NEET: “హై-లెవల్ కమిటీ ఏర్పాటు, దోషుల్ని వదిలేది లేదు”.. పేపర్ లీక్లపై కేంద్రమంత్రి..
- నీట్ యూజీసీ-నెట్పై స్పందించిన కేంద్రం..
- హై లెవల్ కమిటీ ఏర్పాటు..
- దోషుల్ని వదిలేది లేదు..
- విద్యార్థుల కెరీర్ని తాకట్టు పెట్టలేం..
- కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET: నీట్ అవకతవకలు, యూజీసీ-నెట్ పరీక్షల రద్దుపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గురువారం చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రథమ ప్రాధాన్యత అని చెప్పారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించిన పరీక్షలకు 30 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఆ తర్వాత నీట్ అవకతవకలు, యూజీసీ-నెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఈ అంశంపై ఈ రోజు నిరసనలు తెలిపింది. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ యూత్ వింగ్ ఆందోళన నిర్వహించిన తర్వాత కేంద్రమంత్రి నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
గురువారం ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ‘‘విద్యార్థుల ప్రయోజనాలకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, తాను హామీ ఇస్తున్నాను. పారదర్శకతలో రాజీపడము. నీట్ పరీక్షకు సంబంధించినంతవరకు మేము బీహార్ ప్రభుత్వంతో టచ్లో ఉన్నాము. ప్రాథమిక సమచారం ప్రకారం పాట్నా పోలీసులు మాకు వివరణాత్మక నివేదిక పంపుతారు. అవకతవకలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయబడ్డాయి.’’ అని అన్నారు.
Also Read
- Cockroach Janta Party: ఢిల్లీలో "కాక్రోచ్ జనతా పార్టీ" ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
- Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
Read Also: Tata Nexon CNG Launch: లాంచింగ్కి సిద్ధమవుతున్న టాటా నెక్సాన్ CNG.. బ్రెజ్జాతో పోటీ..
ఖచ్చితమైన సాక్ష్యాలు లభించిన తర్వాత, దోషుల్ని ఎవ్వర్ని వదిలిపెట్టబోమని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. దీని వెనక ఎన్టీఏలో సీనియర్ అధికారులు ఉన్నా విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. తమ ప్రాధాన్యత విద్యార్థుల భవిష్యత్తు అని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ NTA యొక్క నిర్మాణం, దాని పనితీరు, పరీక్ష ప్రక్రియ, పారదర్శకత మరియు డేటా మరియు భద్రతా ప్రోటోకాల్ను మెరుగుపరచడంపై సిఫార్సులను ఇస్తుందని చెప్పారు.
పబ్లిక్ పరీక్షల్లో అన్యాయం జరగకుండా ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందని, ఇలాంటి అంశాలపై పుకార్లు పుట్టించవద్దని, రాజకీయం చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.లక్షలాది మంది విద్యార్థులు, వారిలో చాలా మంది పేదవారు లేదా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన అభ్యర్థులు మంచి మార్కులు సాధించారని, మంచి ర్యాంకులు పొందారని చెప్పారు. వారి కెరీర్ని తాకట్టలు పెట్టలేమని, ఒక చోట జరిగిన అవకతవకలతో మొత్తం విద్యార్థుల కెరీర్ని పణంగా పెట్టలేమని చెప్పారు.
#WATCH | On UGC-NET exam cancellation, Union Education Minister Dharmendra Pradhan says, "…Paper leak is an institutional failure of NTA. We are assuring you that there will be a reform committee and action will be taken…" pic.twitter.com/zwBzqD2Eba
— ANI (@ANI) June 20, 2024
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!