Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Jaishankars Key Comments On The Oppression Of Minorities In Pakistan

EAM Jaishankar: ఇందిరాగాంధీ కూడా పాకిస్తాన్ మతోన్మాద మనస్తత్వాన్ని మార్చలేకపోయారు..

Published Date :March 28, 2025 , 4:43 pm
By Venu Goapl Reddy
  • పాకిస్తాన్‌లో మైనారిటీ అణచివేతపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు..
  • అంతర్జాతీయ దృష్టికి తీసుకెళ్తామని లోక్‌సభలో ప్రకటన..
  • ఇందిరా గాంధీ కూడా ఆ దేశ మతోన్మాద మనస్తత్వాన్ని మర్చాలేకపోయారు..
EAM Jaishankar: ఇందిరాగాంధీ కూడా పాకిస్తాన్ మతోన్మాద మనస్తత్వాన్ని మార్చలేకపోయారు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

EAM Jaishankar: పాకిస్తాన్‌లో మైనారిటీల అణచివేతపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో మాట్లాడారు. పాకిస్తాన్‌ మైనారిటీల పట్ల వ్యవహరిస్తున్న తీరునను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామని శుక్రవారం చెప్పారు. మాజీ ప్రధానమంత్రి మరియు కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా గాంధీ కూడా పాకిస్తాన్ మనస్తత్వాన్ని మార్చడంలో విజయం సాధించలేరని మంత్రి పార్లమెంటుకు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో, పాకిస్తాన్‌లో మైనారిటీలపై నేరాలు, దౌర్జన్యాలపై సమాధానం ఇస్తూ.. ఫిబ్రవరిలో పాకిస్తాన్‌లో జరిగిన 10 దారుణ సంఘటనల్ని ఉదహరించారు. వీటిలో ఏడు కిడ్నాప్‌ చేసి బలవంతపు మతమార్పిడి, రెండు కిడ్నాప్‌లు, హోలీ జరుపుకుంటున్న విద్యార్థులపై పోలీస్ చర్యల వంటి సంఘటనల గురించి చెప్పారు.

పాకిస్తాన్‌లో సిక్కు కమ్యూనిటీకి సంబంధించి మూడు ఘటనలు, అహ్మదీయ కమ్యూనిటీకి సంబంధించి రెండు ఘటనలు జరిగినట్లు ఆయన వెల్లడించారు. మానసికంగా అస్థిరంగా ఉన్న ఒక క్రైస్తవ వ్యక్తిపై దైవదూషణ కేసు నమోదైనట్లు ఆయన చెప్పారు. సిక్కు కుటుంబంపై దాడి జరిగిందని, మరొక సందర్భంలో పాత గురుద్వారా తిరిగి తెరిచినందుకు సిక్కు కుటుంబాన్ని బెదిరించినట్లు ఆయన చెప్పారు. సిక్కు కమ్యూనిటీకి చెందిన ఒక బాలికను అపహరించి మతం మార్చినట్లు వెల్లడించారు.

Also Read

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!
  • TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
  • West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
Add as a preferred
source on google

Read Also: Samantha : నాకు నచ్చినట్టు బతుకుతా.. రూల్స్ పెడితే నచ్చదుః సమంత

పాకిస్తాన్ మాదిరిగానే బంగ్లాదేశ్‌లోని మైనారిటీల సంక్షేమం, వారి శ్రేయస్సుని గమనిస్తున్నామని జైశంకర్ అన్నారు. 2024లో మైనారిటీలపై 2400 దాడులు జరిగాయని, 2025లో ఇప్పటి వరకు 72 సంఘటనలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. పాకిస్తాన్‌పై దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తరహాలో కఠిన చర్య తీసుకోవాలని భారత్ యోచిస్తుందా..? అనే ప్రశ్నకు సమాధానంగా.. ఒక ప్రభుత్వంగా, దేశంగా మనం పొరుగువారి మతోన్మాద మనస్తత్వాన్ని మార్చలేము అని అన్నారు.

మార్చి 26న, హ్యూమన్ రైట్స్ ఫోకస్ పాకిస్తాన్ (HRFP) 2025 మొదటి త్రైమాసికంలో ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో పాకిస్తాన్ వ్యాప్తంగా మైనారిటీలపై అకృత్యాలను పెరిగినట్లు చెప్పింది. మైనారిటీలపై జరుగుతున్న సంఘటనల్ని ఖండించింది. ఇలాంటి ఘటనల్లో బాధితులకు న్యాయం దక్కడం లేదని ఈ రిపోర్ట్ చెప్పింది. పాకిస్తాన్‌లో మతపరమైన మైనారిటీల దాడులు, హత్యలు, దైవదూషణ ఆరోపణలు, కిడ్నాపులు, బలవంతపు మతమార్పిడులు పెరిగినట్లు నివేదించింది. జనవరి 2025 నుంచి ఇలాంటి ఘటనల్లో పెరుగుదల కనిపించినట్లు ఈ సంస్థ నివేదించింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • EAM Jaishankar
  • Jaishankar
  • Lok Sabha
  • Minorities in Pakistan
  • Pakistan

తాజావార్తలు

  • Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..

  • TVK Vijay: విజయ్‌కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్‌లపై వామపక్షాలు గుర్రు!

  • CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • US-Iran Talks: హార్ముజ్‌పై గుడ్‌న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!

  • Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions