DK Shivakumar: శివకుమార్ నీకే ఎందుకిలా..? “భజరంగబలి”కి కోపం వచ్చిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరికి ఆసక్తి కర్ణాటక ఎన్నికలపై నెలకొన్నాయి. కాంగ్రెస్ పతనావస్థకు అడ్డుకట్ట పడాలంటే.. కర్ణాటకలో ఖచ్చితంగా గెలిచితీరాలి. ఇక 2024లో మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే బీజేపీకి కర్ణాటక ఎన్నికలు చాలా కీలకం. మోదీ మానియా ఇంకా తిరుగులేదని బీజేపీ భావిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. నిన్న మొన్నటి వరకు కర్ణాటక ఎన్నికలంతా అభివృద్ధి వైపు సాగితే.. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ‘భజరంగబలి’ జపం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయం అంతా హనుమాన్ చుట్టూ తిరుగుతోంది.
Read Also: CharDham Yatra : విరిగిపడిన కొండచరియలు.. పరుగు తీసిన యాత్రికులు
Also Read
- TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
- Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
- Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
- PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
ఇటీవల కాంగ్రెస్ మానిఫెస్టోను విడుదల చేస్తూ.. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, తాము అధికారంలోకి వస్తే ‘భజరంగ్ దళ్’ను నిషేధిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని మానిఫెస్టోలో కూడా పెట్టారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పలు హిందూ సంఘాలు కూడా కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. మే 10న జరిగే ఎన్నికల్లో భజరంగబలి అని ప్రజలు ఓటేయాలని సూచించారు. ఈ హామీ వల్ల కాంగ్రెస్ కు మేలు జరగకపోగా.. రివర్స్ అయింది. తాజాగా గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్పమొయిలీ మాట్లాడుతూ.. భజరంగ్ దళ్ ను నిషేధించే ప్రణాళిక లేదని చెప్పాల్సి వచ్చింది. ఇక డీకే శివకుమార్ తాము అధికారంలో వస్తే హనుమాన్ మందిరాలను నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కన్నడ నాట ఓ వార్త మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. డీకే శివకుమార్ హనుమాన్ ఆగ్రహానికి గురయ్యారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మానిఫెస్టో ప్రకటించిన రోజు, ప్రచార నిమిత్తం హెలికాప్టర్ లో బయలుదేరిన సమయంలో ఓ పక్షిని ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్ ముందరి అద్దం పగిలిపోయింది. పైలెట్లు అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో పెద్ద ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ తరువాత నిన్న గురువారం హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత కొద్ది దూరంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తం అయిన అగ్నిమాపక శాఖ మంటల్ని ఆర్పేసింది. హొన్నవరంలో ఈ ప్రమాదం జరిగింది. గత మూడు రోజుల్లో శివకుమార్ రెండు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకున్నారు. వరస ఘటనలతో కాంగ్రెస్ శ్రేణులు ఉలిక్కిపడుతున్నాయి.
తాజావార్తలు
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Specialized Levo 4X: 840Wh బ్యాటరీతో స్పెషలైజ్డ్ లెవో 4X ఈ-బైక్ విడుదల.. 4.4 గంటల రైడింగ్, ధర ఎంతంటే?
-
Ind W Vs Pak W: హనుమంతుడు వల్లే గొప్పగా రాణించా.. మ్యాచ్ తర్వాత దీప్తి శర్మ ఎమోషనల్ కామెంట్స్!
-
Schools Reopen: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం.. బడిబాట పట్టనున్న విద్యార్థులు.!
-
Casting Couch : సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తా.. కోరిక తీర్చాలని నటికి వేధింపులు
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్పై హర్మన్ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!