PM Modi: డీఎంకేపై కోపంతో బీజేపీ వైపు తమిళ ప్రజలు.. అన్నామలైపై ప్రధాని ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తమిళ పార్టీ డీఎంకేతో పాటు దానితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్న డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. డీఎంకేపై తమిళ ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం ఉందని, ఇది ప్రజల్ని బీజేపీ వైపు మళ్లేలా చేస్తుందని ప్రధాని ఈరోజు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బీజేపీ ఐదు తరాలుగా దక్షినాది రాష్ట్రాల్లో పనిచేస్తోందని, ప్రజలు కాంగ్రెస్పై నిరాశ చెందినప్పుడు ప్రాంతీయ పార్టీల వైపు వెళ్లారని, ఇప్పుడు వాటితో విసుగు చెందిన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రధాని అన్నారు.
వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న తమిళ ప్రజలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని అక్కడి వాళ్లకు చెబుతున్నారని, ‘‘తమిళ కాశీ సంగమాన్ని’’ నిర్వహించే సమయంలో డీఎంకే పార్టీ తమను ‘పానీపూరి వాలా’ అంటూ ఎగతాళి చేసింది. కానీ తమిళ ప్రజలు కాశీ సంగమానికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగే అభివృద్ధిని చూసి, తాము వినేది నిజం కాదని గమనించారని ప్రధాని అన్నారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Abhishek Sharma: సిద్ధూ మూసేవాలాకు బిగ్ ఫ్యాన్ను.. నా ఆరాధ్యదైవం ఎవరో తెలుసా..?
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఆయన మంచి నాయకుడని, బీజేపీ కుటుంబ పార్టీ కాదని అందరికి అవకాశాలు ఉంటాయని చెప్పారు. యువకుడు ఐపీఎస్ క్యాడర్ వదిలేసి బీజేపీలో చేరారని, ఒక వేళ ఆయన డీఎంకేలోకి వెళ్తే పెద్ద పేరు తెచ్చుకునే వారు కానది అన్నారు. ప్రతీ కార్యకర్తకు బీజేపీ అవకాశం ఇస్తుందని, కుటుంబ పార్టీల్లో ఇలాంటివి ఉండవని చెప్పారు. మహాత్మా గాంధీ పేరుతో సంబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీ, మెడలో రద్రాక్ష మాల ధరించిన ఇందిరా గాంధీతో సంబంధం ఉన్న కాంగ్రెస్, సనాతన ధర్మాన్ని హేళన చేస్తున్న డీఎంకేతో ఎందుకు అంటకాగుతుందని ప్రధాని ప్రశ్నించారు.
డీఎంకే నేతలు ప్రత్యేక దేశం అని పలుమార్లు వ్యాఖ్యానించడం మాట్లాడుతూ.. భారత్ పూర్తిగా వైవిధ్యం కలిగిన దేశమని ప్రధాని సమాధానమిచ్చారు. బీజేపీ 400 స్థానాలు గెలిస్తే ఒకే భాష, ఒకే మతం అని ఆరోపిస్తున్న కాంగ్రెస్పై ప్రధాని ఫైర్ అయ్యారు. ఐక్యరాజ్యసమితికి వెళ్లి ప్రపంచంలోనే అతి పురాతన భాష ‘తమిళం’ అని చెప్పిన వ్యక్తి గురించి ఎలా విమర్శి్స్తున్నారో నాకు అర్థం కావడం లేదని అన్నారు.
తాజావార్తలు
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!