Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Jyoti Malhotra Arrested Haryana Youtuber Vaisakhi Festival Pak Pilgrimage Espionage

Jyoti Malhotra: భారత్‌పై ద్వేషం.. పాక్‌పై మమకారం.. జ్యోతి మల్హోత్రా అలా మారిపోవడానికి కారణమేంటి?

NTV Telugu Twitter
Published Date :May 20, 2025 , 9:48 am
By Suresh Maddala
  • భారత్‌పై ద్వేషం.. పాక్‌పై మమకారం
  • జ్యోతి మల్హోత్రా అలా మారిపోవడానికి కారణమేంటి?
  • ఐబీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు
Jyoti Malhotra: భారత్‌పై ద్వేషం.. పాక్‌పై మమకారం.. జ్యోతి మల్హోత్రా అలా మారిపోవడానికి కారణమేంటి?
  • Follow Us :
  • google news
  • dailyhunt

కన్నతల్లిని.. పుట్టిన గడ్డను మరిచిపోకూడదంటారు. ఇక దేశం పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలని పెద్దలు చెబుతుంటారు. భారతదేశం విషయానికొస్తే.. ఇక్కడున్న సంస్కృతి, సంప్రదాయాలు, వాతావరణం ఏ దేశంలో ఉండదు. ఇంతటి మంచి వాతావరణం భారతదేశం సొంతం. అలాంటి దేశం పట్ల ద్వేషం పెంచుకుంది ఓ భారతీయురాలు. సొంత దేశానికే వెన్నుపోటు పొడిచేందుకు కుయుక్తి పన్నింది. ఆమె ఎవరు? ఏంటో ఈపాటికే అర్థమై ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రస్తుతం వార్తల్లో హాట్ టాఫిక్‌గా మారిన జ్యోతి మల్హోత్రా గురించి. అసలు ఆమె పాక్ ప్రేరేపిత మనిషిగా ఎలా మారిపోయింది. భారత్‌పై ఎందుకు ద్వేషం పెంచుకుంది. పాక్‌ నేతలతో అంతటి దగ్గర సంబంధాలు ఎలా పెంచుకోగలిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా గురించి సంచలన విషయాలు బయటపెట్టిన తండ్రి..

జ్యోతి మల్హోత్రా హర్యానా వాసి. తండ్రి చాటు బిడ్డగా జీవితాన్ని సాగిస్తోంది. కోవిడ్-19 వరకు ఢిల్లీలో వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేస్తుండేది. కరోనా తర్వాత ఉద్యోగాన్ని కోల్పోయింది. అనంతరం ట్రావెలర్ యూట్యూబర్‌గా అవతారం ఎత్తింది. భారత్‌లో వివిధ ప్రాంతాల్లోనే కాకుండా దాయాది దేశం పాకిస్థాన్‌తో పాటు అనేక దేశాలు చుట్టొచ్చేసింది.

ఇది కూడా చదవండి: India Pakistan Conflict: పాకిస్తాన్‌పై భారత్ దాడి చేస్తే.. దాక్కోవడానికి కలుగు వెతుక్కోవాలి!

సిక్కు మతానికి సంబంధించిన ఆమె.. పవిత్ర స్థలాలకు ఆధ్యాత్మిక ప్రయాణం అనే ముసుగులో ట్రావెల్ వ్లాగింగ్ ప్రారంభించింది. ఇందులో భాగంగా తీర్థయాత్రలకు ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లే హర్‌కిరత్‌సింగ్ పరిచయం అయ్యాడు. ఇతడు పాకిస్థాన్ వెళ్లేందుకు సాయం చేశాడు. అయితే పాకిస్థాన్‌లో జరిగే సిక్కు మత పండుగ వైశాఖి ఉత్సవానికి వెళ్లేందుకు జ్యోతి మల్హోత్రాకు అనుమతి దొరకలేదు. ఆ సమయంలోనే ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో పని చేసే డానిష్‌కు జ్యోతి మల్హోత్రాను హర్‌కిరత్‌సింగ్ పరిచయం చేశాడు. అలా డానిష్‌తో జ్యోతి మల్హోత్రాకు దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. అతడి పరిచయంతో మొదటిసారి 2023లో 324వ వైశాఖి పండుగ కోసం దాయాది దేశం పాకిస్థాన్‌లో అడుగుపెట్టింది. ఇక డానిష్‌తో జ్యోతికి మరింత దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో రెండోసారి 2024, ఏప్రిల్‌లో 325వ వైశాఖి ఉత్సవానికి జ్యోతి వెళ్లింది. అయితే ఈసారి ఒక నెలకు పైగా అక్కడే ఉండిపోయింది. ఏప్రిల్ 17 నుంచి మే 25 వరకు అక్కడే ఉండిపోయింది. ఆ సమయంలోనే పాక్‌లో ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియంతో పాటు పలు కీలక వ్యక్తులతో రిలేషన్ పెంచుకున్నట్లు కథనాలు పేర్కొన్నాయి.

ఇక డానిష్‌తో జ్యోతి మల్హోత్రాకు చాలా క్లోజ్ సంబంధాలు ఏర్పడ్డాయి. అతడు ఆమెను మతపరంగా బాగా లోబర్చుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌పై ద్వేషం పెంచుకునేలా.. పాకిస్థాన్‌పై మమకారం పెంచేకునేలా ప్రేరేపించినట్లుగా సమాచారం. ఆమె నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ జోలో దాదాపు 450 వీడియోలు ఉన్నాయి. అందులో ఎక్కువగా పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉన్న వీడియోలే ఉన్నాయి. ఇక దాయాది దేశాన్ని ఒక రేంజ్‌లో కీర్తించే విధంగా మారిపోయింది. పూర్తిగా ఆమె పాకిస్థాన్ ప్రేమికురాలిగా మారిపోయింది. ఎంతగా అంటే ఇటీవల పహల్గామ్ ఉగ్ర దాడి జరిగి 26 మంది చనిపోయారు. కొత్తగా పెళ్లైన మహిళలతో పాటు అనేక మంది మహిళలు విధవరాళ్లు అయ్యారు. దేశమంతా దు:ఖంలో ఉంది.

పహల్గామ్ ఉగ్ర ఘటన తర్వాత భారత్.. పాకిస్థాన్ పట్ల కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను ఆమె తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. భారత్‌కు వ్యతిరేకంగా.. పాక్‌కు అనుకూలమైన వ్యాఖ్యలు చేస్తూ కీలక పోస్టులు పెట్టింది. అంతగా ఆమె పాక్‌కు ముగ్ధురాలు అయిపోయింది. ఇంకొక విషయమేంటంటే ప్రస్తుతం విచారణలో ఉన్న ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించకపోవడం విశేషం. ఇక పహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన సమయంలో డానిష్‌తో ఎన్‌క్రిప్టెడ్ సంబంధాలు నెరిపింది. అతడితో రహస్య సంభాషణ సాగించినట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించారు.

ఇక ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్ర దాడికి ముందు మార్చిలో జ్యోతి పాకిస్థాన్ వెళ్లినట్లుగా అధికారులు కనిపెట్టారు. అంతకముందు ఆమె కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలతో పాటు పహల్గామ్ ప్రదేశాలను చిత్రీకరించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను పాక్ అధికారులకు చేరవేసినట్లుగా అధికారులు గుర్తించారు. డానిష్‌కు.. పాకిస్థాన్ ఐఎస్ఐతో మంచి సంబంధాలు ఉన్నాయి. జ్యోతి సాయంతో భారత రక్షణ విషయాలను ఐఎస్ఐకు చేరవేసినట్లు సమాచారం. ఎప్పుడైతే జ్యోతి-డానిష్ సంబంధాలు బయటపడ్డాయో మే 13న డానిష్‌ను భారత్ నుంచి బహిష్కరించారు.

ఇక పాకిస్థాన్‌తో జ్యోతికి బాగా దగ్గర సంబంధాలు ఏర్పడిన తర్వాత ఆమె చైనా, నేపాల్, బంగ్లాదేశ్, యూఏఈ, థాయిలాండ్, ఇండోనేషియా, భూటాన్ వంటి అనేక దేశాలను ఆమె సందర్శించినట్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో పేర్కొంది. 2024 నవంబర్‌లో కాశ్మీర్ పర్యటన.. 2025 మార్చిలో పాకిస్థాన్‌లో జ్యోతి పర్యటించడం. ఈ రెండు పరిణామాల తర్వాతనే పహల్గామ్ ఉగ్ర దాడి జరినట్లుగా ఐబీ భావిస్తోంది. ప్రస్తుతం జ్యోతికి సంబంధించిన డిజిటల్ పరికరాలన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌క్రిప్టెడ్ చాట్‌లు, పాకిస్థాన్‌కు అనుకూలమైన కంటెంట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా ఐబీ దర్యాప్తు చేస్తోంది. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Espionage
  • Haryana YouTuber
  • IB questioning
  • Jyoti malhotra arrested
  • Operation Sindoor

తాజావార్తలు

  • Off The Record: వైసీపీ అధిష్టానం ఆ విషయంలో ఎందుకు తికమక పడుతుంది..?

  • Off The Record: వైసీపీలో పినెల్లిని తప్పించడానికి అధిష్టానం చూస్తుందా..?

  • Neha Sharma : ఘాటు అందాలతో రెచ్చిపోయిన నేహాశర్మ..

  • Off The Record: పలాసలో రగులుతున్న పొలిటికల్ కొలిమి

  • Iran – Israel War : లైవ్ లో యాంకర్ న్యూస్ చదువుతుండగా ఇజ్రాయెల్ దాడి..

ట్రెండింగ్‌

  • Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions