Pakistan: పాక్లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్ను కవ్వించే చర్య..
- గిల్గిట్-బాల్టిస్తాన్కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా కోరిన అసెంబ్లీ.
- అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్దతుతో ఏకగ్రీవ తీర్మానం.
- జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి.
- గిల్గిట్-బాల్టిస్తాన్ భారత్ అంతర్భాగమేనన్న భారత వైఖరి యథాతథం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(PoK)లో భారీ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. అక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఈ గొడవ ఇలా జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ తెరచాటున భారత్ను కవ్వించే చర్యలకు పాల్పడుతోంది. పీఓకేలో భాగంగా ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్ను పాకిస్తాన్ తన భూభాగంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. పాక్లో 5వ ప్రావిన్సుగా(రాష్ట్రం) ఆ దేశ రాజ్యాంగంలో చేర్చాలని చూస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా అనే 4 ప్రావిన్సులు ఉన్నాయి.
పాకిస్తాన్ పరిపాలన కింద ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతానికి తాత్కాలిక ప్రావిన్స్ హోదా కల్పించాలని కోరుతూ అక్కడి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానానికి అధికార, ప్రతిపక్ష సభ్యులు అందరూ మద్దతు ఇవ్వడం విశేషం. అసెంబ్లీలో ఎమ్మెల్యే జలాల్ అలీ షా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. 2009లో గిల్గిత్-బాల్టిస్తాన్ (ఎంపవర్మెంట్ అండ్ సెల్ఫ్-గవర్నెన్స్) ఆర్డర్ ద్వారా శాసనసభ ఏర్పడింది. 2018 గిల్గిట్-బాల్టిస్తాన్ ఆర్డర్ ద్వారా శాసనసభకు మరిన్ని చట్టసభ అధికారాలు కల్పించిన విషయాన్ని తాజాగా ప్రవేశపెట్టిన తీర్మానంలో ప్రస్తావించారు. ఇప్పుడు ఏకంగా పాకిస్తాన్లో తమకు రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read
- TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
- FSSAI Action on Nestle: నెస్లే ఇండియాకు ఎఫ్ఎస్ఎస్ఏఐ బిగ్ షాక్.. పసిపిల్లల ఆహార ఉత్పత్తులపై లీగల్ నోటీసులు
- Fake IAS Officer: నకిలీ ఐఏఎస్ తృప్తి సింగ్ కేసులో కొత్త ట్విస్ట్.. పోలీసులపైనే లంచం ఆరోపణలు
దివంగత నేత సర్టాజ్ అజీజ్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేసి, గిల్గిట్-బాల్టిస్తాన్కు తాత్కాలిక ప్రావిన్స్ హోదా ఇవ్వాలని అసెంబ్లీ పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ హోదా లభిస్తే ఇక్కడి ప్రజలకు పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభిస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే ఈ తీర్మానం భారత్ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించేదిగా ఉంది. గిల్గిట్-బాల్టిస్తాన్ను పాకిస్తాన్ వేరుగా పరిపాలిస్తోంది. ఇది జమ్మూ కాశ్మీర్, లడఖ్లతో పాటు భారత్లో అంతర్భాగమే అని భారత్ ఎప్పటి నుంచో స్పష్టం చేస్తోంది. ఈ ప్రాంతాల హోదాను మార్చేందుకు పాకిస్తాన్ చేపట్టే ఏ చర్యకు కూడా చట్టబద్ధత లేదని, వాటితో వాస్తవ పరిస్థితి మారదని భారత్ పలుమార్లు పేర్కొంది.
తాజావార్తలు
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
-
MLA Danam Nagender : అసెంబ్లీ జీరో అవర్ దానం నాగేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..