Lightning Strike: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగులు.. 10 మందికి పైగా మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lightning Strike In Uttar pradesh, Madhya pradesh: మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగుపాటులో పలువురు మరణించారు. మధ్యప్రదేశ్ లోని విదిశా, సత్నా, గుణ జిల్లాల్లో గత 24 గంటల్లో 9 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. విదిశా జిల్లాలోని గంజ్ బాసోడా తహసీల్ పరిధిలోని అగసోడ్ గ్రామంలో వర్షం వస్తుందని చెట్టుకింద నిల్చున్న నలుగురు వ్యక్తులపై పిడుగు పడింది. దీంతో వారంతా అక్కడిక్కడే మరణించారు. చనిపోయిన వారిని గాలు మాలవ్య, రాము, గుడ్డా, ప్రభులాల్ గా గుర్తించారు. మరణించిన వారంతా 30 నుంచి 40 ఏళ్లలోపు ఉన్న వ్యక్తులే. సత్నాలో పోడీ పటౌరా, జట్వారా ప్రాంతాల్లో శనివారం చోటు చేసుకున్న పిడుగు పాటు ఘటనల్లో నలుగురు చనిపోగా.. ఒకరు గాయపడ్డారు. మరణించిన వారిని అంజన, చంద్ర, రాజ్ కుమార్, రాజ్ కుమార్ యాదవ్ గా గుర్తించారు. ఇక గుణ జిల్లాలో భోరా గ్రామంలో పిడుగు పడి 45 ఏళ్ల మహిళ మరణించింది.
Read Also: SSLV-D1: ఎస్ఎస్ఎల్వీ-డీ1 విఫలం.. అధికారికంగా ప్రకటించిన ఇస్రో
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ లో పిడుగు పడి మహిళతో పాటు ఆమె కుమారుడు కూడా మరణించారు. పిడుగు పడటం వల్ల ఇంటి పై కప్పు కూలి అంగూరి దేవీ( 55), ఆమె కుమారుడు మున్నా(30) మరణించారు. పిడుగుపాటు వల్ల రాష్ట్రంలో కలిగిన నష్టాలను అధికారులు అంచాన వేస్తున్నారు. ప్రకృతి వైపరిత్యాల వల్ల చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
మధ్యప్రదేశ్ లో ఉరుములు, మెరుపులతో కూడాన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తేమ వాతావరణ ఏర్పడిందని.. ఇది వర్షాకలకు కారణం అవుతుందని.. దీంతో పాటు రుతుపవణాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!