Karnataka: కర్ణాటక రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు.. మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..
- కర్ణాటకలో ప్రభుత్వం ఉందా..?
- త్వరలో కీలక రాజకీయ పరిణామాలు..
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆ పార్టీపై అసంతృప్తి..
- మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: రానున్న రోజుల్లో కర్ణాటకలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయని బీజేపీ నేత, మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై గురువారం అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మారారని ఆరోపించారు. ఎమ్మెల్యేలకు నిధులు లేవని, ప్రజల్ని ఎదుర్కొనేందుకు వారు సిగ్గుపడుతున్నారని చెప్పారు. పరిపాలన అధ్వాన్నంగా ఉందని, అధికారులు ప్రభుత్వం మాట వినడం లేదని, రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే స్థాయికి చేరిందని బొమ్మై అన్నారు.
Read Also: NEET: “హై-లెవల్ కమిటీ ఏర్పాటు, దోషుల్ని వదిలేది లేదు”.. పేపర్ లీక్లపై కేంద్రమంత్రి..
Also Read
- Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మె్ల్యేలలో అసంతృప్తికి సంబంధించి బీజేపీ ఎంపీ గోవిండ్ కార్జోల్ చేసిన వ్యాఖ్యలు నిజంగా ఉన్నాయని, కార్జోల్ సీనియర్ నేత అని, అతను పూర్తి సమాచారంతో మాట్లాడుతారని మాజీ సీఎం అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ ధరల పెంపుపై దావణగెరెలో జరిగిన భారీ నిరసన కార్యక్రమంలో బొమ్మై పాల్గొన్నారు. కాంగ్రెస్ ధరల పెంపుతో సమాన్య ప్రజలు, పేదలపై భారం పడుతుందని అన్నారు. పెట్రోలు, డీజిల్, ఇతర నిత్యావసరాల ధరలు పెంచడం ద్వారా పాలించే నైతిక అధికారాన్ని కోల్పోయారని, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి పేద, సామాన్య ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని బొమ్మై ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైందని, కర్ణాటకని పదేళ్లు వెనక్కి నెట్టిందని ఆరోపించారు. ఓట్లు దండుకోవడానికి ప్రభుత్వం హామీల పేరుతో పేదలపై భారం మోపిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రూ. 1.05 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని చెప్పారు. మొదట్లో మోటార్ పన్ను, మద్యం పన్ను, స్టాంపు డ్యూటీ పన్ను పెంచిందని, ఇప్పుడు పెట్రోల్, డిజిల్ ధరల్ని పెంచిందని అన్నారు.
తాజావార్తలు
-
Jeetendra Mishra: ‘రామ మందిర నిర్వహణ అద్భుతం.. జితేంద్ర మిశ్రా కితాబు
-
Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
-
ICC Women’s Champions Trophy 2027: మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర.. ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం.. తేదీలు ఖరారు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!