Bhumana Karunakar Reddy: ఎన్నాళ్లీ మోసం.. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాలి!
- 9 నెలలు అయినప్పటికీ ప్రజలకు ఏం చేశారు
- ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు
- ప్రతీకార కక్ష్యతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ ప్రజలకు ఏం చేశారని, సంక్షేమం పట్టించుకోవడం లేదని, అభివృధి ఎక్కడా కనిపించడం లేదని చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, రెండున్నర లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. పేదలకు మంచి చేశారు కాబట్టే వైఎస్ జగన్ రెడ్డికి 40 శాతం ఓట్లు వచ్చాయన్నారు. ప్రతీకార కక్ష్యతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించలేకపోతున్నా అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని భూమన ఫైర్ అయ్యారు.
‘ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు. రెండున్నర లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. పేదలకు మంచి చేశారు కాబట్టే వైఎస్ జగన్ రెడ్డికి 40శాతం ఓట్లు వచ్చాయి. మిమ్మల్ని మోస్తున్న ఛానెల్స్, పత్రికలు దుర్మార్గపు ప్రచారానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడిపోయారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవకు కోతలు పెట్టారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఊసే లేదు. 95 శాతం హామీలు గాలికి వదిలేశారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినప్పటికీ ప్రజలకు ఏం చేశారు.. సంక్షేమం పట్టించుకోవడం లేదు, అభివృధి ఎక్కడ కనిపించడం లేదు. మీరు ప్రజల్లోకి వెళ్తే పేదల కష్టాలు తెలుస్తాయి. పచ్చి అబద్ధాలతో ఎల్లకాలం సాగదు చంద్రబాబు. వైసీపీ పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తం అవుతుంది. సోషల్ మీడియాలో వైసీపీ బలంగా ఉంది అంటూ పచ్చ మీడియా రాస్తున్నారు. వాస్తవానికి మీ ప్రభుత్వం పట్ల టీడీపీ సానుభూతి పరులుల్లో వ్యతిరేకత ఉంది. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాల్సి ఉంది, ఎన్నాళ్లీ మోసం. అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద సృష్టించలేకపోతున్నా అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. మోసపు అబద్ధాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారు’ అని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
‘వైసీపీ నాయకులు, సోషల్ మీడియాపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడవచ్చు కానీ.. ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. 51 శాతం మంది ప్రజలు వైసీపీ వైపు ఉన్నారు. జగన్ రెడ్డి పాలన పట్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు. పోసానిపై రాజకీయ ఉద్దేశ్య పూర్వకంగానే పెట్టిన కేసులు అని కోర్టులో పొన్నావోలు సుధాకర్ రెడ్డి వాదించారు. ప్రతీకార కక్ష్యతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. పచ్చ పత్రికలు సిగ్గు పడాలి, పోసాని ఆరోగ్యం పరిస్థితిపై నాటకాలు అంటూ విషప్రచారం చేస్తున్నారు. రెండు రోజులు హాస్పిటల్లో ఉన్నా ఆయనకు బెయిల్ వచ్చే పరిస్థితి లేదు. పోసానిపై ఎల్లో మీడియా ఎందుకు విష రాతలు రాస్తోంది. పోసానికి వచ్చిన పరిస్థితి మీకు ఎదురైతే ఇలానే ఆలోచిస్తారా?’ అని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!