Himachal Pradesh: అరుదైన సంఘటన.. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు ప్రత్యక్షం
- హిమాచల్ప్రదేశ్లో అరుదైన దృశ్యం ఆవిష్క్రతం
- 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు ప్రత్యక్షం
- ఆనందోత్సవాల్లో మునిగిపోయిన కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవమాసాలు మోసి కనిపెంచిన కొడుకు తప్పిపోయాడు. తిరిగి వస్తాడని ఎదురుచూశారు. కానీ తిరిగి రాలేదు. 15 ఏళ్లు అయిపోయింది. దీంతో చనిపోయి ఉంటాడని భావించి ఆశలు వదులుకున్నారు. కానీ ఇన్నాళ్ల తర్వాత హఠాత్తుగా కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆ కన్న తల్లిదండ్రుల ఆనందానికి అవధులే లేవు. ఈ సంఘటన హిమాచల్ప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Trump: భారత్కు ట్రంప్ మరో వాణిజ్య హెచ్చరిక.. ఈసారి దేనిపైనంటే..!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
బల్దేవ్ కుమార్.. హిమాచల్ ప్రదేశ్లోని సుజన్పూర్ జిల్లాలోని ఘర్తోలి గ్రామవాసి. 15 ఏళ్ల క్రితం ఉద్యోగం వెతుక్కుంటూ ఇంట్లో నుంచి పారిపోయాడు. అయితే ఆ కుటుంబ సభ్యులు తిరిగి వస్తాడని భావించారు. కానీ తిరిగి రాకపోవడంతో చనిపోయాడని భావించారు. పోలీసులు కూడా వెతికి.. వెతికి చేతులెత్తేశారు. జాడ కనిపెట్టలేకపోవడంతో చనిపోయి ఉంటాడని భావించి విషాదంలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Padayappa re-release : రీ-రిలీజ్ సందడి మధ్య రజనీ షాకింగ్ అనౌన్స్మెంట్..
అయితే 3 రోజుల క్రితం రాజస్థాన్లోని బికనీర్లోని గౌరవ్ జైన్ కుటుంబం ఒక వ్యక్తి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇతని ఆచూకీ గుర్తించాలని కోరారు. ఆ వీడియో కాస్త హిమాచల్ప్రదేశ్లోని సుజన్పూర్లోని సప్నా కుమారికి చేరింది. ఈమె కూడా పలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఆశ్చర్యకరంగా బల్దేవ్ కుమార్ కుటుంబ సభ్యులకు వీడియో చేరింది. దీంతో 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ కొడుకేనంటూ తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే బికనీర్లో ఉన్న బల్దేవ్ కుమార్ దగ్గరకు బయల్దేరి వెళ్లిపోయారు. కన్న కొడుకును చూసి మురిసిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం బల్దేవ్ కుమార్ను హిమాచల్ ప్రదేశ్లోని సుజన్పూర్ జిల్లాలోని ఘర్తోలి గ్రామానికి తీసుకొచ్చారు. చాలా గ్రాండ్గా డప్పులు, బాకాలు, వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఇక సోషల్ మీడియా ద్వారా తమ కొడుకును దగ్గరకు చేర్చిన సప్నా కుమారి, గౌరవ్ జైన్ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెల్లించారు. ఇక బల్దేవ్ కుమార్ ప్రస్తుతం మాజీ సైనికుడిగా ఉన్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!