PM Modi: కాంగ్రెస్ అంటేనే అవినీతి, బంధుప్రీతికి గ్యారెంటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కర్ణాటక ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ తన ప్రచారాన్ని ప్రారంభించారు. గురువారం 10 లక్షల మంది బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వచ్చే కర్ణాటక ఎన్నికల్లో బూత్ స్ఠాయిలో ప్రచారాన్ని పటిష్టం చేయాలని, మెజారిటీతో గెలుపొందాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు ప్రధాని. కాంగ్రెస్ పార్టీ వారంటీ గడువు ముగిసిందని, ఆ పార్టీ ఇచ్చే హామీలకు అర్థం లేదని అన్నారు. ఉచితాల వల్ల రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని, దేశాన్ని, ప్రభుత్వాన్ని ఇలా నడపలేమని ప్రధాని పునరుద్ఘాటించారు.
Read Also: Janvi Kapoor : ఉర్ఫీని మించి చూపిస్తున్న జాన్వీ..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మనదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు అవినీతికి, అధికారాన్ని సాధనంగా ఉపయోగించుకుంటున్నాయని, దీన్ని సాధించేందుకు సామ, ధాన, దొండోపాయాలను ప్రయోగిస్తున్నారని అన్నారు. ఇటువంటి రాజకీయపార్టీలు దేశ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదని అన్నారు. ప్రధాని శనివారం నుంచి కర్ణాటకలో రెండు రోజుల పాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు. మొత్తం 6 బహిరంగ సభల్లో, 2 రోడ్ షోల్లో పాల్గొననున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ ప్రయోజనాలను బూత్ స్ఠాయిలో ప్రజలకు కార్యకర్తలు వివరించాలని అన్నారు. కన్నడ ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు ప్రయత్నించాలని సూచించారు.
ఉచిత హామీలను ప్రకటించడం ద్వారా ఇతర పార్టీలు ప్రజల్ని ఫూల్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, కానీ మీ భవిష్యత్తు, మీ భవిష్యత్ తరాల గురించి ఆలోచించడం మీ కర్తవ్యం అని ఆయన అన్నారు. కాంగ్రెస్ అంటే అవినీతి, బంధుప్రీతికి గ్యారెంటీ అని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్ నిజమైన హామీలను ఇవ్వలేని స్థితికి చేరుకుందని, కాంగ్రెస్ పార్టీ వారంటీ గడవు ముగిసిందని విమర్శించారు. అవినీతికి కాంగ్రెస్ కారణం కాబట్టే, దాన్ని అంతం చేసేందుకు ఆసక్తి చూపడం లేదని అన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో కేంద్ర పథకాలు అమలు కాకుండా చూస్తున్నారని, అవి అమలైతే మోదీకి మంచి పేరు వస్తుందని వారు భయపడుతున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!