Uttar Pradesh: పెంపుడు పిల్లి మరణంతో కుంగిపోయి.. తిరిగి బ్రతికి వస్తుందన్న ఆశతో చూసి.. చివరకు
- పెంపుడు పిల్లి మరణంతో కుంగిపోయి
- తిరిగి బ్రతికి వస్తుందన్న ఆశతో చూసి
- పెంపుడు పిల్లి మరణంతో కుంగుబాటుకు గురైన పూజ షాకింగ్ నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పూర్వకాలం నుంచే పెంపుడు జంతువులను సాదుకోవడం అలవాటైపోయింది. కుక్కలు, పిల్లులు, పక్షులను ఇలా పలు రకాల పెంపుడు జంతువులను ఇళ్లలో పెంచుకుంటారు. ఇంట్లో మనిషి మాదిరిగానే భావిస్తుంటారు. వాటికి ఏ చిన్న ప్రమాదం వచ్చినా తట్టుకోలేరు. ఇదే మాదిరిగా ఓ మహిళ పిల్లిని పెంచుకుంది. దానికి ఆహారాన్ని అందిస్తూ, బాగోగులు చూస్తూ ప్రేమగా చూసుకునేది. అయితే పిల్లికి ఏమైందో ఏమోగాని హఠాత్తుగా చనిపోయింది. దీంతో ఆ మహిళ మానసికంగా కృంగిపోయింది. పిల్లికి అంత్యక్రియలు నిర్వహించకుండా తిరిగి బ్రతికి వస్తుందనే ఆశతో రెండు రోజుల పాటు దాని మృతదేహాన్ని తన దగ్గరే ఉంచుకుంది. ఆమె ఆశలు అడియాసలైన తర్వాత మూడవ రోజు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read:Union Minister Raksha Khadse: కేంద్ర మంత్రి కుమార్తెకు వేధింపులు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
Also Read
- West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
- Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దీప్కే అరెస్ట్..
- India First Dengue Vaccine: శుభవార్త.. భారత్లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్కు ఆమోదం.. ఎవరికి? ఎన్ని డోసులు? పూర్తి వివరాలు
- SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
32 ఏళ్ల పూజ అమ్రోహాలోని హసన్పూర్ లో నివసిస్తుంది. దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం పూజ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. అయితే భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్ధల వల్ల పెళ్లైన రెండు సంవత్సరాలకు విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి ఆమె తన తల్లి గజ్రా దేవితో కలిసి నివసిస్తోంది. కాగా ఒంటరితనం నుంచి బయటపడడానికి పూజ ఒక పెంపుడు పిల్లిని తీసుకొచ్చి సాదుకుంటోంది. అది గురువారం చనిపోయింది. ఆమె తల్లి చనిపోయిన పిల్లిని పాతిపెట్టమని చెప్పగా పూజ అందుకు నిరాకరించింది. అది తిరిగి బ్రతికి వస్తుంది అంటూ.. రెండు రోజుల పాటు పిల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచింది. ఖననం చేయామని కుటుంబ సభ్యులు చెప్పినప్పటికి పూజ వినిపించుకోలేదు.
Also Read:MAD 2 : ఒకరోజు ముందుగానే నవ్వులు పంచనున్న ‘మ్యాడ్ స్క్వేర్’
పెంపుడు పిల్లి మరణంతో కుంగుబాటుకు గురైన పూజ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. శనివారం మధ్యాహ్నం ఆమె తమ ఇంటి మూడవ అంతస్తులోని తన గదిలోకి వెళ్లింది. ఆ రాత్రి 8 గంటల సమయంలో గజ్రా దేవి తన కూతురిని చూడటానికి వెళ్ళింది. తలుపులు తీసి చూడగా పూజ సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. భయాందోళనకు గురైన పూజ తల్లి కేకలు వేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
- Tags
- Amroha
- Cat
- UP woman
- Uttar Pradesh
తాజావార్తలు
-
NBK సినిమాలో ఐశ్వర్య రాజేశ్? ఇప్పటి వరకు చేయని పాత్రలో క్రేజీ బ్యూటీ!
-
Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
-
Rag Mayur : తెలుగు నటుడి సంచలనం.. బెస్ట్ యాక్టర్ అవార్డు గెలిచిన రాగ్ మయూర్!
-
CM Chandrababu: ఆర్టీజీఎస్ కేంద్రంలో సీఎం చంద్రబాబు సమీక్ష.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణపై కీలక నిర్ణయం..
-
West Bengal: సెప్టెంబర్ 1 నుంచి బెంగాల్లో కొత్త రూల్.. మాతృ భాషకు పట్టం కట్టిన సీఎం సువేందు అధికారి!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!