Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్పై చైనా-పాక్ జాయింట్ స్టేట్మెంట్.. భారత్ ఘాటు రిప్లై..
- జమ్మూకాశ్మీర్పై చైనా-పాక్ జాయింట్ స్టేట్మెంట్..
- తీవ్రంగా స్పందించిన భారత్..
- జమ్మూకాశ్మీర్
- లడఖ్ భారత్లో అంతర్భాగాలు..
- భారత విదేశాంగ శాఖ ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ని ఉద్దేశించి పాకిస్తాన్-చైనాలు చేసిన సంయుక్త ప్రకటనను భారత్ తీవ్రంగా తప్పుపట్టింది. లడఖ్తో సహా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ భారత్లో అవిభాజిత భాగాలని, విడదీయరాని ప్రాంతమని ఘాటుగా స్పందించింది. చైనా-పాక్ సంయుక్త ప్రకటన అనవసర సూచనలుగా భారత్ విమర్శించింది. పాక్ ప్రధాని షెహబాష్ షరీఫ్ జూన్ 4 నుంచి 8 వరకు చైనాలో పర్యటించారు. చైనా ప్రెసిడెంట్ జి జిన్పింగ్తో సమావేశమైన తర్వాత భారత్ ప్రతిస్పందన వచ్చింది. ఈ భేటీలో పాక్, చైనాలు డ్రీమ్ ప్రాజెక్ట్ చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) గురించి కూడా చర్చించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రోడ్డు, ఇతర కార్యకలాపాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) నుంచి వెళ్తుండటాన్ని భారత్ తీవ్రంగా తప్పుబడుతోంది.
జూన్ 7న పాక్-చైనాలు జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ తాజా పరిణామాలను పాకిస్తాన్ చైనాకు వివరించిందని, జమ్మూ కాశ్మీర్ వివాదం చరిత్రలో మిగిలిపోయిందని, యూఎన్ చార్టర్కి అనుగుణంగా శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సంయుక్త ప్రకటన చేశాయి. అయితే, దీనిని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది.
Also Read
- Bangladesh: బంగ్లాదేశ్కు చైనా యుద్ధ విమానాలు.. భారత్కు సవాలేనా.?
- Kolkata: కోల్కతాలో కూలిన గోదాం.. 8 మంది మృతి
- Iran invites PM Modi: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకండి.. మోడీకి ఇరాన్ ఆహ్వానం..
- India Iran Travel Advisory: ఇరాన్కు అనవసర ప్రయాణాలు వద్దు.. పౌరులకు హెచ్చరిక జారీ చేసిన భారత రాయబార కార్యాలయం
Read Also: Ajit Doval: మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్.. పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు
‘‘జూన్ 7 నాటి చైనా మరియు పాకిస్తాన్ల మధ్య సంయుక్త ప్రకటనలో జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంపై అనవసరమైన సూచనలను మేము గుర్తించాము. మేము అటువంటి సూచనలను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాము. ఈ సమస్యపై మా వైఖరి స్థిరంగా ఉంది మరియు సంబంధిత పార్టీలకు బాగా తెలుసు’’ అని విదేశీ వ్యవహారాల (ఎంఈఏ) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలోని అంతర్భాగాలు మరియు విడదీయరాని భాగాలుగా ఉన్నాయి, అలాగే ఉంటాయి. మరే ఇతర దేశానికీ దీనిపై వ్యాఖ్యానించే అధికారం లేదని అన్నారు.
పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టు, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సులను కలుపుతూ 3000 కి.మీ మేర 50 బిలియన్ డాలర్లతో సీపెక్ కారిడార్ని చైనా నిర్మిస్తోంది. ఇది భారత్లో అంతర్భాగంగా చెప్పబడుతున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిట్ బాల్టిస్టాన్ గుండా వెళ్తోంది. ఇది తమ సార్వభౌమాత్వాన్ని ఉల్లంఘించడమే అని భారత్ చాలా సార్లు చెప్పింది.
- Tags
- china
- CPEC
- india
- jammu kashmir
- Pakistan
తాజావార్తలు
-
Indian Player: అనూహ్యంగా టీమ్ ఇండియాలోకి ముంబై ఆల్రౌండర్.. జూన్ 26 నుంచి బరిలోకి..
-
CM Chandrababu Warning: పవన్ కల్యాణ్పై నోరు పారేసుకుంటే ఖబర్దార్.. చంద్రబాబు సీరియస్ వార్నింగ్
-
Jagadish Reddy: కుసుమ్ పథకంలో వెయ్యి కోట్ల స్కామ్.. రేవంత్ రెడ్డి ఒక ‘హైబ్రిడ్ సీఎం’
-
Tragedy: పాకిస్థాన్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కుటుంబంలో తీవ్ర విషాదం..
-
Bangladesh: బంగ్లాదేశ్కు చైనా యుద్ధ విమానాలు.. భారత్కు సవాలేనా.?
ట్రెండింగ్
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!