Parliament assault case: రాహుల్పై నమోదైన కేసు క్రైమ్ బ్రాంచ్కు బదిలీ
- రాహుల్పై నమోదైన కేసు క్రైమ్ బ్రాంచ్కు బదిలీ
- బీజేపీ నేతలపై కూడా ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్లో గురువారం ఎంపీల మధ్య కొట్లాట జరిగింది. అయితే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోసేయడం కారణంగా బీజేపీ ఎంపీ గాయపడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేత హేమాంగ్ జోషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పార్లమెంట్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు… తాజాగా క్రైమ్ బ్రాంచ్కు బదిలీ చేయబడింది. అలాగే కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ నేతలపై ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు కర్రలతో దాడి చేశారని.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే గాయపడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా పరస్పరం ఇరువర్గాలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసుకున్నాయి. రాహల్పై నమోదైన కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు.
ఇది కూడా చదవండి: Telangana Bhu Bharati: భూ భారతి బిల్లుకు ఆమోదం..
Also Read
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
- Woman Litters In Train: రైలు కోచ్లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్పై దేశవ్యాప్తంగా చర్చ
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
గురువారం జరిగిన ఘటనలో ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిలో బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి నుదిటిపై గాయాలయ్యాయి. ఈ గొడవ తర్వాత బీజేపీ నేత హేమాంగ్ జోషి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను బీజేపీ సభ్యులు నెట్టారని, ఆ తర్వాత ఆయన మోకాలికి గాయమైందని ఆరోపిస్తూ, గందరగోళానికి బీజేపీ కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. బీజేపీ ఎంపీలు లాఠీ చేతబట్టి తనను పార్లమెంటులోకి రానీయకుండా అడ్డుకున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఇక ఈ నిరసనల సమయంలో రాహుల్గాంధీ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్నోన్ కొన్యాక్ ఆరోపించారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్కు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం తనను ఎంతగానో బాధించిందని.. రాహుల్ తనకు చాలా దగ్గర నిలబడడం తన మనసు కలిచివేసిందని ఆరోపించారు. అంతేకాకుండా తనపై గట్టిగా కూడా అరిచారని ఆవేదన చెందారు.
ఇది కూడా చదవండి: Nitish Kumar: నితీష్ కుమార్ నేతృత్వంలోనే బీహార్ ఎన్నికలు..క్లారిటీ ఇచ్చిన ఎన్డీయే..
తాజావార్తలు
-
Hanuman: హనుమంతుడిని కూడా నిలువరించిన ముగ్గురు యోధులు వీరేనా? ఈ కథల వెనుక ఉన్న విశేషాలేంటి?
-
DUBAI: గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ సర్వనాశనం.. దుబాయ్ను నిండా ముంచేసిన ఇరాన్!
-
Karnataka: “నిన్ను చంపి నేను చస్తా”.. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!