Himachal Pradesh: అరుదైన సంఘటన.. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు ప్రత్యక్షం
- హిమాచల్ప్రదేశ్లో అరుదైన దృశ్యం ఆవిష్క్రతం
- 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు ప్రత్యక్షం
- ఆనందోత్సవాల్లో మునిగిపోయిన కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవమాసాలు మోసి కనిపెంచిన కొడుకు తప్పిపోయాడు. తిరిగి వస్తాడని ఎదురుచూశారు. కానీ తిరిగి రాలేదు. 15 ఏళ్లు అయిపోయింది. దీంతో చనిపోయి ఉంటాడని భావించి ఆశలు వదులుకున్నారు. కానీ ఇన్నాళ్ల తర్వాత హఠాత్తుగా కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆ కన్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులే లేవు. ఈ సంఘటన హిమాచల్ప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Trump: భారత్కు ట్రంప్ మరో వాణిజ్య హెచ్చరిక.. ఈసారి దేనిపైనంటే..!
Also Read
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
బల్దేవ్ కుమార్.. హిమాచల్ ప్రదేశ్లోని సుజన్పూర్ జిల్లాలోని ఘర్తోలి గ్రామవాసి. 15 ఏళ్ల క్రితం ఉద్యోగం వెతుక్కుంటూ ఇంట్లో నుంచి పారిపోయాడు. అయితే ఆ కుటుంబ సభ్యులు తిరిగి వస్తాడని భావించారు. కానీ తిరిగి రాకపోవడంతో చనిపోయాడని భావించారు. పోలీసులు కూడా వెతికి.. వెతికి చేతులెత్తేశారు. జాడ కనిపెట్టలేకపోవడంతో చనిపోయి ఉంటాడని భావించి విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Padayappa re-release : రీ-రిలీజ్ సందడి మధ్య రజనీ షాకింగ్ అనౌన్స్మెంట్..
అయితే 3 రోజుల క్రితం రాజస్థాన్లోని బికనీర్లోని గౌరవ్ జైన్ కుటుంబం ఒక వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇతని ఆచూకీ గుర్తించాలని కోరారు. ఆ వీడియో కాస్త హిమాచల్ప్రదేశ్లోని సుజన్పూర్లోని సప్నా కుమారికి చేరింది. ఈమె కూడా పలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆశ్చర్యకరంగా బల్దేవ్ కుమార్ కుటుంబ సభ్యులకు వీడియో చేరింది. దీంతో 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ కొడుకేనంటూ తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే బికనీర్లో ఉన్న బల్దేవ్ కుమార్ దగ్గరకు బయల్దేరి వెళ్లిపోయారు. కన్న కొడుకును చూసి మురిసిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం బల్దేవ్ కుమార్ను హిమాచల్ ప్రదేశ్లోని సుజన్పూర్ జిల్లాలోని ఘర్తోలి గ్రామానికి తీసుకొచ్చారు. చాలా గ్రాండ్గా డప్పులు, బాకాలు, వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఇక సోషల్ మీడియా ద్వారా తమ కొడుకును దగ్గరకు చేర్చిన సప్నా కుమారి, గౌరవ్ జైన్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెల్లించారు. ఇక బల్దేవ్ కుమార్ ప్రస్తుతం మాజీ సైనికుడిగా ఉన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఏయూ వీసీ రాజశేఖర్పై సీఎం చంద్రబాబు ఫైర్!
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..