Karnataka: కర్ణాటక రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
- కర్ణాటకలో ప్రభుత్వం ఉందా..?
- త్వరలో కీలక రాజకీయ పరిణామాలు..
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీపై అసంతృప్తి..
- మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: రానున్న రోజుల్లో కర్ణాటకలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై గురువారం అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మారారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు నిధులు లేవని, ప్రజల్ని ఎదుర్కొనేందుకు వారు సిగ్గుపడుతున్నారని చెప్పారు. పరిపాలన అధ్వాన్నంగా ఉందని, అధికారులు ప్రభుత్వం మాట వినడం లేదని, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే స్థాయికి చేరిందని బొమ్మై అన్నారు.
Read Also: NEET: “హై-లెవల్ కమిటీ ఏర్పాటు, దోషుల్ని వదిలేది లేదు”.. పేపర్ లీక్లపై కేంద్రమంత్రి..
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మె్ల్యేలలో అసంతృప్తికి సంబంధించి బీజేపీ ఎంపీ గోవిండ్ కార్జోల్ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఉన్నాయని, కార్జోల్ సీనియర్ నేత అని, అతను పూర్తి సమాచారంతో మాట్లాడుతారని మాజీ సీఎం అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ ధరల పెంపుపై దావణగెరెలో జరిగిన భారీ నిరసన కార్యక్రమంలో బొమ్మై పాల్గొన్నారు. కాంగ్రెస్ ధరల పెంపుతో సమాన్య ప్రజలు, పేదలపై భారం పడుతుందని అన్నారు. పెట్రోలు, డీజిల్, ఇతర నిత్యావసరాల ధరలు పెంచడం ద్వారా పాలించే నైతిక అధికారాన్ని కోల్పోయారని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి పేద, సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని బొమ్మై ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని, కర్ణాటకని పదేళ్లు వెనక్కి నెట్టిందని ఆరోపించారు. ఓట్లు దండుకోవడానికి ప్రభుత్వం హామీల పేరుతో పేదలపై భారం మోపిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రూ. 1.05 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని చెప్పారు. మొదట్లో మోటార్ పన్ను, మద్యం పన్ను, స్టాంపు డ్యూటీ పన్ను పెంచిందని, ఇప్పుడు పెట్రోల్, డిజిల్ ధరల్ని పెంచిందని అన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!