JP Nadda: ఆమ్ ఆద్మీ పార్టీ రేపిస్టును.. థెరపిస్టు చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JP Nadda criticizes Aam Aadmi Party: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వర్సెస్ బీజేపీగా సాగుతోంది రాజకీయం. ఇరుపార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.ఇదిలా ఉంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఢిల్లీలో ఆదివారం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీలోని వజీర్ పూర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Read Also: Love Today OTT Release : లవ్ టుడే ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే
Also Read
- LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
- DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
- Sourav Ganguly: దాదాకు షాక్.. గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం
- Gita Gopinath: దీర్ఘకాలిక యుద్ధం జరిగితే ప్రపంచానికే ప్రమాదం.. గీతా గోపినాథ్ హెచ్చరిక
ఆప్ నాయకులు నిజాయితీపరులని చెప్పుకునే వారని.. అయితే ప్రస్తుతం ఆ పార్టీకి చెందిన మంత్రి సత్యేంద్ర జైన్ అవినీతికి పాల్పడి జైలులో ఉన్నారని.. వారు తీహార్ జైలును మసాజ్ సెంటర్ గా మార్చారని.. రేపిస్టును థెరపిస్టుగా మార్చారని వజీర్ పూర్ పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు జేపీ నడ్డా. ‘సంకల్ప్ పత్ర’పేరుతో మెనిఫెస్టో విడుదల చేసింది బీజేపీ. జేపీ నడ్డా వెంట ఎంపీ హర్షవర్థన్, ఇతర పార్టీ నేతలు ఉన్నారు. ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా సహా వివిధ పార్టీల నేతలు కూడా ఉన్నారు.
మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్ ఇటీవల జైలులో మసాజ్ చేయించుకోవడం వివాదాస్పదం అయింది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ బయటపెట్టింది. అయితే ముందుగా ఆప్ ఈ చర్యను సమర్థించుకుంది. జైన్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో మసాజ్ చేయించుకున్నాడని వెనుకేసుకొచ్చింది. ఆ తరువాత మసాజ్ చేసిన వ్యక్తి జైలులో రేపు కేసులో శిక్ష అనుభవిస్తున్నవాడిగా తేలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ 250 వార్డుల్లోని ప్రజలకు చేరువకావాలని బీజేపీ ప్రచారం ప్రారంభించింది. కేంద్రమంత్రులు, కీలక నేతలు ప్రచారంలో పాల్గొననున్నారు. డిసెంబర్ 4న ఈ ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
తాజావార్తలు
-
Nandu World: వాళ్లిద్దరూ యూట్యూబ్లో ఫేమస్.. చేసేది మాత్రం..!
-
LPG Demand Drop: అమాంతం పడిపోయిన LPG వినియోగం.. పెట్రోల్, డీజిల్ రివర్స్.. !
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
DK.Shivakumar: ముఖ్యమంత్రిగా యువతపై డీకే.శివకుమార్ వరాల జల్లు.. విద్యార్థులందరికీ ఫ్రీ బస్ పాస్లు
-
Snakes Living in Groups: షాకింగ్ నిజాలు.. ఒక పాము కనిపిస్తే జాగ్రత్త..! దాని గుంపు మొత్తం సమీపంలోనే..!
ట్రెండింగ్
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!