Rajasthan Political Crisis: కాంగ్రెస్లో అధ్యక్ష ఎన్నికల చిచ్చు.. హైకమాండ్ ముందు మూడు షరతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Political Crisis: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చురేపుతున్నాయి. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు పార్టీ అధ్యక్ష పదవిలో పోటీ చేస్తారని అనుకుంటున్నప్పటికీ.. ఆయన సీఎం పదవిని వదిలిపెట్టేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. సచిన్ పైలెట్ సీఎం కావడం అశోక్ గెహ్లాట్ కు మొదటినుంచి ఇష్టం లేదు. సచిన్ పైలెట్ ను ముఖ్యమంత్రి చేయవద్దనే డిమాండ్ పై గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు మొండిగా వ్యవహరిస్తున్నారని.. పార్టీ పరిశీలకుడు అజయ్ మాకెన్ అన్నారు. అక్టోబర్ 19 తర్వాత నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ కు సూచిస్తామని ఆయన అన్నారు.
గెహ్లాట్ కు మద్దతుగా 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు అధిష్టానం ముందు మూడు షరతులు పెట్టారు. గెహ్లాట్ రాజీనామా తర్వాత ఆయన అనుకూల వర్గం నుంచే ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని.. ముఖ్యమంత్రి నియామకం విషయంలో ఆయన సూచనలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదే విధంగా ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాతే అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు.
Also Read
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
- Punjab: జంతర్ మంతర్-ఉగ్రకుట్ర కేసు ప్రకంపనలు.. అమృత్సర్ పోలీస్ చీఫ్కు ట్రాన్స్ఫర్
- Biogas Blended CNG: E20 తర్వాత ఇప్పుడు CNGలో బయోగ్యాస్ మిశ్రమం.. మీ కారుపై ప్రభావం ఉంటుందా..?
- Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
Read Also: kerala Hijab Protest: కేరళను తాకిన హిజాబ్ వివాదం..ముస్లిం సంఘాల ఆందోళన
ఇదిలా ఉంటే తరుపరి సీఎం సచిన్ పైలెట్ అని అధిష్టానం తెలియజేయడంతో గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధపడ్డారు. కాగా.. సచిన్ పైలెట్ కు హైకమాండ్ నుంచి ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చింది. అయితే తాను ఢిల్లీకి వెళ్లేది లేదని ఆయన తెలిపారు. చర్చల కోసం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్లను ఢిల్లీకి రావాలని హైకమాండ్ కోరింది. మరోవైపు అశోక్ గెహ్లాట్ తదుపరి సీఎంగా స్పీకర్ సీపీ జోషి, బీడీ కల్లా పేర్లను సూచించారు.
రాజస్థాన్ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని కోరుతున్నారు. ఈ గొడవలను చక్కదిద్దే పనిలో పడ్డారు కాంగ్రెస్ నాయకులు. కాసేపట్లో సోనియాగాంధీతో కేసీ వేణుగోపాల్ సమావేశం కానున్నారు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య ఉన్న ఎప్పటి నుంచో ఉన్న వివాదం తాాజాగా అధ్యక్ష ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య వివాదం రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభాన్ని తీసుకువచ్చింది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!