Himachal Pradesh: అరుదైన సంఘటన.. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు ప్రత్యక్షం
- హిమాచల్ప్రదేశ్లో అరుదైన దృశ్యం ఆవిష్క్రతం
- 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు ప్రత్యక్షం
- ఆనందోత్సవాల్లో మునిగిపోయిన కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవమాసాలు మోసి కనిపెంచిన కొడుకు తప్పిపోయాడు. తిరిగి వస్తాడని ఎదురుచూశారు. కానీ తిరిగి రాలేదు. 15 ఏళ్లు అయిపోయింది. దీంతో చనిపోయి ఉంటాడని భావించి ఆశలు వదులుకున్నారు. కానీ ఇన్నాళ్ల తర్వాత హఠాత్తుగా కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆ కన్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులే లేవు. ఈ సంఘటన హిమాచల్ప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Trump: భారత్కు ట్రంప్ మరో వాణిజ్య హెచ్చరిక.. ఈసారి దేనిపైనంటే..!
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
- Monsoon Returns: వాతావరణశాఖ గుడ్న్యూస్.. దేశాన్ని కమ్మేసిన వర్ష మేఘాలు..
బల్దేవ్ కుమార్.. హిమాచల్ ప్రదేశ్లోని సుజన్పూర్ జిల్లాలోని ఘర్తోలి గ్రామవాసి. 15 ఏళ్ల క్రితం ఉద్యోగం వెతుక్కుంటూ ఇంట్లో నుంచి పారిపోయాడు. అయితే ఆ కుటుంబ సభ్యులు తిరిగి వస్తాడని భావించారు. కానీ తిరిగి రాకపోవడంతో చనిపోయాడని భావించారు. పోలీసులు కూడా వెతికి.. వెతికి చేతులెత్తేశారు. జాడ కనిపెట్టలేకపోవడంతో చనిపోయి ఉంటాడని భావించి విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Padayappa re-release : రీ-రిలీజ్ సందడి మధ్య రజనీ షాకింగ్ అనౌన్స్మెంట్..
అయితే 3 రోజుల క్రితం రాజస్థాన్లోని బికనీర్లోని గౌరవ్ జైన్ కుటుంబం ఒక వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇతని ఆచూకీ గుర్తించాలని కోరారు. ఆ వీడియో కాస్త హిమాచల్ప్రదేశ్లోని సుజన్పూర్లోని సప్నా కుమారికి చేరింది. ఈమె కూడా పలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆశ్చర్యకరంగా బల్దేవ్ కుమార్ కుటుంబ సభ్యులకు వీడియో చేరింది. దీంతో 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ కొడుకేనంటూ తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే బికనీర్లో ఉన్న బల్దేవ్ కుమార్ దగ్గరకు బయల్దేరి వెళ్లిపోయారు. కన్న కొడుకును చూసి మురిసిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం బల్దేవ్ కుమార్ను హిమాచల్ ప్రదేశ్లోని సుజన్పూర్ జిల్లాలోని ఘర్తోలి గ్రామానికి తీసుకొచ్చారు. చాలా గ్రాండ్గా డప్పులు, బాకాలు, వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఇక సోషల్ మీడియా ద్వారా తమ కొడుకును దగ్గరకు చేర్చిన సప్నా కుమారి, గౌరవ్ జైన్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెల్లించారు. ఇక బల్దేవ్ కుమార్ ప్రస్తుతం మాజీ సైనికుడిగా ఉన్నారు.
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!