AP High Court: చిన్నారి వైష్టవి కిడ్నాప్, హత్య కేసు.. ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- సంచలనం సృష్టించిన చిన్నారి వైష్ణవి కిడ్నాప్, హత్య కేసు..
- ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP High Court: విజయవాడలో సంచలనం సృష్టించిన చిన్నారి వైష్ణవి కిడ్నాప్, హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ట్రైల్ కోర్టులో తమకు విధించిన శిక్షను రద్దు చేయాలని నిందితులు హైకోర్టులో వేసిన పిటిషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో నిందితులు మోర్ల శ్రీనివాసరావు, యంపరాల జగదీష్ అప్పీళ్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీరికి జీవిత ఖైదు విధింపును హైకోర్టు సమర్థించింది. మరో నిందితుడు పంది వెంకట్రావును నిర్దోషిగా ధర్మాసనం ప్రకటించింది. ట్రైల్ కోర్టు వెంకట్రావుకు విధించిన జీవితఖైదును హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
Read Also: Nagavamsi : వార్-2 దెబ్బకు షాకింగ్ నిర్ణయం తీసుకున్న నాగవంశీ
Also Read
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- Pawan Kalyan Deeksha: మళ్లీ దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్
కాగా, 2010 జనవరి 30న పలగాని ప్రభాకర్ రావు కుమార్తె వైష్ణవిని విజయవాడలో కిడ్నాప్ చేసి నిందితులు హత్య చేశారు. గుంటూరు ఆటోనగర్ లో శారద ఇండ్రస్ట్రీలో విద్యుత్ కొలిమిలో మృతదేహాన్ని వేసి నిందితులు బూడిద చేసారు. కుమార్తె హత్య గురించి తెలిసి గుండె పోటుతో ప్రభాకర్ మరణించారు. విచారణ అనంతరం 2018 జూన్ 14న ఈ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు ఖరారు చేస్తూ విజయవాడ సెషన్స్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో నిందితులు వేరువేరుగా అప్పీళ్లు చేయగా విచారణ జరిపి కోర్టు తాజా ఆదేశాలు ఇచ్చింది..
తాజావార్తలు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
-
LPG Supply: గ్యాస్ వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక కష్టాలు తీరినట్లే..
-
CM Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గిఫ్ట్.. రూ.1 కోటి రక్షణ
-
Passport Fee: 14 ఏళ్ల తర్వాత పాస్పోర్ట్ ఫీజులు పెంపు.. ఎంత పెరిగాయంటే..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!