PM Modi: ఇజ్రాయిల్ దాడిని ఖండించిన మోడీ, ఖతార్ ఎమిర్కు ఫోన్ కాల్..
- ఖతార్పై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన ప్రధాని మోడీ..
- దౌత్యం, చర్చలతో సమస్యను పరిష్కరించుకోవాలని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: హమాస్ పొలిటకల్ బ్యూరో నాయకులే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. అయితే, ఈ దాడులను ప్రధాని నరేంద్రమోడీ ఖండించారు. దాడిపై విచారం వ్యక్తం చేస్తూ, తీవ్ర ఆందోళన తెలియజేశారు. తాను ఈ విషయమై ఖతాన్ ఎమిర్తో మాట్లాడానని, ఖతార్ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడాన్ని ఖండించానని, వివాదాలు పరిష్కరించుకోవడానికి చర్చించుకోవాలని పిలుపునిచ్చినట్లు ప్రధాని మోడీ తెలిపారు.
Read Also: CPL 2025 Robbery: తుపాకీతో బెదిరించి.. ముగ్గురు క్రికెటర్లను దోచుకున్న దుండగులు!
Also Read
- Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
- Bulldozer Action: బెంగాల్లో బుల్డోజర్ చర్యలు.. హౌరా స్టేషన్ బయట ఆక్రమణలు తొలగింపు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
“ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీతో మాట్లాడి దోహాలో జరిగిన దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోదర దేశమైన ఖతార్ యొక్క సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని భారతదేశం ఖండిస్తోంది” అని ప్రధాని ట్వీట్ చేశారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని ప్రధాని నొక్కిచెప్పారు. పరిస్థితి మరింత తీవ్రతరం కాకుండా సంయమనం పాటించాలని కోరారు. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని నొక్కిచెబుతూనే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ దృఢమైన మద్దతు ఇస్తుందని అన్నారు.
ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్స్లో కనీసం ఐదుగురు మరణించారు. వీరిలో హమాస్ ముఖ్యనేతలకు సంబంధించి ముగ్గురు బాడీ గార్డులు ఉన్నారు. ఖలీల్ అల్ హయ్యా కుమారుడు హమ్మమ్ అల్ హయ్యా, అతడి కార్యాలయ నిర్వాహకుడు జిహాద్ లాబాద్ ఇద్దరు మరణించినట్లు హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు సుహైల్ అల్ హిందీ తెలిపారు. ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన మోడీ, ప్రాంతీయ శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి ఖతార్ చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసించారు. కాల్పుల విరమణ, బందీల విడుదలలో ఖతార్ మధ్యవర్తిత్వ పాత్రను ప్రధాని ప్రస్తావించారు.
తాజావార్తలు
-
DRAGON : ఎన్టీఆర్ – నీల్ టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత
-
Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..