Shashi Tharoor: వచ్చే ఎన్నికల్లో బీజేపీనే అతిపెద్ద పార్టీ, కానీ.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అతపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాత్రం తగిన సంఖ్యకు దూరంగా ఉంటుందని, ఎన్డీయే మిత్రపక్షాలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించే అవకాశం ఉందని, దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరోధించవచ్చని అన్నారు.
2019 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 303 సీట్లు గెలుచుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతంగా 400 మార్కులు సాధించాలని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సారి మాత్రం కాంగ్రెస్, ఆర్జేడీ, ఆప్, జేడీయూ, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలతో సహా 27 పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకుని బీజేపీకి అధికారం దక్కకుండా వ్యూహాలను రచిస్తున్నాయి.
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో థరూర్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఆపడానికి బిజెపి సంఖ్యను తగ్గించవచ్చని అన్నారు. ‘‘2024 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే వారి సంఖ్యాబలం తక్కుతుందని.. వారి మిత్రపక్షాలు పొత్తుకు ఇష్టపడని స్థాయికి చేరుతుందని నమ్ముతున్నాను. వారు మాతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మనం ఒకసారి ప్రయత్నించాలి’’ అని మాజీ కేంద్ర మంత్రి థరూర్ అన్నారు.
Read Also: IND vs AFG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. రెండు మార్పులతో బరిలోకి
పలు రాష్ట్రాల్లో ఇండియా కూటమి సీట్లు పంచుకునే ఒప్పందాలను చేసుకుంటే.. ఓటములను అడ్డుకోవచ్చని.. ఒకవేళ సీట్ల పంపకాలపై భిన్నాభిప్రాయాలు ఉంటే బీజేపీ అభ్యర్థి గెలుస్తారని అన్నారు. కేరళలో సీపీఎం, కాంగ్రెస్లు సీట్ల పంపకాల ఒప్పందాన్ని అంగీకరించడం అసాధ్యమని థరూర్ అన్నారు. కేరళలో ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నాయి, ఇటి సీట్ల పంపకానికి అంగీకరిస్తారనేది దాదాపుగా అసాధ్యం, కానీ తమిళనాడులో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, డీఎంకే అన్నీ కలిసి మిత్రపక్షంగా ఉన్నాయి. అక్కడ ఎలాంటి వివాదాలు లేవు.
ఇండియా కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి రావడం లేదు. కాంగ్రెస్తో కొన్ని రాష్ట్రాల్లో కూటమిలోని కొన్ని పార్టీలు సీట్ల షేరింగ్కి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. బెంగాల్లో బీజేపీని ఓడించేది టీఎంసీనే అని సీఎం మమతా బెనర్జీ చెబుతోంది. ఇక పంజాబ్, ఢిల్లీల్లో ఆప్, కాంగ్రెస్ ప్రత్యర్థులుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!