Jammu Kashmir: కాశ్మీర్పై డ్రాగన్ కంట్రీ కీలక వ్యాఖ్యలు.. భారత్-పాక్లకు సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: కాశ్మీర్ సమస్యపై డ్రాగన్ కంట్రీ చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్మూకాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని, ఆర్టికల్ 370ని రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఐదుగురు న్యాయమూర్తులు ధర్మాసనం ఏకగ్రీవంగా సమర్థించింది. అయితే ఈ తీర్పు తర్వాతి రోజే చైనా కామెంట్స్ చేసింది.
Read Also: Rajasthan CM: రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ.. తొలిసారి ఎమ్మెల్యేని వరించిన అత్యున్నత పదవి..
Also Read
- INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
- Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
- Su-57 fighter jet: భారత్కు పుతిన్ బిగ్ ఆఫర్.. Su-57 స్టెల్త్ ఫైటర్పై కీలక ప్రతిపాదన..
- Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
కాశ్మీర్ సమస్యను భారత్-పాకిస్తాన్ దేశాలు చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని మంగళవారం సూచించింది. కాశ్మీర్ సమస్యపై చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్ చెప్పారు. ఓ పాకిస్తానీ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఇరు దేశాల మధ్య కొంతకాలంగా ఉన్న వివాదమని, యూఎన్ చార్టర్, యూఎన్ఎస్సీ తీర్మానాలకు, సంబంధిత ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని ఆమె చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలని అన్నారు. మరోవైపు దాయాది దేశం పాకిస్తాన్ మాత్రం సుప్రీంకోర్టు తీర్పుపై తన అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఏకపక్ష, చట్టవిరుద్ధ చర్యగా అభివర్ణించింది. ఆర్టికల్ 370 రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు తీర్పును ‘‘చట్టపరమైన విలువ లేని’’ తీర్పుగా అభివర్ణించింది.
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఏకగ్రీవంగా సమర్థించింది. రాష్ట్ర హోదాను “త్వరగా” పునరుద్ధరించాలని, అలాగే వచ్చే ఏడాది సెప్టెంబర్ 30లోగా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు, కేంద్రాన్ని ఆదేశించింది.
తాజావార్తలు
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
INDIA alliance: INDIA కూటమికి వరుస షాకులు.. డీఎంకే తర్వాత ఉద్ధవ్ సేన కూడా దూరం?
-
Bolla Brahmanayudu : గండిపేట భూముల స్కామ్లో బిగ్ ట్విస్ట్.. ప్రధాన నిందితుడు బ్రహ్మనాయుడు అరెస్ట్!
-
Defence Powers: సైన్యాధిపతులకు భారీగా ఆర్థిక అధికారాలు.. ఎంత వరకు ఖర్చు చేయొచ్చంటే..!
-
AP Govt: ఏటా రూ.28,000 కోట్ల ఎగుమతులు.. ఆక్వా రంగంలో ఏపీ నయా రికార్డ్..
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!