Jammu Kashmir Encounter: 24 గంటలుగా ఎన్కౌంటర్.. పాక్ కీలక ఉగ్రవాది హతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir Encounter: జమ్మూకాశ్మీర్లో గత 24 గంటలుగా ఎన్కౌంటర్ జరుగుతోంది. రాజౌరి ప్రాంతంలో కలకోట్ అటవీ ప్రాంతంలో జరగుతున్న ఎన్కౌంటర్లో ఇప్పటికే నలుగురు ఆర్మీ జవాన్లు మరణించాగా.. గాయపడిన మరో సైనికుడు ఈ రోజు మరణించాడు. ఇదిలా ఉంటే పాకిస్తాన్కి చెందిన కీలక లష్కరే తోయిబా ఉగ్రవాది భద్రతాబలగాలు హతమార్చాయి. మరణించిన పాక్ ఉగ్రవాదిని ఖారీగా గుర్తించారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని పెంచేందుకు ఇతను ప్రయత్నిస్తున్నాడు. ఐఈడీ తయారీలో శిక్షణ ఇవ్వడంతో పాటు అడవుల్లో గుహల్లో దాక్కోవడం వంటి వాటితో పాటు స్నైపర్ శిక్షణ ఇవ్వడంలో ఖారీ పేరుపొందినట్లు సైన్యం తెలిపింది.
ఖారీ పాకిస్తాన్, ఆఫ్ఘన్లో శిక్షణ పొందారు. లష్కరేతోయిబాలో అత్యంత ముఖ్యమైన ఉగ్రవాద నాయకుడిగా ఉన్నాడు. గత ఏడాది కాలంగా ఖారీ తన ఉగ్రవాద బృందంతో రాజౌరీ-పూంచ్ సెక్టార్లలో క్రియాశీలకంగా ఉన్నాడు. డాంగ్రీ, కంది దాడుల్లో ఇతను ప్రధాన సూత్రధారి.
Also Read
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
Read Also: Central IT Department: కలకలం సృష్టిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు.. రంగం లోకి కేంద్రం
బుధవారం జబిమల్ గ్రామంలోని స్థానిక గుజ్జర్ వ్యక్తి, ఉగ్రవాదులకు ఆహారం నిరాకరించాడు, దీంతో అతనిని ఉగ్రవాదుల కొట్టారు. ఈ విషయాన్ని అతను భద్రతాబలగాలకు చెప్పడంతో ఎన్కౌంటర్ ప్రారంభమైంది. భద్రతా బలగాలు ఈ ప్రాంతంలో భారీ యాంటీ-టెర్రరిస్ట్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు తప్పించకోకుండా అదనపు భద్రతా బలగాలను మోహరించారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు గాయపడినట్లు తెలుస్తోంది. సైనికులు చుట్టుముట్టడంతో సీనియర్ ఆర్మీ కమాండర్లు ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు. మొదట్లో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారని భద్రతా బలగాలు భావించినప్పటికీ.. వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
మరణించిన సైనికుల్లో, ముగ్గురు ప్రత్యేక దళాల కమాండోలు ఉన్నారు. సెప్టెంబర్ నెలలో అనంత్ నాగ్ జిల్లాలోని కోకెర్ నాగ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో కమాండింగ్ ఆఫీసర్, ఆర్మీ మేజర్, జమ్మూ కాశ్మీర్ డీఎస్పీ మరణించారు. రాజౌరీ-పూంచ్ పీర్ పంజాల్ అటవీ ప్రాంతం 2003 నుంచి తీవ్రవాదం నుంచి బయటపడింది. అయితే 2021 నుంచి మళ్లీ తీవ్రవాద కార్యకలాపాలు మొదలయ్యాయి. గత రెండేళ్ల కాలంలో ఈ ప్రాంతంలో 30 మంది ఆర్మీ జవాన్లు మరనించారు. దట్టమైన అటవీ ప్రాంతాలు, గుహలు ఉగ్రవాదులకు స్థావరాలుగా ఉంటున్నాయి. దీంతో ఆపరేషన్ చేసేందుకు వెళ్లిన సైన్యానికి ఈ ప్రాంతంలో ఎదురుదెబ్బలు తాకుతున్నాయి.
తాజావార్తలు
-
Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
-
Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
ట్రెండింగ్
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!