Delhi New CM: ఢిల్లీ సీఎం రేసు నుంచి తప్పుకున్న పర్వేష్ వర్మ! కారణమిదే!
- ఢిల్లీ సీఎం రేసు నుంచి తప్పుకున్న పర్వేష్ వర్మ!
- మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఫార్ములా అమలు చేసే యోచనలో హైకమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 10 రోజులైంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ప్రధాని మోడీ రెండు దేశాల పర్యటన కోసం ఫ్రాన్స్, అమెరికా వెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి ఎంపిక వాయిదా పడింది. అయితే మూడ్రోజుల క్రితం మోడీ విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్నారు. ఇక ముఖ్యమంత్రి ఎంపిక అంశంపై సోమవారం శాసనసభా పక్ష సమావేశం ఉంటుందని ప్రకటించారు. అనూహ్యంగా హైకమాండ్ గురువారానికి వాయిదా వేసింది. అంటే 20న ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం ఉంటుందని అంతా భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Call Merging Scam: యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. కాల్ మెర్జ్ చేస్తున్నారా? మీ ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త!
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ఇదిలా ఉంటే నిన్నామొన్నటిదాకా ఢిల్లీ ముఖ్యమంత్రిగా న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రముఖంగా వినిపించింది. ఢిల్లీ సీఎం ఆయనేనంటూ ప్రచారం జరిగింది. కానీ సోమవారం అంచనాలన్నీ తారుమరయ్యాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేసు నుంచి పర్వేష్ వర్మ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలోనూ బీజేపీ మహిళా ముఖ్యమంత్రులు లేరు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పీఠంపై మహిళకు ఛాన్స్ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అంతేకాకుండా మధ్యప్రదేశ్, రాజస్థాన్లో మాదిరిగా ఢిల్లీలో కూడా తొలిసారి ఎన్నికైన అభ్యర్థినే ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టాలని హైకమాండ్ ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో దాదాపుగా పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పుకున్నట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆయన మద్దతుదారుల్లో ఆశలపై నీడలు కమ్ముకున్నట్లు సమచారం.
ప్రముఖంగా ముఖ్యమంత్రి రేసులో రేఖ గుప్తా పేరు వినిపిస్తోంది. మహిళకు ఛాన్స్ ఇస్తే గనుక ఈమెను ఎంపిక చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. అలాగే బీజేవైఎం ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా ఉండటంతో పాటు కౌన్సిలర్గా, ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా కూడా ఉన్నారు. ఇవన్నీ ఆమెకు కలిసొచ్చే అంశాలుగా కనబడుతున్నాయి. అలాగే జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్లకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఆశిష్ సూద్, అలాగే శిఖా రాయ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఉత్కంఠకు తెరపడాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy : ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ కఠిన చర్యలు.. ఉచిత ఇసుక సరఫరాకు ప్రత్యేక కమిటీ
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..