Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే.. శశిథరూర్పై భారీ విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallikarjun Kharge wins the Congress presidential elections:కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో అంతా అనుకున్న ప్రకారం మల్లికార్జున ఖర్గే విజయం సాధించారు. శశిథరూర్ పై భారీ మెజారిటీతో విజయం సాధించారు. రెండు దశాబ్ధాల తరువాత తొలిసారిగా గాంధీయేతర వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు. ఖర్గేకు 7897 ఓట్లు రాగా.. శశి థరూర్ కు కేవలం 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగడం ఇది ఆరోసారి. పార్టీకి 98వ అధ్యక్షుడిగా ఖర్గే విజయం సాధించారు.
Read Also: Talasani Srinivas Yadav: చిల్లర రాజకీయాలు చేయొద్దు.. బీజేపీకి వార్నింగ్
Also Read
- Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..!
- Pinarayi Vijayan: రగులుతున్న కేరళం.. పినరయి విజయన్ నివాసంలో ఈడీ సోదాలు! అధికారుల కార్లపై రాళ్ల దాడి..
- Supreme Court: SIR ప్రక్రియ చట్టబద్ధమే.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
- PM Modi Appeal: ప్రధాని మోడీ ప్రత్యేక విజ్ఞప్తి.. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి..
ఖర్గే 1942, జూలై21న కర్ణాటక బీదర్ జిల్లా వార్వట్టి గ్రామంలో జన్మించారు. 80 ఏళ్ల మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా, గాంధీ కుటుంబానికి అనుకూలవాదిగా, విధేయుడిగా ఖర్గేకు పేరుంది. 1972 నుంచి 2014 వరకు వరసగా తాను పోటీచేసిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తూనే ఉన్నాడు. వరసగా 11 సార్లు ఎన్నికల్లో గెలిచి రికార్డు సాధించారు ఖర్గే. గుల్బర్గా యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ పట్టా పొందారు. గుల్బార్గా కాలేజీలో చదువుతున్న సమయంలో స్టూడెంట్ యూనియన్ నేతగా పేరు తెచ్చుకున్నారు. విద్యార్థి దశలోనే ఆయన రాజకీయ జీవితం ప్రారంభం అయింది. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ.. అధ్యక్ష పదవికి చేరుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంతో పాటు పలు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాలు నమోదు చేసేలా వ్యూహాలు రచించే బాధ్యత ఇప్పుడు మల్లికార్జున ఖర్గేపై ఉంది. వరసగా పలు రాష్ట్రాల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీని గెలుపు బాట పట్టించే విధంగా ఖర్గే పనిచేయాల్సి ఉంది. ముఖ్యంగా ఈ ఏడాాది రాబోతున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు ఖర్గే సామర్థ్యానికి పరీక్షగా నిలువనున్నాయి. ఖర్గే గెలుపుపై శశిథరూర్ శుభాకాంక్షలు తెలిపారు. ఖర్గే హయాంలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
GV Prakash: క్రేజీ మల్టీస్టారర్ కోసం అనిల్ రావిపూడి బిగ్ స్కెచ్.. మ్యూజిక్ డైరెక్టర్గా ఆ కోలీవుడ్ స్టార్!
-
Health Tips : తులసి మొక్క ఎండిపోయినా.. మీ ఇంటికి ఇంకా ఉపయోగమే..!
-
Thailand visa : ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే థాయ్లాండ్లో 5 ఏళ్ళు ఉండొచ్చని తెలుసా ? ఏం చేయాలంటే ?
-
Byjus Story: కోట్ల సామ్రాజ్యం నుంచి కోర్టు మెట్ల వరకు.. బైజూస్ రవీంద్రన్ పతనం వెనుక అసలు కథ ఇదే!
-
Byju Raveendran: కటకటాల్లోకి బైజూస్ బాస్.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు, అసలు ఏం జరిగిందంటే?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!