PM Modi: తేజస్వీ యాదవ్ తండ్రి పాపాలను దాచడానికి ప్రయత్నిస్తున్నాడు..
- తేజస్వీ యాదవ్ తండ్రి పాపాలను దాస్తున్నాడు..
- బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ..
- కాంగ్రెస్, ఆర్జేడీలపై తీవ్ర విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉండటంతో ప్రధాని నరేంద్రమోడీ తన ప్రచారాన్ని తీవ్రం చేశారు. సోమవారం, ప్రధాని మోడీ ఆర్జేడీ పార్టీపై లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇండీ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పాపాలను దాచడానికి ప్రయత్నిస్తున్నాడని, ఆయన ఫోటోలను ఆర్జేడీ పోస్టర్లలో మూలకు ఉంచారని ప్రధాని అన్నారు.
Read Also: AP High Court: చిన్నారి వైష్టవి కిడ్నాప్, హత్య కేసు.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
కతియార్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. తండ్రీకొడుకు పేర్లను నేరుగా ప్రస్తావించకుండా, ‘‘జంగిల్ రాజ్కే యువరాజ్’’ అంటూ మాట్లాడారు. పెద్ద నాయకుడిగా చెప్పుకునే లాలూ ఫోటోలు ఆర్జేడీ పోస్టర్లపై ఉంచకపోవడంపై మాట్లాడుతూ..జంగిల్ రాజ్ భారాన్ని మోస్తున్నందు వల్లే ఇలా చేస్తున్నాడని అన్నారు. బీహార్లో అత్యంత అవినీతి కుటుంబం ఆర్జేడీ కుటుంబం అని, దేశంలో అత్యంత అవినీతి కుటుంబం కాంగ్రెస్ అని ప్రధాని ఆరోపించారు. తేజస్వీ యాదవ్ ను సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అతి కష్టం మీద అంగీకరించిందని అన్నారు. ఆర్జేడీ ఓడిపోయేందుకు కాంగ్రెస్ శాయశక్తులా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
బీహారీలను ఎగతాళి చేసే తెలంగాణ, తమిళనాడు ముఖ్యమంత్రుల్ని కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులు రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారని అన్నారు. ఎన్డీయే పాలన అభివృద్ధిని అందిస్తే, ఆర్జేడీ ఆటవిక పాలనను అందించిందని దుయ్యబట్టారు. ఆర్జేడీ-కాంగ్రెస్లు రెండూ చొరబాటుదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని, అయోధ్యలో రామమందిరం, ఛత్ పూజల్ని అపహాస్యం చేస్తు్న్నారని ప్రధాని మోడీ ఆరోపించారు. ఆర్జేడీ మతోన్మాదుల ఒత్తిడితో వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తామని చెబుతోందని అన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!