Haryana: బెడిసికొట్టిన ఆప్-కాంగ్రెస్ పొత్తు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ ప్రకటన
- హర్యానాలో బెడిసికొట్టిన ఆప్.. కాంగ్రెస్ పొత్తు
- అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆప్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. ఇండియా కూటమిలోని భాగమైన ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల పంపకాలపై సుదీర్ఘంగా మంతనాలు జరిగాయి. కానీ చర్చలు సఫలీకృతం కాలేదు. ఆప్ ఆశించిన విధంగా సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. సింగిల్ డిజిట్కే హస్తం పార్టీ పరిమతం చేసింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి రుచించలేదు. దీంతో ఒంటరిగానే బరిలోకి దిగాలని ఆ పార్టీ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Nandikotkur Crime: మహిళ హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు..
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
రాబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం ప్రకటించింది, పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేయవద్దని ప్రత్యర్థులను హెచ్చరించింది. సీట్ల పంపకంపై వచ్చిన విభేదాల కారణంగా ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు చర్చలు నిలిచిపోయాయని ప్రకటనలో వెలువడింది.
కాంగ్రెస్తో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, అవసరమైతే పార్టీ ఒంటరిగా వెళ్లడానికి సిద్ధంగా ఉందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో నిరంతరం పని చేస్తోందన్నారు. సునీతా కేజ్రీవాల్ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారని చెప్పారు. మొత్తం 90 స్థానాల్లో పోటీ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నామని.. పార్టీ బలంగా ఉందని కక్కర్ చెప్పారు. రాబోయే రోజుల్లో ఆప్ తన అభ్యర్థులను ఎన్నికలకు ప్రకటిస్తుందని ఆమె వెల్లడించారు. కాంగ్రెస్తో చర్చలు కొనసాగించే అవకాశం ఉందని సూచించిన ఆమె.. ఇక ముగింపునకు వచ్చినట్లేనని పేర్కొన్నారు. ఇక ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ మాట్లాడుతూ.. హర్యానాలో అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఐదు సీట్ల కోసం కాంగ్రెస్తో ఒప్పందం కుదుర్చుకుందనే పుకార్లను ఆయన తోసిపుచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు.
ఇది కూడా చదవండి: Ghost Hackers : చనిపోయిన వ్యక్తుల బ్యాంకు ఖాతాలను టార్గెట్ చేస్తున్న ఈ ‘ఘోస్ట్ హ్యాకర్లు’
అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తొలి జాబితాలను ప్రకటించాయి. మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. భారత రెజ్లర్ వినేష్ ఫోగట్.. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుతున్నారు.
"Ready to fight elections on every seat", says AAP MP amid Cong-AAP alliance speculation
Read @ANI Story | https://t.co/K7j8so2Kng#Congress #AAP #AssemblyElections #Haryana pic.twitter.com/PTmgdn7NLj
— ANI Digital (@ani_digital) September 7, 2024
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!