ISRO: ఈ శాటిలైట్ ద్వారా పాకిస్తాన్ రాత్రి ఏం చేస్తుందో కూడా చూడొచ్చు.. రేపే ప్రయోగం..
- కీలక ప్రయోగానికి ఇస్రో సిద్ధం..
- రేపే EOS-9 శాటిలైట్ ప్రయోగం..
- రాత్రి వేళల్లో ఫోటోలు తీసే సామర్థ్యం..
- దేశ సరిహద్దులపై మరింత నిఘా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అత్యంత కీలకమైన శాటిలైట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం ఉదయం 5.59 గంటలకు శ్రీహరికోట లోని సతీష్ ధావాన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-9) రాడార్ శాటిలైట్ని పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇస్రో చేపట్టిన 101వ రాకెట్ ప్రయోగం ఇది. 1,696 కిలోగ్రాముల EOS-9 రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలం నుండి 500 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ఉంచనున్నారు.
ఈ గూఢచర్య ఉపగ్రహం లో C-బ్యాండ్ సింథటిక్ ఎపర్చర్ రాడార్ అమర్చబడి ఉంది, ఇది అన్ని వాతావరణ పరిస్థితులలో మరియు తక్కువ కాంతిలో భూమి ఉపరితలం యొక్క అధిక-రిజల్యూషన్ చిత్రాలను తీస్తుంది. ఫలితంగా, భారత సరిహద్దులపై మరింత నిఘా వేయవచ్చు. భారతదేశానికి ఇప్పటికే 57 కన్నా ఎక్కువ ఉపగ్రహాలు అంతరిక్షంలో ఉన్నాయి. తాజాగా వీటికి EOS-9 ఉపగ్రహం జత కలుస్తుంది.
Also Read
- Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
- CJP Protest: పేద-ధనిక భేదం లేకుండా విద్యార్థుల పోరు.. 2012 నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆ స్థాయి విప్లవం!
- TVK: నీట్ను పూర్తిగా రద్దు చేయాలి.. టీవీకే పార్టీ సంచలన డిమాండ్
- National Flag Day: నేడు జాతీయ జెండా దినోత్సవం.. తిరంగా గురించి ఈ విషయాలు ఎంత మందికి తెలుసు?
Read Also: Asaduddin Owaisi: పాకిస్తాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు..
ముఖ్యంగా, పాకిస్తాన్ చైనాల నుంచి వస్తున్న ముప్పుని రాత్రి వేళల్లో కూడా ఈ శాటిలైట్ ద్వారా పసిగట్టవచ్చు. రాత్రి వేళల్లో చొరబాట్లు, ఉగ్రవాదులు, శత్రు సైన్యం మోహరింపును గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంటుంది. రాత్రి వేళల్లో పనిచేయలేని కార్టోసాట్-3 శాటిలైట్లో పోలిస్తే EOS-9 మెరుగైన చిత్రాలను అందిస్తుంది. ఇది లో ఎర్త్ ఆర్బిట్ నుంచి అర మీటర్ కంటే తక్కువ రిజల్యూషన్తో చిత్రాలను అందిస్తుంది. ఇటీవల, ప పహల్గామ్ ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ శాటిలైట్ ప్రయోగం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ, “దేశం భద్రతను నిర్ధారించడానికి కనీసం 10 ఉపగ్రహాలు 24 గంటలూ పనిచేస్తున్నాయి. దేశం దాని 7,000 కి.మీ సముద్ర తీర ప్రాంతాలను, మొత్తం ఉత్తర భాగాన్ని పర్యవేక్షించాలి. ఉపగ్రహం మరియు డ్రోన్ సాంకేతికత లేకుండా, దేశం దీనిని సాధించదు.” అని అన్నారు. ఈ ప్రయోగానికి అనేక మంది పార్లమెంట్ సభ్యులు హజరు కానున్నారు.
తాజావార్తలు
-
Preity Zinta Support Student Protests: విద్యార్థుల ఉద్యమానికి మద్దతు.. ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Kiran Abbavarm : సంబరాల ఏటిగట్టు వదులుకున్న కిరణ్ అబ్బవరం.. కారణం ఏంటంటే?
-
CJP Protest: పేద-ధనిక భేదం లేకుండా విద్యార్థుల పోరు.. 2012 నిర్భయ ఘటన తర్వాత ఢిల్లీలో మళ్లీ ఆ స్థాయి విప్లవం!
-
Gold and Silver Price: ఆషాడంలో కూడా తగ్గట్లేవుగా బంగారం.. భారీగా పెరిగిన ధరలు
-
AA 23 : బన్నీ- లోకి సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే ఫిక్స్.. లుక్ టెస్ట్ ఫినిష్
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!