Call Merging Scam: యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. కాల్ మెర్జ్ చేస్తున్నారా? మీ ఖాతా ఖాళీ అవుతుంది జాగ్రత్త!
- యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్
- కొత్త కాల్ మెర్జింగ్ స్కామ్
- కాల్ మెర్జ్ చేశారో మీ ఖాతాలోని డబ్బులు ఖాళీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీని వాడుకుని సైబర్ నేరగాళ్లు చేసే మోసాలు అన్నీఇన్నీ కావు. ఫేక్ మెసేజ్ లు, కాల్స్, లింక్స్ పంపి అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. డిజిటల్ అరెస్ట్, మిస్డ్ కాల్ స్కామ్ ల ద్వారా బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తున్నారు. ఇప్పుడు మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. అదే కాల్ మెర్జింగ్ స్కామ్. దీనిపై యూజర్లకు యూపీఐ బిగ్ అలర్ట్ ఇచ్చింది. మీరు పొరపాటున కాల్ మెర్జ్ చేశారో మీ ఖాతాలోని డబ్బులు ఖాళీ అయినట్టే. మరి కాల్ మెర్జింగ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.
Also Read
- RBI: రూపాయికి కొంత ఉపశమనం.. ఆర్బీఐ చర్యలతో భారీ ఊరట..
- SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్డాక్పై
- Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
- Petrol Diesel Price Hike: పెట్రోల్-డీజిల్ ధరలపై భారీ హెచ్చరికలు.. మరోసారి పెరుగుతాయా?
కాల్ మెర్జింగ్ స్కామ్ లో సైబర్ క్రిమినల్స్ యూపీఐ యూజర్లను కాల్ మెర్జింగ్ పేరిట మోసం చేసి తెలియకుండానే వారి వన్ టైమ్ పాస్ వర్డ్ లను OTP కాజేస్తున్నారు. ఇది స్కామర్లు అనధికార లావాదేవీలు, ఖాతాలు లూటీ చేయడానికి అనుకూలంగా మారింది. అయితే దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI), అఫీషియల్ X ఖాతాలో, వినియోగదారులను హెచ్చరించింది, “స్కామర్లు మిమ్మల్ని మోసం చేసి OTP లను దొంగిలించడానికి కాల్ మెర్జింగ్ను ఉపయోగిస్తున్నారు. స్కామర్ల వలలో పడకండి. అప్రమత్తంగా ఉండండి, మీ డబ్బును కాపాడుకోండి.” అంటూ అలర్ట్ చేసింది.
Also Read:CM Revanth Reddy : ఇసుక అక్రమ రవాణాపై సీఎం రేవంత్ కఠిన చర్యలు.. ఉచిత ఇసుక సరఫరాకు ప్రత్యేక కమిటీ
ఇంతకీ ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ ఎలా జరుగుతుందంటే.. ఒక అపరిచితుడు మీ ఫ్రెండ్ నుంచి నెంబర్ తీసుకుని కాల్ చేస్తున్నట్లు చెప్పడంతో ప్రారంభమవుతుంది.ఆ తర్వాత స్కామర్ ఆ స్నేహితుడు వేరే నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాడని కాల్ మెర్జ్ చేయమని కోరతాడు. కానీ ఆ కాల్ ఫ్రెండ్ నుంచి వచ్చింది కాదు OTP నుంచి వచ్చింది. ఇక కాల్ మెర్జ్ కాగానే ఆ వ్యక్తికి తెలియకుండానే వారి బ్యాంక్ నుంచి చట్టబద్దమైన OTP ధృవీకరణ కాల్ తో కనెక్ట్ అవుతారు.
Also Read:CM Chandrababu: జీబీఎస్పై సీఎం సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
దీంతో స్కామర్ కాల్ లోని OTPని విని మీ బ్యాంక్ ఖాతాను లూటీ చేస్తాడు. ఈ కాల్ మెర్జింగ్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే తెలియని నెంబర్లతో వచ్చిన కాల్స్ ను మెర్జ్ చేయకూడదు. బ్యాంకు నుంచి లేదా ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చినట్లైతే నిజ నిర్థారణ చేసుకోవాలి. మీరు చేయని ట్రాన్సాక్షన్ కు OTP వస్తే మీ బ్యాంకును అప్రమత్తం చేసి 1930కి కంప్లైంట్ చేయాలి.
Scammers are using call merging to trick you into revealing OTPs. Don’t fall for it! Stay alert and protect your money. 🚨💳 Share this post to spread awareness!#UPI #CyberSecurity #FraudPrevention #StaySafe #OnlineFraudAwareness #SecurePayments pic.twitter.com/kZ3TmbyVag
— UPI (@UPI_NPCI) February 14, 2025
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!