Amit Shah: ఆ కారణంతోనే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది
- ప్రధాని మోడీ బలమైన సంకల్పం
- ఆ కారణంతోనే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైందన్న అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ బలమైన సంకల్పం.. నిఘా సంస్థల కచ్చితమైన సమాచారం.. సాయుధ దళాల అద్భుత ప్రదర్శన వల్లే ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సరిహద్దు భద్రతా దళం (BSF) ఇన్వెస్టిచర్ వేడుక మరియు రుస్తంజీ స్మారక ఉపన్యాసం సందర్భంగా అమిత్ షా ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో బీఎస్ఎఫ్ ప్రదర్శించిన ఆదర్శప్రాయమైన పనితీరును ప్రశంసించారు. సరిహద్దు వెంబడి జరుగుతున్న దుష్ట కార్యకలాపాలను బీఎస్ఎఫ్ దళం సమర్థవంతంగా అడ్డుకున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Shubman Gill: కెప్టెన్గా శుభ్మన్ గిల్.. ఓపెనర్గా రోహిత్ స్థానంలో ఎవరంటే?
Also Read
- Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
- PM Modi: సా.4గంటలకు అన్ని శాఖలతో మోడీ కీలక సమావేశం.. దేనికోసమంటే..!
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
భారత్లో ఉగ్రవాదానికి పాకిస్థానే స్పాన్సర్ అని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదానికి దీటై జవాబు ఇచ్చామని చెప్పారు. పహల్గామ్ దాడులతో అన్ని హద్దులు దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి.. వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిందన్నారు. పాక్లో ఉన్న ఉగ్ర స్థావరాలను భారత్ బయటపెట్టడంతో.. ఆ దేశం ఉగ్రవాదులను పోషిస్తుందనే నిజం మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ను ప్రపంచమంతా కొనియాడిందని అమిత్ షా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Cyber Fraud: డిజిటల్ అరెస్ట్ పేరుతో.. న్యాయవాది నుంచి రూ. 19 లక్షలు కాజేసిన సైబర్ కేటుగాళ్లు
బంగ్లాదేశ్తో సహా అంతర్జాతీయ సరిహద్దులను కాపాడటంలో బీఎస్ఎఫ్ పాత్రను అభినందించారు. పాకిస్థాన్ చేస్తున్న తప్పిదాల వల్ల భారత్ అనేక దశాబ్దాలుగా ఉగ్ర సమస్యను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి భారత్ ఉగ్ర దాడులకు గట్టి బదులిస్తోందని అన్నారు. పహల్గామ్ ఘటన సమయంలో ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి మరీ చంపడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.
ఆపరేషన్ సిందూర్లో కేవలం ఉగ్రవాద స్థావరాలే ధ్వంసమయ్యాయని.. ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. కానీ పాక్ సైన్యం మాత్రం నిషేధిత ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరై.. ఉగ్రవాదానికి మద్దతు పలికారని అమిత్షా అన్నారు. వారి చర్యలను ప్రపంచం మొత్తం చూసిందని.. ఉగ్రవాదుల వెనక ఎవరు ఉన్నారనే విషయం అన్ని దేశాలకు అర్థమయ్యిందని తెలిపారు.
తాజావార్తలు
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
-
Kris Srikanth: తిలక్ వర్మది పెద్ద స్వార్థం.. అతడి కోసం మాత్రమే మ్యాచ్ ఆడాడు.. సంచలన వ్యాఖ్యలు..
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Trump-Modi: మోడీకి ఫోన్ చేయాలి.. ‘‘ఆయన లేస్తారు.. ఆయన కూడా నాలాగే’’.. వెలుగులోకి ట్రంప్ సంభాషణ
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!