PM Modi: చైనాతో సంబంధాలకు సరిహద్దుల్లో శాంతి అవసరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: గల్వాన్ ఘర్షణ, సరిహద్దుల్లో సైనిక మోహరింపు తరువాత భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. తాజాగా రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాలకు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి మరియు ప్రశాంతత అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. మంగళవారం అమెరికా పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్రమోడీ వాల్ స్ట్రీట్ జర్నల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, చట్ట నియమాలను పాటించడం, విభేదాలు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడంలో మాకు నమ్మకం ఉందని, అదే సమయంలో భారత్ తన సార్వభౌమాధికారాన్ని, గౌరవాన్ని పరరక్షించడంలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
Read Also: Bihar: టోల్ ప్లాజా దగ్గర రూ. 50 కొట్టేశాడని సెక్యూరిటీ గార్డ్ ను చంపిన దుండగులు
2020లో భారత్-చైనా సరిహద్దుల్లో గాల్వాన్ ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో పదుల సంఖ్యలో భారత జవాన్లు మరణించారు. ఆ తరువాత భారత దళాల దాడిలో కూడా చాలా మంది చైనా సైనికులు చనిపోయినట్లు ఇతర దేశాలు తెలిపాయి. అయితే చైనా మాత్రం కేవలం ఇద్దరు మాత్రమే చనిపోయినట్లు క్లెయిమ్ చేసింది. 2000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో ఇటు భారత్, అటు చైనా బలగాలు మోహరించి ఉన్నాయి. శాంతి నెలకొల్పే లక్ష్యంతో ఇప్పటి వరకు ఇరు దేశాల సైనికుల మధ్య 18 రౌండ్ల సైనిక చర్యలు జరిగాయి.
ఇదిలా ఉంటే ప్రధాన మోడీ అమెరికా పర్యటనపై చైనా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. తన అక్కసును వెళ్లగక్కుతోంది. భారత్ ను ఉపయోగించుకుని చైనాను అడ్డుకోవాలని అమెరికా చూస్తోందని, ఆ ట్రాప్ లో భారత్ పడొద్దని సూచించింది. చైనా వాణిజ్యాన్ని, భారత్ తో సహా మరే ఇతర దేశం కూడా భర్తీ చేయలేదని తన మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ లో ఓ కథనంలో పేర్కొంది.
తాజావార్తలు
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
-
Amen : “గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్కు రావద్దు”.. హారర్ మూవీ మేకర్స్ సంచలన హెచ్చరిక!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!