India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- అమల్లోకి భారత్-యూకే ఒప్పందం
- వేలాది వస్తువులపై తగ్గనున్న సుంకాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-బ్రిటన్ మధ్య కుదిరిన చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జూలై 15 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇటీవలి కాలంలో భారత్ కుదుర్చుకున్న అతిపెద్ద వాణిజ్య ఒప్పందాల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు. ఈ ఒప్పందంతో భారతీయ ఉత్పత్తులకు బ్రిటన్ మార్కెట్లో మరింత ప్రాధాన్యత లభించనుండగా… రెండు దేశాల మధ్య వేలాది వస్తువులపై దిగుమతి సుంకాలు తగ్గనున్నాయి.
ఈ ఒప్పందంతో పాటు డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ కూడా అమల్లోకి వచ్చింది. దీని ద్వారా తాత్కాలికంగా యూకేలో పనిచేసే వేలాది మంది భారతీయ నిపుణులకు సామాజిక భద్రతా చెల్లింపుల్లో భారీ ఊరట లభించనుంది. ఈ సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య కుదిరిన అత్యంత ప్రతిష్ఠాత్మక, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ‘‘గోల్డ్ స్టాండర్డ్’’ వాణిజ్య ఒప్పందమని పేర్కొన్నారు.
Also Read
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
యూకేకు ఎగుమతి అయ్యే భారత ఉత్పత్తుల్లో 99 శాతం వస్తువులపై దిగుమతి సుంకాలు పూర్తిగా తొలగించబడతాయి లేదా తగ్గుతాయి. భారత్లోకి దిగుమతి అయ్యే 90 శాతం బ్రిటిష్ ఉత్పత్తులపై కూడా సుంకాలు తగ్గనున్నాయి. ఈ ఒప్పందం కేవలం సుంకాలకే పరిమితం కాకుండా మొత్తం 30 అధ్యాయాలతో రూపొందించబడింది. ఇందులో డిజిటల్ ట్రేడ్, ఫైనాన్షియల్ సర్వీసులు, టెలికమ్యూనికేషన్స్, మేధో సంపత్తి హక్కులు, ఇన్నోవేషన్, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ కొనుగోళ్లు
పారదర్శకత, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మద్దతు వంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇక యూకే దిగుమతి సుంకాలు తగ్గడంతో భారత్కు చెందిన అనేక ఎగుమతి రంగాలకు భారీ ఊరట లభించనుంది.
లాభపడనున్న రంగాలు:
వస్త్ర, దుస్తుల పరిశ్రమ
లెదర్ ఉత్పత్తులు
రత్నాలు, ఆభరణాలు
ఇంజినీరింగ్ ఉత్పత్తులు
ఆటో విడిభాగాలు
ఫర్నిచర్
క్రీడా సామగ్రి
రసాయనాలు
యంత్రాలు
ప్రాసెస్డ్ ఫుడ్
సముద్ర ఆహార ఉత్పత్తులు
టీ
సుగంధ ద్రవ్యాలు
టెక్స్టైల్ రంగానికి భారీ ఊరట
ఈ ఒప్పందంతో వస్త్ర పరిశ్రమకు అత్యధిక ప్రయోజనం లభించనుంది. భారత దుస్తులు, హోమ్ టెక్స్టైల్స్పై ఉన్న 8 నుంచి 12 శాతం వరకు దిగుమతి సుంకాలు పూర్తిగా తొలగించబడ్డాయి. దీంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే భారత్ పోటీ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది.
వెల్స్పన్ లివింగ్ సీఈఓ దీపాలి గోయెంకా మాట్లాడుతూ.. ప్రస్తుతం యూకే హోమ్ టెక్స్టైల్ దిగుమతుల్లో పాకిస్థాన్ వాటా 55 శాతం ఉండగా, భారత్ వాటా కేవలం 6-7 శాతమేనని, ఇప్పుడు ఆ అంతరాన్ని తగ్గించే అవకాశం వచ్చిందని తెలిపారు. పరిశ్రమ అంచనాల ప్రకారం వచ్చే మూడు సంవత్సరాల్లో భారత్ నుంచి యూకేకు టెక్స్టైల్ ఎగుమతులు 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. యూకే ప్రభుత్వం పలు భారతీయ వ్యవసాయ ఉత్పత్తులపై కూడా దిగుమతి సుంకాలను తొలగించింది. వాటిలో బాస్మతి బియ్యం, టీ, సుగంధ ద్రవ్యాలు, రొయ్యలు, ప్రాసెస్డ్ ఫుడ్ ఉన్నాయి. దీంతో కేరళ, అసోం, గుజరాత్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎగుమతిదారులకు పెద్దఎత్తున లాభం చేకూరనుంది. రసాయనాలు, ఆటోమొబైల్, ఉక్కు రంగాలకు కూడా ఊతం లభించనుంది.
ఈ ఒప్పందంతో అగ్రో కెమికల్స్, ఇండస్ట్రియల్ కెమికల్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు యూకే మార్కెట్లో సుంక రహిత ప్రవేశం పొందనున్నాయి. 2030 నాటికి భారత రసాయన ఉత్పత్తుల ఎగుమతులు రెట్టింపు అవుతాయని అంచనా. అలాగే కోటా విధానంలో భారత్కు చెందిన ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీ సంస్థలకు కూడా ప్రత్యేక అవకాశాలు లభించనున్నాయి. ఉక్కు రంగానికి కూడా ఇది కీలక ఒప్పందంగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్కు 350 మిలియన్ డాలర్ల విలువైన ఉక్కు ఎగుమతి కోటా లభించింది. ఇది గత సగటు ఎగుమతుల కంటే చాలా ఎక్కువ. 2027 నాటికి ఉక్కు ఎగుమతులు 1 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
FTAతో పాటు అమల్లోకి వచ్చిన డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ (DCC) వల్ల యూకేలో తాత్కాలికంగా పనిచేసే భారతీయ నిపుణులు ఐదేళ్ల వరకు అక్కడి నేషనల్ ఇన్సూరెన్స్ పథకానికి చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉండదు. దానికి బదులుగా వారు భారత్లోని సోషల్ సెక్యూరిటీ వ్యవస్థకే చెల్లింపులు కొనసాగించవచ్చు.
వాణిజ్య అడ్డంకులను తగ్గించడం, ఎగుమతులకు కొత్త మార్కెట్లు కల్పించడం, ఉద్యోగులు, పరిశ్రమలకు వ్యయాలను తగ్గించడం ద్వారా భారత్-యూకే ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు భారత పరిశ్రమలకు ప్రపంచ మార్కెట్లో కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
- Tags
- Free-Trade Agreement
- FTA
- india
- UK
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?