Nirmala Sitharaman: “ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్”.. బడ్జెట్ తర్వాత నిర్మలా సీతారామన్ తొలి ఇంటర్వ్యూ
- బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత మొదటిసారి మాట్లాడిన కేంద్ర ఆర్థిక మంత్రి..
- ప్రజల కోసం, ప్రజల చేత తీసుకొచ్చిందే ఈ బడ్జెట్: నిర్మలా సీతారామన్..
- వేతనజీవులకు రూ.12 లక్షల వరకు పన్ను తగ్గింపు వెనక ప్రధాని మోడీ ఉన్నారు: ఆర్థిక మంత్రి నిర్మలా
Nirmala Sitharaman: పార్లమెంట్ లో ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె బడ్జెట్ తర్వాత ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన మొదటి ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ప్రజల కోసం, ప్రజల చేత తీసుకొచ్చిన బడ్జెట్ అన్నారు. అలాగే, నేను ఎక్కడికి వెళ్లినా వినిపించే పదం పన్ను చెల్లింపుల గురించి.. మేం నిజాయితీగా ట్యాక్స్ కడుతున్నాం.. నిజాయితీగా ఉంటూ దేశానికి సేవ చేస్తున్నాం.. మీరు మా కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారని ఆమె తెలిపారు. ఈ అంశంపై ప్రధాని మోడీతో చర్చించిన తర్వాత ఆయన మార్గ నిర్థేశంతో ముందుకు సాగినట్లు చెప్పుకొచ్చింది. అందుకే, ఈ బడ్జెట్లో వేతన జీవులకు బిగ్ రిలీఫ్ కల్పిస్తూ పన్ను తగ్గింపు ఆలోచన వెనక ప్రధాని మోడీ ఉన్నారని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Also Read
- High Voltage Drama: ప్రియుడిపై ప్రేమ.. టవర్పై డ్రామా! సినిమాను మించిన సీన్ చూపించిన మైనర్ బాలిక..
- Judge Suicide: ఢిల్లీలో న్యాయమూర్తి ఆత్మహత్య.. బాత్రూంలో మృతదేహం..
- Central Govt: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. బీమా రంగంలోనే సంచలనం..
- Nashik TCS Case: టీసీఎస్ నాసిక్ నిందితురాలు నిదా ఖాన్కు షాక్..
అయితే, నిజాయితీగా పన్ను చెల్లిస్తున్నప్పటికి తమ ఆకాంక్షలు నెరవేరలేదని కంప్లైంట్ చేస్తున్న మిడిల్ క్లాస్ ప్రజల గొంతు తాము విన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, ప్రధాని మోడీ అన్ని రంగాలకు చెందిన వ్యక్తులతో పాటు పరిశ్రమిక వర్గాల వాణిని కూడా విన్నారని చెప్పుకొచ్చింది. అందరిని కలిసి మాట్లాడుతారు.. వారి దగ్గర నుంచి సలహాలు తీసుకుంటారని పేర్కొనింది. ఈ ప్రభుత్వంలో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉన్నాను.. నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశ పెట్టిన తొలి పూర్తి బడ్జెట్లో వేతన జీవులకు కొత్త పన్ను విధానంలో రూ.12 లక్షల వరకు నో ట్యాక్స్ అని వెల్లడించింది. స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే రూ.12.75 లక్షల వరకు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన అవసరం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పింది.
తాజావార్తలు
-
Playoff Venues: ఐపీఎల్ ప్లే ఆఫ్ వేదికలపై కీలక అప్డేట్.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్కు చరమగీతం..?
-
Texas Shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి!
-
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
-
MI Vs CSK: నిప్పులు చెరిగిన చెన్నై బౌలర్లు.. పెవిలియన్కు క్యూ కట్టిన ముంబై బ్యాటర్స్.. టార్గెట్ ఎంతంటే..
-
Vaibhav Sooryavanshi: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీని ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ డిమాండ్స్..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!