Pakistan: భారత్ చేసిన ఈ విషయాన్ని కూడా పాకిస్తాన్ కాపీ కొట్టింది..
- భారత్ చేసే ప్రతీ విషయాన్ని కాపీ కొడుతున్న పాకిస్తాన్..
- దౌత్య పర్యటనని కూడా కాపీ చేసిన దాయాది..
- బిలావల్ భుట్టో ఆధ్వర్యంలో విదేశీ పర్యటనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఆపరేషన్ సిందూర్తో ఎయిర్ బేసుల్ని కోల్పోయినా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. తాము భారత్పై గెలిచామంటూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విజయోత్సవాలు చేసుకుంటున్నారు. వీటి ద్వారా పాకిస్తాన్ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, సంఘర్షణ తర్వాత భారత్ చేస్తున్న ప్రతీ విషయాన్ని పాకిస్తాన్ కాపీ కొడుతోంది. భారత్ ఏం చేస్తుందో, ఆ తర్వాత మేము కూడా అదే చేస్తామని పాకిస్తాన్ అంటోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ మన రక్షణ బలగాలకు మరింత ఆత్మ విశ్వాసం వచ్చేలా, పలు సైనిక స్థావరాలను సందర్శించారు. సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. దీని తర్వాత, పాక్ ప్రధాని కూడా ఇదే తరహాలో పాక్ సైనిక స్థావరాలను సందర్శించారు.
Also Read
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
- Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
- Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తీరును, పాక్ ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతు గురించి తెలియజేయడం, ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి తెలియజేయడానికి భారత్ అఖిలపక్షంతో కూడిన 7 దౌత్య బృందాలను విదేశాలకు పంపుతోంది. ఆయా దేశాల్లో మన ప్రజాప్రతినిధులు భారత్ టెర్రరిజం పట్ల ‘‘జీరో టాలరెన్స్’’ విధానం గురించి చెబుతారు.
ఇప్పుడు దీనిని కూడా పాకిస్తాన్ కాపీ కొట్టింది. మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అధ్యక్షతన పాకిస్తాన్ శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరించేందుకు దౌత్య బృందాలను విదేశాలకు పంపుతున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ విషయాన్ని భుట్టో ఎక్స్ ద్వారా తెలియజేశారు. ‘‘ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నన్ను సంప్రదించారు. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ శాంతి వాదనల్ని వివరించడానికి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని అభ్యర్థించారు. ఈ బాధ్యత స్వీకరించడం, సవాలుతో కూడిన ఈ సమయంలో పాకిస్తాన్కి సేవ చేయడానికి కట్టుబడి ఉండటం నాకు గౌరవంగా ఉంది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..