Talasani Srinivas Yadav: చిల్లర రాజకీయాలు చేయొద్దు.. బీజేపీకి వార్నింగ్
తెలంగాణ భవన్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఎన్నికల పరిస్థితులలో టీఆర్ఎస్ అభ్యర్థికి మంచి మెజార్టీ వస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుళ్ళు, కుతంత్రాలతో గెలవాలని చూస్తున్నాయి. మేం గెలిస్తే 3వేలు పెన్షన్ ఇస్తామని చెప్తున్నాయి. దుబ్బాక, హుజారాబాడ్ లో ఒక్క రూపాయి ఇవ్వలేదు.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని కెసిఆర్ కోరుకున్నారు.. అందుకు గొల్ల, కురుమలకు ఆర్థికంగా బలోపేతం కోసం వారికి గొర్రెలను ఇస్తున్నాం..యూనిట్ కాస్ట్ ని కూడా పెంచం… లక్షా ఇరవై అయిదు వేల నుంచి 1,75 వేలకు పెంచాం.. బీజేపీ నాయకులు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఈ స్కీమ్ కొద్ది రోజులు ఆగిపోయింది.
Read Also: Vijay Devarakonda: ‘లైగర్’ ఫ్లాప్ నుంచి విజయ్ ఇంకా తేరుకోలేదా..?
Also Read
- Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
- Off The Record : ఆ నలుగురు ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారా?
మునుగోడు ఎన్నికలు అయిపోయిన తర్వాత యధావిధిగా కొనసాగిస్తాం.. రాష్ట్రంలో ఉన్న గొల్ల, కురుమలు ఆందోళన పడొద్దు. డబ్బులు రాకుండా ఆపడం బీజేపీ, కాంగ్రెస్ కుట్ర. ప్రజాస్వామ్యంలో చిల్లర రాజకీయాలు కుదరవు.. ఎల్లకాలం వీటిని ఆపలేరు… ఎన్నికల కోడ్ తర్వాత మీ డబ్బు మీకు చెందుతుంది.. మీరు కేంద్రం నుంచి రూపాయి తెచ్చింది లేదు…ఓ వైపు కంప్లైంట్ ఇచ్చేది మీరే… మళ్ళీ రాజగోపాల్ రెడ్డి నా ఇల్లు అమ్మి మీకు ఇస్తా అని మాటలు చెప్తున్నారు. కాంట్రాక్ట్ కోసం ఎన్నిక వచ్చింది.. మీకు బీజేపీ కి ఉన్నది ముగ్గురు… మీ వల్ల ఏమవుతుంది? 3 వేళ పెన్షన్ ఎలా ఇస్తావు… మీరు గెలిచిన కేవలం ఎమ్మెల్యే మాత్రమే అవుతావు… అంతకు మించి ఏంకాదు బీజేపీ వల్ల అన్నారు శ్రీనివాస్ యాదవ్.
తప్పకుండా బీజేపీ కి బుద్ది చెప్తాం.. గొల్ల, కురుమలు ఎవరు అధైర్యపడవద్దు.. బల్దియా ఎన్నికలలో వరద బాధితులకు పదివేల రూపాయిలు ఇచ్చాం.. మేము బీజేపీ మాదిరి కారు పోతే కారు, బైక్ పోతే బైక్ ఇస్తాం అని చెప్పలేదు.. రైతుబందు, దళిత బందు ఎన్నికల కోసం తెచ్చిన పథకం కాదు. మేము గొల్ల, కురుమల ప్రతినిధి గా చెప్తున్న, మీరు దైర్యంగా వుండండి. ఎవరు ఈ డబ్బులను ఆపలేరు. రెండో విడత గొర్రెల పంపిణీ త్వరలో పంచుతాం. పైలట్ కింద DPT కింద ఇస్తాం. నాలుగు ఓట్ల కోసం ఏది పడితే అది మాట్లాడేస్తారు బీజేపీ వాళ్లు. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి… అవన్నీ నిజం కాదు. డబుల్ బెడ్ రూం అనేది దేశంలో ఎక్కడ లేని స్కీం ఇది. సిటీలో ఉపఎన్నిక వస్తుంది అన్న వార్తలు అవాస్తవం… అవన్నీ గాలి వార్తలు.. ఫ్లోరైడ్ సమస్య లేకుండా చేశాం అన్నారు మంత్రి శ్రీనివాస్ యాదవ్.
Read Also: Vijay Devarakonda: ‘లైగర్’ ఫ్లాప్ నుంచి విజయ్ ఇంకా తేరుకోలేదా..?
తాజావార్తలు
-
Vivo S50t 5G: 50MP ట్రిపుల్ కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్తో.. వివో S50t 5G విడుదల
-
Cucumber Chutney Recipe: మండుటెండలో చల్లని టేస్టీ రెసిపీ.. దోసకాయ చట్నీ ఇలా తయారు చేయండి..
-
Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
-
IPL 2026 Playoffs Chances: హీటేక్కిస్తున్న ప్లేఆఫ్స్ రేస్.. టాప్-4 కోసం 10 జట్లకు ఎన్ని విజయాలు కావాలి?
-
Santosh Goyal Story: విధి వంచించిన మేధావి.. ఈ పీహెచ్డీ స్కాలర్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!