Pakistan: భారత్ చేసిన ఈ విషయాన్ని కూడా పాకిస్తాన్ కాపీ కొట్టింది..
- భారత్ చేసే ప్రతీ విషయాన్ని కాపీ కొడుతున్న పాకిస్తాన్..
- దౌత్య పర్యటనని కూడా కాపీ చేసిన దాయాది..
- బిలావల్ భుట్టో ఆధ్వర్యంలో విదేశీ పర్యటనలు..
Pakistan: ఆపరేషన్ సిందూర్తో ఎయిర్ బేసుల్ని కోల్పోయినా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. తాము భారత్పై గెలిచామంటూ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ విజయోత్సవాలు చేసుకుంటున్నారు. వీటి ద్వారా పాకిస్తాన్ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, సంఘర్షణ తర్వాత భారత్ చేస్తున్న ప్రతీ విషయాన్ని పాకిస్తాన్ కాపీ కొడుతోంది. భారత్ ఏం చేస్తుందో, ఆ తర్వాత మేము కూడా అదే చేస్తామని పాకిస్తాన్ అంటోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని నరేంద్రమోడీ మన రక్షణ బలగాలకు మరింత ఆత్మ విశ్వాసం వచ్చేలా, పలు సైనిక స్థావరాలను సందర్శించారు. సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. దీని తర్వాత, పాక్ ప్రధాని కూడా ఇదే తరహాలో పాక్ సైనిక స్థావరాలను సందర్శించారు.
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తీరును, పాక్ ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతు గురించి తెలియజేయడం, ఆపరేషన్ సిందూర్, పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి తెలియజేయడానికి భారత్ అఖిలపక్షంతో కూడిన 7 దౌత్య బృందాలను విదేశాలకు పంపుతోంది. ఆయా దేశాల్లో మన ప్రజాప్రతినిధులు భారత్ టెర్రరిజం పట్ల ‘‘జీరో టాలరెన్స్’’ విధానం గురించి చెబుతారు.
ఇప్పుడు దీనిని కూడా పాకిస్తాన్ కాపీ కొట్టింది. మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అధ్యక్షతన పాకిస్తాన్ శాంతి కోసం చేస్తున్న ప్రయత్నాలను వివరించేందుకు దౌత్య బృందాలను విదేశాలకు పంపుతున్నట్లు ఆ దేశం ప్రకటించింది. ఈ విషయాన్ని భుట్టో ఎక్స్ ద్వారా తెలియజేశారు. ‘‘ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నన్ను సంప్రదించారు. అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ శాంతి వాదనల్ని వివరించడానికి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించాలని అభ్యర్థించారు. ఈ బాధ్యత స్వీకరించడం, సవాలుతో కూడిన ఈ సమయంలో పాకిస్తాన్కి సేవ చేయడానికి కట్టుబడి ఉండటం నాకు గౌరవంగా ఉంది’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?