Hubballi riot: హుబ్బల్లి అల్లర్లు.. ఎంఐఎం నేతలపై కేసులు విత్డ్రా చేసిన కాంగ్రెస్ సర్కార్..
- హుబ్బల్లి అల్లర్ల కేసు..
- ఎంఐఎం నేతలపై కేసుల్ని విత్ డ్రా చేసిన కర్ణాటక ప్రభుత్వం..
- కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడిన బీజేపీ..
- ముస్లింల బుజ్జగింపు చర్యల్లో భాగంగానే ఈ చర్య అంటూ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hubballi riot: 2022 కర్ణాటక హుబ్బల్లి అల్లర్లు, మతకలహాల కేసులో కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పోలీసులపై దాడి చేసిన గుంపు నాయకత్వం వహించారే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆల్ ఇండియా మజ్లిస్ ఇతెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) నాయకులపై కేసులు ఉపసంహరించుకుంది. ఎంఐఎం నేత మహ్మద్ ఆరిఫ్తో సహా 138 మందిపై క్రిమినల్ కేసులను విత్ డ్రా చేసుకుంది. వీరంతా పోలీసులపై అటాక్ చేయడంతో పాటు పోలీస్ స్టేషన్పై దాడులకు పాల్పడ్డారు. ఏప్రిల్ 2022లో హుబ్బల్లి అల్లర్ల సమయంలో హింసను ప్రేరేపించారని వారు ఆరోపించారు.
వీరిపై హత్యాయత్నం, అల్లర్లకు పాల్పడటం, క్రిమినల్ అభియోగాలు ఉన్నాయి. ప్రాసిక్యూషన్, పోలీస్, న్యాయ శాఖ నుంచి అభ్యంతరాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2023లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ కేసుల్ని ఉపసంహరించుకోవాలని, అభియోగాలను పున:పరిశీలించాలని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్కి లేఖ రాశారు. శివకుమార్ సిఫారసులతో ఎఫ్ఐఆర్, సాక్షుల వాంగ్మాలాలతో సహా సంబంధిత కేసు సమాచారాన్ని సేకరించే బాధ్యత హోం శాఖకు అప్పగించారు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: Dussehra 2024: దసరా తిథి, ఆయుధ పూజలకు అనుకూలమైన సమయం?
అయితే, కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ విరుచుకుపడింది. ముస్లింలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని విమర్శించింది. ఉగ్రవాదులకు మద్దతిస్తూ వారిపై ఉన్న కేసులను ఉపసంహరించుకుంటుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. రైతులు, విద్యార్థులపై కేసులు పెండింగ్లో ఉండగా, భారత వ్యతిరేక చర్యలకు పాల్పడిన వారిపై కేసులు విత్ డ్రా చేసుకుంటున్నారని అన్నారు.
ఏప్రిల్ 16, 2022లో మసీదుపై కాషాయ జెండాను ఉంచినట్లు అవమానకరమైన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో హుబ్బల్లిలో అల్లర్లు చెలరేగాయి. దీంతో ముస్లిం వర్గాలు ఆందోళనలు చేశాయి. హుబ్బల్లీ పోలీస్ స్టేషన్ ముందు భారీగా గుంపు చేరి, దాడికి పాల్పడ్డారు. ఈ అల్లర్లలో నలుగురు పోలీసులకు గాయాలు కాగా, ప్రజా ఆస్తులకు గణనీయమైన నష్టం కలిగింది.
- Tags
- bjp
- congress
- Hubballi riot
- karnataka
- MIM
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!