Haryana: బెడిసికొట్టిన ఆప్-కాంగ్రెస్ పొత్తు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ ప్రకటన
- హర్యానాలో బెడిసికొట్టిన ఆప్.. కాంగ్రెస్ పొత్తు
- అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇండియా కూటమిలోని భాగమైన ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. కానీ చర్చలు సఫలీకృతం కాలేదు. ఆప్ ఆశించిన విధంగా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. సింగిల్ డిజిట్కే హస్తం పార్టీ పరిమతం చేసింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి రుచించలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆ పార్టీ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Nandikotkur Crime: మహిళ హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు..
Also Read
- Prakash Raj: కాక్రోచ్ జనతా పార్టీలో ప్రకాష్ రాజ్ ఎంట్రీ.. వైరల్ అవుతున్న వీడియో!
- West Bengal: ప్రధాని మోడీకి ఝల్మురి వడ్డించిన షాప్ ఓనర్కి ప్రాణ భయం..! పాక్ నుంచి బెదిరింపులు..
- Tiger Attack: ఘోరం.. తునికాకు కోసం అడవికి వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి
- DMK vs TVK: టీవీకే అభ్యర్థుల విద్యా అర్హతలపై డీఎంకే సంచలన ఆరోపణలు.. ఫేక్ డిగ్రీలంటూ ఆధారాల విడుదల..!
రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం ప్రకటించింది, పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేయవద్దని ప్రత్యర్థులను హెచ్చరించింది. సీట్ల పంపకంపై వచ్చిన విభేదాల కారణంగా ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు నిలిచిపోయాయని ప్రకటనలో వెలువడింది.
కాంగ్రెస్తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, అవసరమైతే పార్టీ ఒంటరిగా వెళ్లడానికి సిద్ధంగా ఉందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో నిరంతరం పని చేస్తోందన్నారు. సునీతా కేజ్రీవాల్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మొత్తం 90 స్థానాల్లో పోటీ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని.. పార్టీ బలంగా ఉందని కక్కర్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఆప్ తన అభ్యర్థులను ఎన్నికలకు ప్రకటిస్తుందని ఆమె వెల్లడించారు. కాంగ్రెస్తో చర్చలు కొనసాగించే అవకాశం ఉందని సూచించిన ఆమె.. ఇక ముగింపునకు వచ్చినట్లేనని పేర్కొన్నారు. ఇక ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ.. హర్యానాలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఐదు సీట్ల కోసం కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకుందనే పుకార్లను ఆయన తోసిపుచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.
ఇది కూడా చదవండి: Ghost Hackers : చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ ‘ఘోస్ట్ హ్యాకర్లు’
అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తొలి జాబితాలను ప్రకటించాయి. మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారు.
"Ready to fight elections on every seat", says AAP MP amid Cong-AAP alliance speculation
Read @ANI Story | https://t.co/K7j8so2Kng#Congress #AAP #AssemblyElections #Haryana pic.twitter.com/PTmgdn7NLj
— ANI Digital (@ani_digital) September 7, 2024
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: అప్పుడే క్రిస్ గేల్ రికార్డుకు చేరువలోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 3 మాత్రమే..
-
Bihar IPL Team: ప్రతిభ ఉన్నా గుర్తింపు లేదు.. బీహార్కు కూడా ఐపీఎల్ జట్టు కావాలి..? పారిశ్రామికవేత్త భావోద్వేగ పోస్ట్ వైరల్..!
-
Gayapadda Simham: ‘గాయపడ్డ సింహం’ ఓటీటీ రిలీజ్..
-
Honda City facelift: భారత మార్కెట్లోకి సరికొత్త హోండా సిటీ ఫేస్లిఫ్ట్.. అదిరిపోయే లుక్స్, ఫీచర్లు!
-
Kodak QLED Smart TV: కోడాక్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ రిలీజ్.. Google TV 5.0తో థియేటర్ ఫీల్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!