Chennai: ఏడేళ్ల నాటి మర్డర్ మిస్టరీ వీడింది.. చంపిందెవరంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుమానం పెనుభూతమైంది.. తరచూ జరుగుతున్న గొడవలతో భార్యను చంపేశాడు.. డెడ్బాడీ మాయం చేశాడు. కానీ డంపింగ్ యార్డ్లో బయటపడ్డ శరీర భాగాలు కేసు వెలుగులోకి వచ్చింది. కానీ అప్పటికీ కేసులో మిస్టరీ వీడలేదు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? అనేది తేల్చేందుకు పోలీసులు శ్రమించారు. ఏడేళ్లు కష్టపడి భర్తే హత్య చేసినట్లు తేల్చారు.
2019 జనవరిలో చెన్నైలో నటి సంధ్య హత్య జరిగింది. ఆమె భర్తే అతి కిరాతకంగా హతమార్చి, శరీరాన్ని ముక్కలుగా నరికేశాడు. అంతే కాదు ఆ శరీర భాగాలను చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ యార్డులలో పారేశాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కేసును మృతురాలి చేతిపై ఉన్న రెండు టాటూల ఆధారంగా ఛేదించారు పోలీసులు.
Also Read
- AP Crime: ఏపీలో బంగ్లా విద్యార్థినిపై అత్యాచారయత్నం.. తప్పించుకునే క్రమంలో నిందితుడు మృతి
- TVK Leader Mu*rd*er: టీవీకే నేత దారుణ హత్య.. వెంటాడి కొడవళ్లతో దాడి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు
- Delhi Building Collapse: సెకన్లలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. CCTVలో భయానక దృశ్యాలు, 6 మంది మృతి
- Miami Airport Plane Crash: మయామి విమానాశ్రయంలో ఘోర ప్రమాదం.. అమెజాన్ కార్గో బోయింగ్ 767 కూలి 5 మంది మృతి
ఏడేళ్ల కిందట.. చెన్నైలోని పళ్లికరనై డంపింగ్ యార్డ్లో ఓ ప్లాస్టిక్ సంచిలో మనుషుల వేళ్లు బయటపడటంతో ఈ కేసు బయటకు వచ్చింది. ఆ సంచిని ఓపెన్ చేసి చూడగా.. తెగిపడిన కాళ్లు, చేయి కనిపించాయి. ఆ తర్వాత నగరంలోని ఓ నది పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో ఇలాంటి ప్లాస్టిక్ సంచులు మరికొన్ని లభ్యమయ్యాయి. వాటిలో ఎముకలు, అంతర్గత అవయవాలు వంటివి ఉన్నాయి. అయితే.. మృతురాలిని గుర్తించేందుకు వీలుగా తల, ఎడమ చేయి మాత్రం కనిపించలేదు. ఈ కేసును పోలీసులు ఛేదించారు కానీ ఆమె తలను మాత్రం కనిపెట్టలేకపోయారు. దీంతో ఆ మృతదేహం ఆమెదేనని కచ్చితంగా నిర్ధారించేందుకు ముఖం లేకుండా పోయింది. కొన్ని మిస్సింగ్ కేసులతో పోల్చిచూసినా సరైన పోలిక లేదు. దీంతో పళ్లికరనై డంపింగ్ యార్డ్లో ఏకంగా 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టారు. అయినప్పటికీ తల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.
పోలీసులకు దొరికిన కుడి చేతిపై 2 ప్రత్యేకమైన టాటూలు ఉన్నాయి. వాటిని శివపార్వతుల రూపం, డ్రాగన్గా గుర్తించారు పోలీసులు. అదే సమయంలో తూత్తుకుడికి చెందిన ఓ మహిళ తన కూతురు కనిపించడం లేదని పోలీసులు ఆశ్రయించారు. కనిపించకుండా పోయిన ఆమె చెన్నైలో నివసించే 37 ఏళ్ల నటి సంధ్యగా తేలింది. దీంతో ఆ మృతదేహాన్ని తల్లి పరిశీలించి.. చేతిపై ఉన్న టాటూలు, గాజుల ఆధారంగా ఆమె తన కూతురేనని గుర్తించారు. ఆ తర్వాత డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆమె చెప్పింది నిజమేనని తేలింది.
ఈ కేసులో సంధ్య భర్త సినీ నిర్మాత బాలకృష్ణన్ను పోలీసులు విచారణ చేశారు. ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర బంధం ఉందన్న అనుమానంతో రోజూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని.. అందుకే ఆమెను గొడ్డలితో నరికి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు డెడ్బాడీని ముక్కలు చేసి ప్లాస్టిక్ సంచుల్లో వేసి పడేసినట్లు చెప్పాడు. నిందితుడి ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దీన్ని నిర్ధారించారు.
తాజావార్తలు
-
Smart TV: QLED డిస్ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!