Haryana: బెడిసికొట్టిన ఆప్-కాంగ్రెస్ పొత్తు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ ప్రకటన
- హర్యానాలో బెడిసికొట్టిన ఆప్.. కాంగ్రెస్ పొత్తు
- అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ ప్రకటన
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇండియా కూటమిలోని భాగమైన ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. కానీ చర్చలు సఫలీకృతం కాలేదు. ఆప్ ఆశించిన విధంగా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. సింగిల్ డిజిట్కే హస్తం పార్టీ పరిమతం చేసింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి రుచించలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆ పార్టీ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Nandikotkur Crime: మహిళ హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు..
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం ప్రకటించింది, పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేయవద్దని ప్రత్యర్థులను హెచ్చరించింది. సీట్ల పంపకంపై వచ్చిన విభేదాల కారణంగా ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు నిలిచిపోయాయని ప్రకటనలో వెలువడింది.
కాంగ్రెస్తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, అవసరమైతే పార్టీ ఒంటరిగా వెళ్లడానికి సిద్ధంగా ఉందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో నిరంతరం పని చేస్తోందన్నారు. సునీతా కేజ్రీవాల్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మొత్తం 90 స్థానాల్లో పోటీ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని.. పార్టీ బలంగా ఉందని కక్కర్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఆప్ తన అభ్యర్థులను ఎన్నికలకు ప్రకటిస్తుందని ఆమె వెల్లడించారు. కాంగ్రెస్తో చర్చలు కొనసాగించే అవకాశం ఉందని సూచించిన ఆమె.. ఇక ముగింపునకు వచ్చినట్లేనని పేర్కొన్నారు. ఇక ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ.. హర్యానాలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఐదు సీట్ల కోసం కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకుందనే పుకార్లను ఆయన తోసిపుచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.
ఇది కూడా చదవండి: Ghost Hackers : చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ ‘ఘోస్ట్ హ్యాకర్లు’
అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తొలి జాబితాలను ప్రకటించాయి. మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారు.
"Ready to fight elections on every seat", says AAP MP amid Cong-AAP alliance speculation
Read @ANI Story | https://t.co/K7j8so2Kng#Congress #AAP #AssemblyElections #Haryana pic.twitter.com/PTmgdn7NLj
— ANI Digital (@ani_digital) September 7, 2024
తాజావార్తలు
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
-
RCB vs DC: ఒక్క మ్యాచ్ కే ఇంత తేడానా.? అప్పుడేమో 264.. ఇప్పుడు 75కే ఖేల్ ఖతం..!
-
Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!