CPL 2025 Robbery: తుపాకీతో బెదిరించి.. ముగ్గురు క్రికెటర్లను దోచుకున్న దుండగులు!
- కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2025లో దోపిడీ
- ముగ్గురు క్రికెటర్లను దోచుకున్న దుండగులు
- క్రికెటర్లకు భద్రతను కట్టుదిట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2025లో ఆడుతున్న ముగ్గురు క్రికెటర్లను దుండగులు తుపాకీతో బెదిరించి నిలువునా దోచుకున్నారు. ఈ సంఘటన సెప్టెంబర్ 9న అర్థరాత్రి బార్బడోస్లో చోటుచేసుకుంది. సెయింట్స్ కిట్స్కు చెందిన ఇద్దరు ప్లేయర్స్, నెవిస్ పేట్రియాట్స్కు చెందిన ఓ ప్లేయర్ సహా సీపీఎల్కు చెందిన ఓ అధికారిని దుండగులు దోచుకున్నారు. ప్లేయర్ ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొని తిరిగి వస్తుండగా దుండగులు వారిపై దాడికి దిగారు.
దుండగులు తుపాకీతో బెదిరించి ఓ క్రికెటర్ మెడలోని గొలుసును దోచేశారు. మిగతా క్రికెటర్ల వద్ద నుంచి విలువైన ఆభరణాలు, వస్తువులు దోపిడీ చేశారు. ఈ ఘటనలో దుండగులు ఓ తుపాకీని వదిలేసి పారిపోయారు. పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో క్రికెటర్లు ఎవరూ గాయపడకపోవడం సంతోషించాల్సిన విషయం. దుండగులతో ప్లేయర్స్ గొడవపడకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన నేపథ్యంలో క్రికెటర్లకు భద్రతను కట్టుదిట్టం చేశారు. బాధిత ప్లేయర్స్ వివరాలు ఇంకా తెలియరాలేదు.
Also Read
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
Also Read: Abhishek Sharma: అయ్య బాబోయ్.. ఏకంగా 30 సిక్స్లు బాదిన అభిషేక్ శర్మ!
సీపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో బార్బడోస్ రాయల్స్ చివరి స్థానంలో ఉంది. రోవ్మన్ పావెల్ నేతృత్వంలోని జట్టు ఇప్పటివరకు టోర్నమెంట్లో ఒకే ఒక్క విజయం సాధించింది. 9 మ్యాచ్ల్లో 5 విజయాలతో సెయింట్ లూసియా కింగ్స్ (12 పాయింట్లు) అగ్రస్థానంలో ఉంది. ట్రిబాగో (12 పాయింట్లు) టీమ్ రెండవ స్థానంలో ఉంది. రెండవ రౌండ్ సెప్టెంబర్ 16న జరగనున్న ఎలిమినేటర్తో ప్రారంభమవుతుంది. మొదటి క్వాలిఫైయర్ మరుసటి రోజే జరుగుతుంది. ఎలిమినేటర్లో గెలిచిన జట్టు, మొదటి క్వాలిఫైయర్లో ఓడిన జట్టు సెప్టెంబర్ 19న జరిగే రెండవ క్వాలిఫైయర్లో తలపడతాయి. ఫైనల్ సెప్టెంబర్ 21న జరుగుతుంది.
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్కు డబుల్ ధమాకా.. అఫ్గాన్తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!