Punjab CM: రైతులను ఢిల్లీకి కాకపోతే.. లాహోర్కు పంపాలా ఏంటి..?
- కేంద్ర ప్రభుత్వంపై పంజాబ్ ముఖ్యమంత్రి ఆగ్రహం..
- రైతులు ఢిల్లీకి వెళ్లకపోతే.. లాహోర్కు పంపించాలా?..
- రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించండి: సీఎం భగవంత్ మాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjab CM: పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హర్యానాలో జరిగిన బహిరంగ సభలో మాన్ మాట్లాడుతూ.. శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో నిరసన తెలియజేస్తున్న రైతులను బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోకి అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ఛాన్స్ లేకుండా రోడ్లపై భారీ బారికేడ్లను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ప్రభుత్వం ఢిల్లీ నుంచి నడుస్తుంది.. వారు ఢిల్లీకి వెళ్లకపోతే, లాహోర్కు పంపించాలా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతృత్వంలోని పంజాబ్ రైతులు ‘ఢిల్లీ చలో’ కవాతును ఫిబ్రవరి 13వ తేదీన స్టార్ట్ చేశారు.
Read Also: Niti Ayog Meeting: నీతి అయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం.. కారణం ఏమిటంటే..?
Also Read
అయితే, కేంద్ర ప్రభుత్వం చట్టపరమైన హామీ ఇవ్వాలనే తమ డిమాండ్లను ఆమోదించాలని రైతు సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర (MSP) కోసం తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. హస్తినకు వెళ్తున్న రైతు సంఘాల నేతలను అంబాలా- న్యూఢిల్లీ జాతీయ రహదారిపై సిమెంటు దిమ్మెలతో సహా బారికేడ్లను ఏర్పాటు చేసిన హర్యానా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అప్పటి నుంచి రైతులు శంభు, ఖనౌరీ సరిహద్దు పాయింట్ల దగ్గర నిరసన తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
Google Pixel 11a: గూగుల్ పిక్సెల్ 11a.. 8GB RAM, 120Hz డిస్ప్లే, Tensor G6 చిప్సెట్.. కొత్త ఫీచర్లు ఇవే!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!