Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Assembly Approves Bhu Bharati Bill

Telangana Bhu Bharati: భూ భారతి బిల్లుకు ఆమోదం..

Published Date :December 20, 2024 , 10:19 pm
By Sudhakar Ravula
  • అసెంబ్లీలో భూ భారతి బిల్లుకు ఆమోదం..
  • భూ భారతి బిల్లుపై సభలో మాట్లాడిన సీఎం..
  • గత ప్రభుత్వ నిర్వాకంవల్ల రైతులు భూములు కోల్పోయారన్న సీఎం..
  • మన భూముల సమాచారం విదేశాల్లో ఉంది: సీఎం రేవంత్‌..
  • ధరణి పోర్టల్‌ నిర్వాహణలో తెలంగాణ పౌరులు లేరు: సీఎం రేవంత్..
  • బండారం ఎక్కడ బయటపడుతుందో అని బీఆర్‌ సభలో గొడవ చేసింది..
Telangana Bhu Bharati: భూ భారతి బిల్లుకు ఆమోదం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana Bhu Bharati: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 17న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడితే.. మూడు రోజుల సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. భూ భారతి బిల్లుపై చర్చ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందన్నారు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మల్లు స్వరాజ్యం వంటి వారు భూపోరాటాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి అని స్పష్టం చేశారు. భూమిని కాపాడుకునే క్రమంలోనే దొడ్డి కొమురయ్య లాంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వం ఒడ్డి పోరాటాలు చేసి భూములు కాపాడుకున్నారని.. పేదల భూములను రక్షించేందుకే పటేల్​ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారని అన్నారు. భూమి లేని పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వం భూమి ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టిందన్నారు. ఆక్రమణలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గతంలో ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తెచ్చాయని రేవంత్ రెడ్డి తెలిపారు.

Read Also: Pet Dogs: ఆ పని కోసం పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్తున్నారా? ఇక అంతే..!

Also Read

  • Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
  • Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
  • Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి
  • Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!

విపక్ష పార్టీ అహంభావంతో వ్యవహరిస్తోందని.. స్పీకర్​ పట్ల దారుణంగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్​…రైతులను తమ భూములకు దూరం చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. 2010లో ఒడిశా కూడా ఇదే ధరణి విధానాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఒడిశా సర్కారే తప్పు చేసిందని ఎన్​ఐసీ, కాగ్​ చెప్పాయన్న ఆయన…అనుభవం లేని ఐఎల్​ అండ్​ ఎఫ్​ఎస్​ సంస్థకు అప్పగించవద్దని హెచ్చరించినట్లు సభ దృష్టికి తీసుకువచ్చారు. యువరాజుకు అత్యంత సన్నిహితులైన వారికి ధరణి పోర్టల్​ను అప్పగించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పోర్టల్‌ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్లినా సీఈవోగా గాదే శ్రీధర్‌రాజు ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. విలువైన సమాచారం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. 50 లక్షల రైతుల వివరాలు, భూమి వివరాలను ఓ సంస్థ చేతికి అప్పగించారని అన్నారు. టెరాసిస్‌ చేతిలో పెట్టిన ధరణి పోర్టల్‌…పది సంస్థల చేతులు మారిందని రేవంత్ రెడ్డి తెలిపారు. మన ధరణి పోర్టల్‌ ఫిలిప్పీన్స్‌, సింగపూర్‌, కెమెన్‌ ఐలాండ్స్, వర్జిన్‌ ఐలాండ్‌ మీదుగా తిరిగిందని చెప్పారు. ఈ పోర్టల్​ను నిర్వహించిన వాళ్లెవరూ భారతీయులు కాదన్న రేవంత్‌రెడ్డి…ఆర్థిక నేరాలకు పేరొందిన దేశాలు, సంస్థల చేతుల్లో మన రైతుల వివరాలు పెట్టారని మండిపడ్డారు. ఎంతో విలువైన సమాచారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన కేసీఆర్‌ను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్రజల్ని మోసం చేసి సమాచారం అంతా క్రిమినల్స్‌కు అందించారని అన్నారు. ఈ నేరాలకు ఏం శిక్ష విధించాలో తెలియాలంటే చట్టాలన్నీ చదవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డజన్ల కొద్ది కంపెనీలు ధరణిలోకి ఎందుకు వచ్చాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇవన్నీ తాము ఎన్నికల ముందు చెబితే.. తమనే బంగాళాఖాతంలో కలపాలని మాట్లాడారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

Read Also: Supreme court: చట్టాలు భర్తలను దోచుకునే సాధనాలు కాదు.. భరణంపై సుప్రీం కీలక వ్యాఖ్య

భూభారతి చట్టంతో.. ధరణి ఎదురైన సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అటవీ, రెవెన్యూ శాఖల భూములకు సంబంధించిన సరిహద్దుల వివాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూభారతి చట్టంతో ధరణి సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. ధరణిలోని నిషేధిత భూముల జాబితాకు సంబంధించి పూర్తిస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అటవీ ప్రాంతాలను ఆనుకొని ఉన్న భూముల సరిహద్దుల సమస్య పరిష్కారానికి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి రైతులను.. తమ భూములకు దూరం చేస్తే…భూభారతి చట్టం మాత్రం రైతులను దగ్గర చేస్తుందన్నారు రేవంత్‌రెడ్డి. సీఎంకు, రెవెన్యూ శాఖకు మధ్య గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని ఎందుకు దేశాలు దాటించారని ప్రశ్నించారు. వాళ్లు ఒక్క క్లిక్ చేస్తే చాలు సమాచారం అంతా క్రాష్ అవుతుందని చెప్పుకొచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhu Bharati Bill
  • CM Revanth Reddy
  • telangana
  • telangana assembly
  • Telangana Bhu Bharati

తాజావార్తలు

  • Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు

  • Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్‌ విరాట్..

  • Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి

  • Vizianagaram Road Accident: విజయనగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగిఉన్న లారీని ఢీకొన్న కారు, నలుగురు మృతి

  • Ek Din: సాయి పల్లవి దేశంలోనే బెస్ట్ యాక్ట్రెస్.. బాలీవుడ్ ఎంట్రీలో అమీర్ ఖాన్ ఎమోషనల్ కామెంట్స్!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions