Niti Ayog Meeting: నీతి అయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం.. కారణం ఏమిటంటే..?
- కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం..
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..
- నీతి అయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ దూరం..
Niti Ayog Meeting: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఇవాళ జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చర్చించింది. ఈ చర్చల్లో పాల్గొన్న పలు పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ‘కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం’ అనే తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతివ్వగా, బీజేపీ వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read also: Liquor Shops Closed: 28, 29 తేదీల్లో హైదరాబాద్ లో వైన్ షాపులు పూర్తిగా బంద్..
Also Read
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Off The Record : సర్ సర్వేకు మజ్లిస్ మార్క్ ట్రీట్మెంట్ మొదలైందా?
కాగా.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. నేటి నీతి అయోగ్ సమావేశం ఎజెండా వికసిత్ భారత్-2047 కాగా.. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ జరిగే నీతి అయోగ్ సమావేశంలో చర్చించనున్నారు. అయితే.. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ బహిష్కరించగా, ఆయన పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రకటన ఆసక్తి రేకెత్తించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానితో ఇలాంటి సమావేశాలకు దూరంగా ఉండేవారని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ తనను విమర్శించిందని, తాజా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు.
Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ఫిక్స్..!
తాజావార్తలు
-
US-China AI Tech War: మక్కీకి మక్కీ కాపీ.. చైనా AI లపై అమెరికా నిఘా!
-
Love Marriage: నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం.. ఇంతలోనే ఘోరం
-
AAP Crisis: హర్భజన్ సహా బీజేపీలో చేరిన ఎంపీలకు భారీ భద్రత..
-
MS Dhoni Re Entry: ఎంఎస్ ధోనీ ఫిట్, బట్ నో రీఎంట్రీ.. అసలు విషయం తెలిస్తే షాకే!
-
Astrology: లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!