CM Revanth Reddy : ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ కఠిన చర్యలు.. ఉచిత ఇసుక సరఫరాకు ప్రత్యేక కమిటీ
- అక్రమ ఇసుక రవాణాపై సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు
- ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరా
- ఇసుక అక్రమ రవాణా అడ్డుకట్ట – అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణలో ఇసుక అక్రమ రవాణా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. సోమవారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఈ సమస్యపై సమగ్రంగా చర్చించారు. అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అణచివేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొనగా, ఇసుక రీచ్ల తనిఖీలు, అక్రమ రవాణా, ఓవర్ లోడ్ వాహనాల పర్యవేక్షణ, విజిలెన్స్ దాడులు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
GHMC: కాంగ్రెస్ ఏడు, ఎంఐఎం ఎనిమిది నామినేషన్స్ దాఖలు
ఇటీవల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరా చేయాలని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదల గృహ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ. 5 లక్షల సాయం అందిస్తుండగా, అదనపు ఖర్చును తగ్గించేందుకు ఇసుకను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.
ఈ ఉచిత ఇసుక సరఫరా అమలు కోసం నలుగురు ఉన్నతాధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ, ఇసుక సరఫరా విధానం, లాజిస్టిక్స్, భవిష్యత్తులో తలెత్తే సమస్యలు మొదలైన వాటిపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి సూచనలు అందించనుంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం స్థానిక వాగులు, చెరువుల నుంచి ఇసుకను తీసుకోవడం వల్ల ఖర్చు తక్కువగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అక్రమ రవాణా అడ్డుకట్ట తప్పనిసరి అని సీఎం పేర్కొన్నారు. అందుకే, అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతోపాటు, ప్రభుత్వ పథకాలకు అవసరమైన ఇసుక సరఫరా నిరాటంకంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Earthquake : ప్రతిరోజూ 1000భూకంపాలు… ప్రపంచంలోని ఈ ప్రాంతం ఎందుకు ఇలా ఇబ్బంది పడుతుంది ?
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!