Nagavamsi: బాక్సాఫీస్ కలెక్షన్లపై నాగవంశీ బాంబ్.. ఐటీ వాళ్లకి అసలు లెక్కలన్నీ తెలుసట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagavamsi: సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ కలెక్షన్లు, సినిమా బడ్జెట్లు, ఆదాయ వ్యయాల లెక్కలపై ప్రముఖ నిర్మాత, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వ శాఖలకు పూర్తి సమాచారం ఉంటుందని, కాబట్టి కలెక్షన్ల విషయంలో ఏదీ దాచాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ.. సినిమా పరిశ్రమలో బాక్సాఫీస్ నంబర్లను పెంచి చూపించే విధానం, పన్నుల వ్యవహారం, జీఎస్టీ అమలు తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్లలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడారు. సినిమా పోస్టర్లపై ప్రచారం చేసే కలెక్షన్లకు, వాస్తవ లెక్కలకు మధ్య తేడా ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ అధికారులకు కూడా తెలుసని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీ, టీడీఎస్ వంటి పన్నుల వ్యవస్థల కారణంగా సినిమా పరిశ్రమలో ఆర్థిక లావాదేవీలు గతంతో పోలిస్తే మరింత పారదర్శకంగా మారాయని అన్నారు. ముఖ్యంగా జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్స్ చాలా వరకు తగ్గిపోయాయని చెప్పారు. డిస్ట్రిబ్యూటర్లు కూడా జీఎస్టీ ఇన్పుట్ ప్రయోజనాన్ని పొందేందుకు వీలైనంత వరకు బ్యాంకింగ్ మార్గాల్లోనే లావాదేవీలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు. సినిమా బాక్సాఫీస్ నంబర్లను పెంచి చూపించడం వల్ల నిర్మాతలకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక సినిమా నిజంగా ఎంత వసూలు చేసిందో ప్రభుత్వ విభాగాలకు వివిధ మార్గాల ద్వారా తెలిసే అవకాశం ఉందన్నారు. ఆదాయపు పన్ను శాఖ వద్ద ఉన్న డేటా, టెక్నాలజీ కారణంగా సినిమాల వాస్తవ ఆర్థిక లావాదేవీలను గుర్తించడం కష్టమైన పని కాదని అన్నారు.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
మరోవైపు సినిమా నిర్మాణంలో ఖర్చులను పెంచి చూపించడం వల్ల కూడా చివరికి నిర్మాతకే నష్టం జరుగుతుందని నాగవంశీ పేర్కొన్నారు. ఖర్చులు పెరిగితే లాభాల మార్జిన్ తగ్గిపోతుందని, అందువల్ల అలా చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక సినిమా హిట్ అయిన తర్వాత దాని అసలు కలెక్షన్లు, ఆదాయ వివరాలు ప్రభుత్వ విభాగాలకు తెలిసిపోతాయని చెప్పారు. గత కొన్నేళ్లలో తన సంస్థపై ఆదాయపు పన్ను శాఖ తనిఖీలు జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నాగవంశీ ప్రస్తావించారు. అధికారులు తమ వద్ద ఉన్న సమాచారంతో చాలా విషయాలను ముందుగానే తెలుసుకుంటారని చెప్పారు. కాబట్టి ప్రభుత్వాన్ని మోసం చేయాల్సిన అవసరం లేదని, దాచిపెట్టడం వల్ల ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. సినిమా పరిశ్రమలో భారీ బడ్జెట్లు, ఆర్థిక లావాదేవీలపై ఎన్నో ఊహాగానాలు ఉన్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు వేరుగా ఉంటాయని నాగవంశీ చెప్పుకొచ్చారు. అప్పులు తీసుకుని సినిమాలు నిర్మించడం, వాటిని పూర్తి చేసి విడుదల చేయడం వంటి ఆర్థిక ఒత్తిళ్ల మధ్యే నిర్మాతల ప్రయాణం కొనసాగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..