Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే.. శశిథరూర్పై భారీ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge wins the Congress presidential elections:కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అంతా అనుకున్న ప్రకారం మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. శశిథరూర్ పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రెండు దశాబ్ధాల తరువాత తొలిసారిగా గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ఖర్గేకు 7897 ఓట్లు రాగా.. శశి థరూర్ కు కేవలం 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. పార్టీకి 98వ అధ్యక్షుడిగా ఖర్గే విజయం సాధించారు.
Read Also: Talasani Srinivas Yadav: చిల్లర రాజకీయాలు చేయొద్దు.. బీజేపీకి వార్నింగ్
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
ఖర్గే 1942, జూలై21న కర్ణాటక బీదర్ జిల్లా వార్వట్టి గ్రామంలో జన్మించారు. 80 ఏళ్ల మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా, గాంధీ కుటుంబానికి అనుకూలవాదిగా, విధేయుడిగా ఖర్గేకు పేరుంది. 1972 నుంచి 2014 వరకు వరసగా తాను పోటీచేసిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నాడు. వరసగా 11 సార్లు ఎన్నికల్లో గెలిచి రికార్డు సాధించారు ఖర్గే. గుల్బర్గా యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పట్టా పొందారు. గుల్బార్గా కాలేజీలో చదువుతున్న సమయంలో స్టూడెంట్ యూనియన్ నేతగా పేరు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభం అయింది. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ.. అధ్యక్ష పదవికి చేరుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలు నమోదు చేసేలా వ్యూహాలు రచించే బాధ్యత ఇప్పుడు మల్లికార్జున ఖర్గేపై ఉంది. వరసగా పలు రాష్ట్రాల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీని గెలుపు బాట పట్టించే విధంగా ఖర్గే పనిచేయాల్సి ఉంది. ముఖ్యంగా ఈ ఏడాాది రాబోతున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు ఖర్గే సామర్థ్యానికి పరీక్షగా నిలువనున్నాయి. ఖర్గే గెలుపుపై శశిథరూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఖర్గే హయాంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
-
OTR: దువ్వాడ శ్రీనివాస్ అడుగులు మళ్లీ వైసీపీ వైపు పడుతున్నాయా..?
-
AP High Court: విశాఖ డేటా సెంటర్పై హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు
-
Off The Record: కొండా సురేఖ వివాదంపై మంత్రి సీతక్క మౌనం..!!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!