Mamata Banerjee: బీజేపీ మళ్లీ గెలిస్తే దేశంలో ఎన్నికలు ఉండవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని సోమవారం ఆరోపించారు. కూచ్ బెహార్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె… బీజేపీ ప్రజల ఆహార అలవాట్లను నిర్దేశిస్తోందని, వ్యక్తుల స్వేచ్ఛకు ముప్పుగా వాటిల్లిందని దుయ్యబట్టారు. ‘‘మీరు ఏం తినాలో వారే నిర్ణయిస్తారు. వారు మిమ్మల్ని ఉదయం టీతో గోమూత్రం తాగమని, మధ్యాహ్నం ఆవు పేడ తినమని అడుగుతారు. వారు మీ జీవితంలోని ప్రతీ అంశాన్ని నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మీరు ఏం తింటారు, మీరు ఎలా నిద్రపోతారో అనే విషయాలను కూడా నియంత్రించాలని బీజేపీ అనుకుంటోంది’’ అని మమతా బెనర్జీ ఆరోపించారు. ఇటీవల ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నవరాత్రుల సమయంలో చేపల్ని తినడంపై బీజేపీ విమర్శించిన నేపథ్యంలో మమతా ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: PM Modi: డీఎంకేపై కోపంతో బీజేపీ వైపు తమిళ ప్రజలు.. అన్నామలైపై ప్రధాని ప్రశంసలు..
Also Read
- Student Success: జేబులో రూ.1,000.. చేతిలో పాత ల్యాప్టాప్.. ఇప్పుడు రూ.3.5 కోట్ల స్కాలర్షిప్..
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
దేశ స్వాతంత్ర్యాన్ని కాపాడాలంటే బీజేపీని అధికారం నుంచి తరిమికొట్టాలని, అప్పుడే దేశం స్వతంత్రంగా ఉంటుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే భవిష్యత్తులో దేశంలో ఎన్నికలు ఉండవని, దేశంలో ఒకే నాయకుడు, ఒకే దేశం, ఒకే భాష, ఒకే భోజనాన్ని బీజేపీ కోరుకుంటోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఏప్రిల్ 17న రామనమమి రోజున హింసను, అల్లర్లను ప్రేరేపించడానికి బీజేపీ ప్రయత్ని్స్తోందని ఆమె ఆరోపించారు.
బీజేపీ కాషాయ భావజాలంతో మన చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీల్లోకి చొరబడ్డారని, వారి ఎజెండా సంఘర్షణ, గందరగోళాన్ని సృష్టించడమే అని ఆరోపించారు. శాంతి, ఐక్యతను కాపాడాలని ప్రతీ ఒక్కరిని నేను కోరుతున్నానని, మనం వారి చేతుల్లోకి వెళ్లొద్దని, సామరస్యం-సంఘీభావానికి గుర్తుగా ఆ రోజును జరుపుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. బీజేపీతో సీపీఎం కుమ్మక్కైందని ఆరోపించింది. మమతా బెనర్జీ బెంగాల్లో ఒంటరిగా పోరాడుతోంది, కాంగ్రెస్ సీపీఎంలు బీజేపీకి సహకరిస్తున్నాయని ఆమె ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రంలో ఒక్క అల్లర్లు జరిగినా ఎన్నికల సంఘం ముందు నిరాహారదీక్ష చేస్తానన్నారు. ఈ రోజు బీజేపీ సూచనల మేరకే ముర్షిదాబాద్ డీఐజీని మార్చింది, ముర్షిదాబాద్, మాల్దాలో అల్లర్లు జరిగితే ఆ బాధ్యత ఎన్నిక కమిషన్దే అని చెప్పారు.
తాజావార్తలు
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
-
Shubman Gill Record: శుభ్మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
-
Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!