Shashi Tharoor: వచ్చే ఎన్నికల్లో బీజేపీనే అతిపెద్ద పార్టీ, కానీ.. శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shashi Tharoor: 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అతపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాత్రం తగిన సంఖ్యకు దూరంగా ఉంటుందని, ఎన్డీయే మిత్రపక్షాలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించే అవకాశం ఉందని, దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరోధించవచ్చని అన్నారు.
2019 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 303 సీట్లు గెలుచుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతంగా 400 మార్కులు సాధించాలని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ సారి మాత్రం కాంగ్రెస్, ఆర్జేడీ, ఆప్, జేడీయూ, టీఎంసీ, డీఎంకే వంటి పార్టీలతో సహా 27 పార్టీలు ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకుని బీజేపీకి అధికారం దక్కకుండా వ్యూహాలను రచిస్తున్నాయి.
Also Read
- Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
- LoC Ceasefire: ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి.. ఎల్వోసీ వెంబడి భారీ కాల్పులు..
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో థరూర్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా ఆపడానికి బిజెపి సంఖ్యను తగ్గించవచ్చని అన్నారు. ‘‘2024 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే వారి సంఖ్యాబలం తక్కుతుందని.. వారి మిత్రపక్షాలు పొత్తుకు ఇష్టపడని స్థాయికి చేరుతుందని నమ్ముతున్నాను. వారు మాతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి మనం ఒకసారి ప్రయత్నించాలి’’ అని మాజీ కేంద్ర మంత్రి థరూర్ అన్నారు.
Read Also: IND vs AFG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. రెండు మార్పులతో బరిలోకి
పలు రాష్ట్రాల్లో ఇండియా కూటమి సీట్లు పంచుకునే ఒప్పందాలను చేసుకుంటే.. ఓటములను అడ్డుకోవచ్చని.. ఒకవేళ సీట్ల పంపకాలపై భిన్నాభిప్రాయాలు ఉంటే బీజేపీ అభ్యర్థి గెలుస్తారని అన్నారు. కేరళలో సీపీఎం, కాంగ్రెస్లు సీట్ల పంపకాల ఒప్పందాన్ని అంగీకరించడం అసాధ్యమని థరూర్ అన్నారు. కేరళలో ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నాయి, ఇటి సీట్ల పంపకానికి అంగీకరిస్తారనేది దాదాపుగా అసాధ్యం, కానీ తమిళనాడులో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, డీఎంకే అన్నీ కలిసి మిత్రపక్షంగా ఉన్నాయి. అక్కడ ఎలాంటి వివాదాలు లేవు.
ఇండియా కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి రావడం లేదు. కాంగ్రెస్తో కొన్ని రాష్ట్రాల్లో కూటమిలోని కొన్ని పార్టీలు సీట్ల షేరింగ్కి ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. బెంగాల్లో బీజేపీని ఓడించేది టీఎంసీనే అని సీఎం మమతా బెనర్జీ చెబుతోంది. ఇక పంజాబ్, ఢిల్లీల్లో ఆప్, కాంగ్రెస్ ప్రత్యర్థులుగా ఉన్నాయి.
తాజావార్తలు
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
Sonam Wangchuk: దీక్ష భగ్నం.. సోనమ్ వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలింపు..
-
Andy Flower: ఇంగ్లండ్ కోచ్ పదవి వద్దు.. ఆర్సీబీనే ముద్దు!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
Bhagyashri Borse: వరుస ఫ్లాప్లు ఆపలేకపోయాయి.. ‘లెనిన్’ హిట్తో భాగ్యశ్రీ బోర్సే భారీ రెమ్యునరేషన్ డిమాండ్
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?