Madhya Pradesh: బిర్యానీతో పార్టీ బలం పెంచుకునేందుకు ఎంఐఎం ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MIM is giving biryani dinners to increase party strength in madhya pradesh: హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో సత్తా చాటింది. ఈ రాష్ట్రాల్లో ఎంఐఎంకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ముఖ్యంగా మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంఐఎం ఇతర పార్టీలకు సవాల్ విసురుతోంది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోంది. 2023లో మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దీని కోసం పక్కా ప్లానింగ్ తో ముందుకు పోతోంది.
పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికలు ఉండే రాష్ట్రాల్లో తరుచుగా పర్యటిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ భోపాల్ ప్రాంతంలో పార్టీ బలం పెంచుకునేందుకు వినూత్న ప్రచారాన్ని మొదలుపెట్టింది. పార్టీలోకి మరింత మందిని ఆకర్షించేందుకు బిర్యానీ ఫెస్ట్ లను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీకి లక్ష మందికి పైగా సభ్యత్వాలు ఉన్నాయి.
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
Read Also: T20 Cricket : భారత్ – పాక్ మ్యాచ్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
నరేలా సీటు నుంచి పోటీ చేస్తున్న ఎంఐఎం నాయకుడు ఫీర్జాద తౌకిర్ నిజామా మాట్లాడుతూ.. అతిథి దేవో భవలో భాగంగా రుచికరమైన బిర్యానీ అందిస్తున్నామని.. నరేలాలో 25 వేలకు పైగా ప్రజలు పార్టీలో చేరారని అన్నారు. భోపాల్ లోని నరేలా ప్రాంతంలో 40 శాాతం ముస్లిం వర్గానికి చెందిన వారు ఉన్నారు. వీరిలో 25 వేల మంది పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు నాటికి సభ్యత్వాలను 10 లక్షల పైగా చేయడాన్ని ఎంఐఎం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో ఓవైసీ తర్వాత హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం సవాల్ విసురుతోంది. గత స్థానిక ఎన్నికల్లో ఎంఐఎం వల్ల కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోయింది. 2023 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం పార్టీ సిద్ధం అవుతోంది. జబల్ పూర్, ఖాండ్వా, ఖర్గోన్, బుర్హాన్ పూర్, భోపాల్, ఇండోర్ వంటి నగరాల్లో పోటీ చేయనుంది. గతంలో జరిగిన పట్టణ సంస్థల ఎన్నికల్లో 7 కౌన్సిలర్ స్థానాలను గెలిచింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!