PM Modi: తేజస్వీ యాదవ్ తండ్రి పాపాలను దాచడానికి ప్రయత్నిస్తున్నాడు..
- తేజస్వీ యాదవ్ తండ్రి పాపాలను దాస్తున్నాడు..
- బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ..
- కాంగ్రెస్, ఆర్జేడీలపై తీవ్ర విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ప్రధాని నరేంద్రమోడీ తన ప్రచారాన్ని తీవ్రం చేశారు. సోమవారం, ప్రధాని మోడీ ఆర్జేడీ పార్టీపై లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పాపాలను దాచడానికి ప్రయత్నిస్తున్నాడని, ఆయన ఫోటోలను ఆర్జేడీ పోస్టర్లలో మూలకు ఉంచారని ప్రధాని అన్నారు.
Read Also: AP High Court: చిన్నారి వైష్టవి కిడ్నాప్, హత్య కేసు.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
కతియార్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకు పేర్లను నేరుగా ప్రస్తావించకుండా, ‘‘జంగిల్ రాజ్కే యువరాజ్’’ అంటూ మాట్లాడారు. పెద్ద నాయకుడిగా చెప్పుకునే లాలూ ఫోటోలు ఆర్జేడీ పోస్టర్లపై ఉంచకపోవడంపై మాట్లాడుతూ..జంగిల్ రాజ్ భారాన్ని మోస్తున్నందు వల్లే ఇలా చేస్తున్నాడని అన్నారు. బీహార్లో అత్యంత అవినీతి కుటుంబం ఆర్జేడీ కుటుంబం అని, దేశంలో అత్యంత అవినీతి కుటుంబం కాంగ్రెస్ అని ప్రధాని ఆరోపించారు. తేజస్వీ యాదవ్ ను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అతి కష్టం మీద అంగీకరించిందని అన్నారు. ఆర్జేడీ ఓడిపోయేందుకు కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
బీహారీలను ఎగతాళి చేసే తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రుల్ని కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులు రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారని అన్నారు. ఎన్డీయే పాలన అభివృద్ధిని అందిస్తే, ఆర్జేడీ ఆటవిక పాలనను అందించిందని దుయ్యబట్టారు. ఆర్జేడీ-కాంగ్రెస్లు రెండూ చొరబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, అయోధ్యలో రామమందిరం, ఛత్ పూజల్ని అపహాస్యం చేస్తు్న్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. ఆర్జేడీ మతోన్మాదుల ఒత్తిడితో వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తామని చెబుతోందని అన్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!