Mayawati: మేనల్లుడికి మాయావతి షాక్.. ఆకాష్ ఆనంద్ ను అన్ని పదవుల నుంచి తొలగింపు
- మేనల్లుడికి మాయావతి షాక్
- ఆకాష్ ఆనంద్ ను అన్ని పదవుల నుంచి తొలగింపు
- పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్లను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) రాజకీయ పార్టీలో పెను మార్పులు చోటుచేసుకున్నాయి. బీఎస్పీ అధినేత్రి తన మేనల్లుడికి షాక్ ఇచ్చింది. ఆకాశ్ ఆనంద్ ను పార్టీ అన్ని పదవుల నుంచి తొలగించింది. దీంతో పార్టీకి ఇద్దరు కొత్త జాతీయ సమన్వయకర్తలు వచ్చారు. ఆకాష్ ఆనంద్ స్థానంలో ఆయన తండ్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ కుమార్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్లను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా మాయావతి నియమించారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఈరోజు లక్నోలో జరిగిన పార్టీ ముఖ్యమైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read:Bhumana Karunakar Reddy: ఎన్నాళ్లీ మోసం.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి!
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
- Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
ఈ సమావేశంలో పలు రాష్ట్రాల అధ్యక్షులు కూడా పాల్గొన్నారు. పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకాష్ ఆనంద్ను బీఎస్పీ అన్ని పదవుల నుంచి తొలగించారు. ఈ సమావేశంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాయావతి సోదరుడు ఆనంద్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ కూడా పార్టీ సమావేశానికి హాజరయ్యారు. కానీ, ఆకాష్ ఆనంద్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు.
Also Read:Uttar Pradesh: పెంపుడు పిల్లి మరణంతో కుంగిపోయి.. తిరిగి బ్రతికి వస్తుందన్న ఆశతో చూసి.. చివరకు
గత ఏడాది మేలో, మాయావతి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ సమన్వయకర్త, ఆమె వారసుడి పదవి నుంచి తొలగించారు. డిసెంబర్ 2023లో బిఎస్పి అధినేత్రి ఆయనను తన వారసుడిగా ప్రకటించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాయావతి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆకాష్ ఆనంద్ రాజకీయంగా పూర్తి పరిణితి చెందే వరకు రెండు ముఖ్యమైన బాధ్యతల నుంచి దూరంగా ఉంటారని ఆమె తెలిపారు. కాగా గతంలో ఆకాష్ ఆనంద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సీతాపూర్లోని బీజేపీ ప్రభుత్వాన్ని ‘ఉగ్రవాద ప్రభుత్వం’గా ఆకాష్ ఆనంద్ అభివర్ణించారు. దీంతో అతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇలాంటి ఘటనల నేపథ్యంలో మాయావతి ఆకాష్ ఆనంద్ ను బీఎస్సీ పార్టీ పదవుల నుంచి తొలగించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
-
Kangana Ranaut : నర్స్లను గ్లామర్ వృత్తిగా మార్చేశారు… డ్రెస్ కోడ్పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్
-
Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!