PM Modi: చైనాతో సంబంధాలకు సరిహద్దుల్లో శాంతి అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గల్వాన్ ఘర్షణ, సరిహద్దుల్లో సైనిక మోహరింపు తరువాత భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తాజాగా రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాలకు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి మరియు ప్రశాంతత అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్రమోడీ వాల్ స్ట్రీట్ జర్నల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, చట్ట నియమాలను పాటించడం, విభేదాలు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో మాకు నమ్మకం ఉందని, అదే సమయంలో భారత్ తన సార్వభౌమాధికారాన్ని, గౌరవాన్ని పరరక్షించడంలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Also Read
- Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
- Putin: విదేశాల ఒత్తిడికి భారత్ ఎన్నడూ లొంగలేదు.. ట్రంప్కు పుతిన్ స్ట్రాంగ్ మెసేజ్..
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన TGPSC..
Read Also: Bihar: టోల్ ప్లాజా దగ్గర రూ. 50 కొట్టేశాడని సెక్యూరిటీ గార్డ్ ను చంపిన దుండగులు
2020లో భారత్-చైనా సరిహద్దుల్లో గాల్వాన్ ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో భారత జవాన్లు మరణించారు. ఆ తరువాత భారత దళాల దాడిలో కూడా చాలా మంది చైనా సైనికులు చనిపోయినట్లు ఇతర దేశాలు తెలిపాయి. అయితే చైనా మాత్రం కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయినట్లు క్లెయిమ్ చేసింది. 2000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో ఇటు భారత్, అటు చైనా బలగాలు మోహరించి ఉన్నాయి. శాంతి నెలకొల్పే లక్ష్యంతో ఇప్పటి వరకు ఇరు దేశాల సైనికుల మధ్య 18 రౌండ్ల సైనిక చర్యలు జరిగాయి.
ఇదిలా ఉంటే ప్రధాన మోడీ అమెరికా పర్యటనపై చైనా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. తన అక్కసును వెళ్లగక్కుతోంది. భారత్ ను ఉపయోగించుకుని చైనాను అడ్డుకోవాలని అమెరికా చూస్తోందని, ఆ ట్రాప్ లో భారత్ పడొద్దని సూచించింది. చైనా వాణిజ్యాన్ని, భారత్ తో సహా మరే ఇతర దేశం కూడా భర్తీ చేయలేదని తన మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ లో ఓ కథనంలో పేర్కొంది.
తాజావార్తలు
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!