Vijay: పుదుచ్చేరి విజయ్ సభలో గన్ కలకలం.. ఒకరు అరెస్ట్
- పుదుచ్చేరి విజయ్ సభలో గన్ కలకలం
- శివగంగ జిల్లా కార్యకర్త అరెస్ట్
- కఠిన షరతులతో విజయ్ సభకు అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుదుచ్చేరి కేంద్రంగా టీవీకే అధినేత, నటుడు విజయ్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట తర్వాత తొలిసారి పబ్లిక్ మీటింగ్లోకి వస్తున్నారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే సభలో ఒక కార్యకర్త తుపాకీతో వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శివగంగ జిల్లా కార్యకర్తగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు గుడ్న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
Also Read
- IMD Weather Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తరాదిన కుండపోత వానలు
- LPG Cylinders: వరదల్లో కొట్టుకుపోయిన 3,000 ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు అధికారుల అత్యవసర హెచ్చరిక
- Mamata Banerjee: ర్యాలీలో కార్యకర్త చెంపచెళ్లు మనిపించిన మమత.. వీడియో వైరల్
- Indian Railways: రైలులోనే "శోభనం గది".. డెకరేషన్ మామూలుగా లేదు గురూ.. ఇక్కడే అసలైన ట్విస్ట్.!
ఇదిలా ఉంటే కరూర్ తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని పోలీసులు తీవ్ర ఆంక్షలు విధించారు. తొలుత ఇరుకైన వీధులు, ఇరుకైన దారులు ఉన్నాయంటూ రోడ్షోకు, బహిరంగ సభకు పుదుచ్చేరి పోలీసులు అనుమతి నిరాకరించారు. మొత్తానికి కఠినమైన షరతులతో విజయ్ రోడ్షోకు అనుమతి ఇచ్చారు.
కఠిన షరతులు..
ఇక పుదుచ్చేరి రోడ్షోకు విజయ్కు కఠినమైన షరతులు విధించారు. కేవలం 5,000 మందికే అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా టీవీకే జారీ చేసిన క్యూఆర్ కోడ్ ఉన్న కార్లకే ప్రవేశం కల్పించనున్నారు. ఇక తమిళనాడు నుంచి ఎవరు వచ్చినా రోడ్షోకు అనుమతించరు. ఇక 500 మందికి ఒక ఎన్క్లోజర్ ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్స్లు, ఇతర భద్రతా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఇక విజయ్ ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రసంగించే అవకాశం ఉంది. పోలీసులు ఆదేశించిన ప్రకారం బహిరంగ సభ మధ్యాహ్నం 12:30 గంటలలోపు ముగించాలి. ఇక రోడ్షోలో భద్రతాగా 800 పోలీసులు మోహరించనున్నారు. ఇదిలా ఉంటే గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వికలాంగులు, వృద్ధులు భద్రతా కారణాల దృష్ట్యా హాజరుకావద్దని పార్టీ ఒక సలహాలో కోరింది. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భవనాలు, పైకప్పులు, చెట్లపైకి లేదా ట్రాన్స్ఫార్మర్లను ఎక్కడానికి దూరంగా ఉండాలని కోరింది.
ఇది కూడా చదవండి: Himachal Pradesh: అరుదైన సంఘటన.. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు ప్రత్యక్షం
విజయ్.. తమిళనాడుతో పాటు కేరళ, పుదుచ్చేరిలో కూడా మద్దతు కూడా బెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు పుదుచ్చేరిలో పార్టీ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక పుదుచ్చేరి రోడ్షో అయిపోయిన తర్వాత ఈనెలాఖరు నుంచి తమిళనాడు వ్యాప్తంగా విజయ్ పర్యటనలు చేపట్టనున్నారు.
సెప్టెంబర్లో తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది చనిపోయారు. పదుల కొద్ది గాయపడ్డారు. ఈ ఘటన యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అనంతరం మృతుల కుటుంబాలకు విజయ్ ఆర్థిక సాయం అందించి ఆదుకున్నారు. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత విజయ్ మళ్లీ పబ్లిక్లోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా మీడియా కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తోంది.
తాజావార్తలు
-
The Tatas Web Series: టాటా సామ్రాజ్యం కథ వెబ్ సిరీస్గా.. నాలుగు తరాల చరిత్రతో ‘ది టాటాస్’
-
IMD Weather Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఉత్తరాదిన కుండపోత వానలు
-
Manmadha Re-Release: శింబు కల్ట్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ‘మన్మధ’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.!
-
Iran: ఖమేనీ నివాసంపై దాడి దృశ్యాలు విడుదల.. అంత్యక్రియల వేళ ఇరాన్ సంచలన వీడియో!
-
Lenin Censor Talk : ‘లెనిన్’ సెన్సార్ టాక్.. పెద్ది లాంటి షాకింగ్ ట్విస్ట్ ఉంటుందట
ట్రెండింగ్
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!