PM Modi: బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్ల కోసం హేమంత్ సర్కార్ బిజీగా ఉంది
- జార్ఖండ్లోని గర్వాలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం
- హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజం
- బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్ల కోసం బిజీగా ఉందని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం ప్రధాని మోడీ గర్వాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిపై మోడీ నిప్పులు చెరిగారు. బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్ల కోసం ఇండియా కూటమి బిజీగా ఉందని ఆరోపించారు. ‘‘గుష్పైథియా బంధన్ (చొరబాటుదారుల కూటమి)’’గా మారిందని పేర్కొన్నారు. చొరబాటుదారులతో సామాజిక నిర్మాణానికి ముప్పు అని చెప్పారు. పాఠశాలల్లో సరస్వతి వందనాన్ని అడ్డుకున్నారంటే.. రాష్ట్రంలో ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. బుజ్జగింపులే హేమంత్ సోరెన్ ప్రభుత్వ ప్రధాన అజెండా అని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Nithiin: శివరాత్రికి తమ్ముడు దిగుతున్నాడు!
Also Read
- Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
- Pakistan: పాకిస్తాన్పై మీర్పూరీ ముస్లింల తిరుగుబాటు..
- TMC crisis: మళ్లీ కాంగ్రెస్ గూటికి మమతా బెనర్జీ? ఢిల్లీ వేదికగా టీఎంసీ విలీనానికి తెరవెనుక స్కెచ్!
- TMC Crisis: మూడు దశాబ్దాల దీదీ సామ్రాజ్యం నిలువునా కొల్లాప్స్.. టీఎంసీ కూలడానికి ప్రధాన కారణాలు ఇవే..
బంగ్లాదేశ్చొరబాటుదారులు జార్ఖండ్ వ్యాప్తంగా విస్తరిస్తున్నారన్నారు. వారి ఓట్లను పొందడానికి ప్రభుత్వం మద్దతుదారులుగా వ్యవహరిస్తోందని వివరించారు. సరస్వతీ వందనను(సరస్వతి గేయం) పాఠశాలలో ఆలపించేందుకు అనుమతించకపోడం ఎంత పెద్ద ప్రమాదమో ఊహించుకోవాలన్నారు. పండుగల సమయంలో రాళ్ల దాడి జరిగినప్పుడు, కర్ఫ్యూ విధించడం, దుర్గమ్మను ఆపడం అది ఎంత ప్రమాదకరమో మీకు తెలుసు అన్నారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీల దుష్ట విధానాలు ఇలాగే కొనసాగితే జార్ఖండ్లో ఆదివాసీ సమాజం కుంచించుకుపోతుందని వివరించారు. చొరబాటు కూటమిని నిర్మూలించడానికి మీ ఓటును ఉపయోగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర పథకాలను అమలు చేసే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటేనే జార్ఖండ్లో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని మోడీ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: World War 3 : జ్యోతిష్యం నిజమవుతుందా..? మూడో ప్రపంచ యుద్ధమేనా..!?
జార్ఖండ్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 13, 20 తేదీల్లో ఓటింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి పోటాపోటీగా తలపడుతున్నాయి. ఓటర్లు ఈసారి అధికారం ఎవరికి కట్టబెడతారో వేచి చూడాలి.
#WATCH | Chaibasa | #JharkhandAssemblyElections2024 | PM Narendra Modi says, "Kolhan is again ready to uproot the JMM-Congress-RJD's tyrant govt. Everyone is saying that Kolhan is going to create a history… I am certain that BJP-NDA will form the govt with more number of seats… pic.twitter.com/WgRstaZPQE
— ANI (@ANI) November 4, 2024
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటింట్లో ఇల్లాళ్లకు బ్రహ్మాస్త్రం.. ఈ చిట్కాలతో గంటల పని నిమిషాల్లో ముగుస్తాయి!
-
Peddi: హోంశాఖకు షాక్: ‘పెద్ది’ టికెట్ల పెంపుపై కోర్టు ధిక్కరణ నోటీసులు!
-
Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
-
NBK 111 : బాలయ్య ఆన్ ట్రాక్.. ఇక థియేటర్లలో పూనకాలే!
-
Cockroach Janta Party: మోడీ సర్కార్కు బొద్దింకల అల్టిమేటం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!