Lightning Strike: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగులు.. 10 మందికి పైగా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lightning Strike In Uttar pradesh, Madhya pradesh: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగుపాటులో పలువురు మరణించారు. మధ్యప్రదేశ్ లోని విదిశా, సత్నా, గుణ జిల్లాల్లో గత 24 గంటల్లో 9 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. విదిశా జిల్లాలోని గంజ్ బాసోడా తహసీల్ పరిధిలోని అగసోడ్ గ్రామంలో వర్షం వస్తుందని చెట్టుకింద నిల్చున్న నలుగురు వ్యక్తులపై పిడుగు పడింది. దీంతో వారంతా అక్కడిక్కడే మరణించారు. చనిపోయిన వారిని గాలు మాలవ్య, రాము, గుడ్డా, ప్రభులాల్ గా గుర్తించారు. మరణించిన వారంతా 30 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న వ్యక్తులే. సత్నాలో పోడీ పటౌరా, జట్వారా ప్రాంతాల్లో శనివారం చోటు చేసుకున్న పిడుగు పాటు ఘటనల్లో నలుగురు చనిపోగా.. ఒకరు గాయపడ్డారు. మరణించిన వారిని అంజన, చంద్ర, రాజ్ కుమార్, రాజ్ కుమార్ యాదవ్ గా గుర్తించారు. ఇక గుణ జిల్లాలో భోరా గ్రామంలో పిడుగు పడి 45 ఏళ్ల మహిళ మరణించింది.
Read Also: SSLV-D1: ఎస్ఎస్ఎల్వీ-డీ1 విఫలం.. అధికారికంగా ప్రకటించిన ఇస్రో
Also Read
- India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
- PM Kisan 23th Installment Update: పీఎం కిసాన్ 23వ విడత.. రైతుల ఖాతాల్లో రూ. 2,000 ఎప్పుడు జమ అవుతాయంటే?
- PM Modi: విదేశీ ప్రయాణాలపై పన్ను విధింపులంటూ వార్తలు.. ప్రధాని మోడీ కీలక ప్రకటన
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ లో పిడుగు పడి మహిళతో పాటు ఆమె కుమారుడు కూడా మరణించారు. పిడుగు పడటం వల్ల ఇంటి పై కప్పు కూలి అంగూరి దేవీ( 55), ఆమె కుమారుడు మున్నా(30) మరణించారు. పిడుగుపాటు వల్ల రాష్ట్రంలో కలిగిన నష్టాలను అధికారులు అంచాన వేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
మధ్యప్రదేశ్ లో ఉరుములు, మెరుపులతో కూడాన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తేమ వాతావరణ ఏర్పడిందని.. ఇది వర్షాకలకు కారణం అవుతుందని.. దీంతో పాటు రుతుపవణాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
-
Gold and Silver Rates: కమింగ్ డౌన్.. నేడు మళ్లీ పతనమైన గోల్డ్, సిల్వర్ ధరలు..
-
TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
-
Vrushakarma: ‘వృషకర్మ’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
India Unemployment: ఆరు నెలల గరిష్ఠానికి చేరిన భారత నిరుద్యోగ రేటు.. ఏప్రిల్లో 5.2% శాతానికి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..