Niti Ayog Meeting: నీతి అయోగ్ సమావేశానికి తెలంగాణ సీఎం దూరం.. కారణం ఏమిటంటే..?
- కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం..
- తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..
- నీతి అయోగ్ సమావేశానికి సీఎం రేవంత్ దూరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Niti Ayog Meeting: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఇవాళ జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో చర్చించింది. ఈ చర్చల్లో పాల్గొన్న పలు పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ‘కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం’ అనే తీర్మానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతివ్వగా, బీజేపీ వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈ చర్చలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Read also: Liquor Shops Closed: 28, 29 తేదీల్లో హైదరాబాద్ లో వైన్ షాపులు పూర్తిగా బంద్..
Also Read
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
కాగా.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. నేటి నీతి అయోగ్ సమావేశం ఎజెండా వికసిత్ భారత్-2047 కాగా.. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇవాళ జరిగే నీతి అయోగ్ సమావేశంలో చర్చించనున్నారు. అయితే.. రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ నీతి ఆయోగ్ సమావేశాన్ని తమిళనాడు సీఎం స్టాలిన్ బహిష్కరించగా, ఆయన పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రకటన ఆసక్తి రేకెత్తించింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానితో ఇలాంటి సమావేశాలకు దూరంగా ఉండేవారని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ తనను విమర్శించిందని, తాజా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు.
Kamala Harris: డెమోక్రటిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ ఫిక్స్..!
తాజావార్తలు
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
-
Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!