఇండియా అందించింది. వీటి విలువ 1.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం భారత్ తమకు సాయం చేయాలని కోెరుతోంది. అక్కడి క్రికెటర్లు భారత్ ను శ్రీలంకకు పెద్దన్నగా పేర్కొంటూ..ఆపద సమయంలో తమకు అండగా నిలిచినందుకు ప్రశంసలు కురిపిస్తోంది. చివరకు డ్రాగన్ దేశం చైనా కూడా భారత్ సాయాన్ని కొనియాడింది. ఇదిలా ఉంటే రేపు శ్రీలంక అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. శ్రీలంక గత ఏడు దశాబ్ధాల్లో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. శ్రీలంకలో గత ఆదివారంతో నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు ప్రారంభమై వంద రోజులు పూర్తయ్యాయి.
తాజావార్తలు
-
US Airstrike on Iran: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రం.. 24 గంటల్లో రెండోసారి ఇరాన్పై అమెరికా వైమానిక దాడి
-
Astrology: సమస్యలు వచ్చినా భయపడని 4 రాశులు వీరేనా? ఎంత కష్టమైనా ధైర్యంగా ఎదుర్కొంటారట!
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!