Iran: ఖమేనీ నివాసంపై దాడి దృశ్యాలు విడుదల.. అంత్యక్రియల వేళ ఇరాన్ సంచలన వీడియో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివాస సముదాయం (compound)పై జరిగిన దాడికి సంబంధించిన మొదటి వీడియో దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా తాజాగా విడుదల చేసింది. ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న రోజే ఈ వీడియోను బయటపెట్టడం గమనార్హం. గత ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన యుద్ధం మొదటి రోజే 86 ఏళ్ల అలీ ఖమేనీ మరణించారు. ఈ దాడిలో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు సైతం ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆయన 14 నెలల మనవరాలు కూడా ఉంది. ఇదే దాడిలో ఖమేనీ కుమారుడు, ఇరాన్ ప్రస్తుత కొత్త సుప్రీం లీడర్ అయిన మోజ్తబా అలీ ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు.
తాజాగా విడుదలైన 35 సెకన్ల వీడియోలో ఖమేనీ నివాస సముదాయం లోపల ఉన్న ‘ఇమామ్ ఖొమేనీ హుస్సేనియా’ హాల్ ఎంత దారుణంగా ధ్వంసమైందో స్పష్టంగా కనిపిస్తోంది. బాంబు దాడుల ధాటికి ఆ భవన నిర్మాణం పూర్తిగా కూలిపోయి, ఇనుప బీములు వంగిపోయి, అంతటా శిథిలాలు, కాంక్రీట్ దిబ్బలు పేరుకుపోయాయి. ఇరాన్ సుప్రీం లీడర్ దేశ విదేశీ ప్రతినిధులతో అత్యంత కీలకమైన సమావేశాలు నిర్వహించడానికి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి ఈ హాల్నే ఉపయోగించేవారు. మరోవైపు, ఇరాన్ వ్యాప్తంగా వారం రోజులుగా సాగుతున్న అలీ ఖమేనీ అంతిమయాత్ర నేటితో ముగియనుంది. ఇరాన్లోని టెహ్రాన్, ఖోమ్ నగరాలతో పాటు పొరుగు దేశమైన ఇరాక్లోని పవిత్ర షియా నగరాలైన నజాఫ్, కర్బలాల మీదుగా ఈ అంతిమయాత్ర సాగింది. ఖమేనీ భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. అన్ని నగరాలూ తిరిగిన అనంతరం, నేడు ఈశాన్య ఇరాన్లోని ఆయన స్వగ్రామమైన ‘మష్హద్’ నగరంలో ఖమేనీ అంత్యక్రియలు పూర్తి కానున్నాయి.
Also Read
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
అయితే, ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న తరుణంలోనే ఇరు దేశాల మధ్య మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం వచ్చేలా పరిస్థితులు భయానకంగా మారాయి. యుద్ధాన్ని ముగించేందుకు జూన్ 17న కుదిరిన తాత్కాలిక ఒప్పందం ఇక “ముగిసిపోయింది” అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా సైన్యం ఇరాన్పై మళ్లీ బాంబుల దాడిని ప్రారంభించింది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ సముద్ర మార్గాన్ని ఇరాన్ మూసివేయకుండా తెరిచి ఉంచేందుకే ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. మంగళవారం నాడు ఆ సముద్ర మార్గంలో వెళ్తున్న మూడు సరుకు రవాణా నౌకలపై ఇరాన్ దాడి చేయగా.. దానికి ప్రతిగా అమెరికా బుధవారం ఇరాన్ దక్షిణ తీర ప్రాంత నగరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల వల్ల ఇరాన్లోని పలు నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనికి ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్లలోని అమెరికా సైనిక స్థావరాలపై తాము దాడులు చేశామని ఇరాన్ ప్రకటించింది. ఈ తాజా ఉద్రిక్తతలతో ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందనే ఆశలు పూర్తిగా ఆవిరైపోయాయి.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!