DK Shivakumar: శివకుమార్ నీకే ఎందుకిలా..? “భజరంగబలి”కి కోపం వచ్చిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరికి ఆసక్తి కర్ణాటక ఎన్నికలపై నెలకొన్నాయి. కాంగ్రెస్ పతనావస్థకు అడ్డుకట్ట పడాలంటే.. కర్ణాటకలో ఖచ్చితంగా గెలిచితీరాలి. ఇక 2024లో మరోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే బీజేపీకి కర్ణాటక ఎన్నికలు చాలా కీలకం. మోదీ మానియా ఇంకా తిరుగులేదని బీజేపీ భావిస్తున్న తరుణంలో ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. నిన్న మొన్నటి వరకు కర్ణాటక ఎన్నికలంతా అభివృద్ధి వైపు సాగితే.. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ‘భజరంగబలి’ జపం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయం అంతా హనుమాన్ చుట్టూ తిరుగుతోంది.
Read Also: CharDham Yatra : విరిగిపడిన కొండచరియలు.. పరుగు తీసిన యాత్రికులు
Also Read
- Police Lathi Testing: పోలీసుల "లాఠీ"లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
- Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
- PM Modi: ప్రధాని మోడీ, ప్రియాంకా గాంధీల మధ్య సరదా సంభాషణ..‘‘మీరు మారిపోయారు’’ అని ఖర్గే కౌంటర్..
- Independence Day 2026: యుద్ధాలు.. జనాభా మార్పులు..! మన ముందు తరాలు చూడబోయే భారతావని ఎలా ఉండబోతోంది?
ఇటీవల కాంగ్రెస్ మానిఫెస్టోను విడుదల చేస్తూ.. కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, తాము అధికారంలోకి వస్తే ‘భజరంగ్ దళ్’ను నిషేధిస్తామని హామీ ఇచ్చారు. దీన్ని మానిఫెస్టోలో కూడా పెట్టారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పలు హిందూ సంఘాలు కూడా కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. మే 10న జరిగే ఎన్నికల్లో భజరంగబలి అని ప్రజలు ఓటేయాలని సూచించారు. ఈ హామీ వల్ల కాంగ్రెస్ కు మేలు జరగకపోగా.. రివర్స్ అయింది. తాజాగా గురువారం కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్పమొయిలీ మాట్లాడుతూ.. భజరంగ్ దళ్ ను నిషేధించే ప్రణాళిక లేదని చెప్పాల్సి వచ్చింది. ఇక డీకే శివకుమార్ తాము అధికారంలో వస్తే హనుమాన్ మందిరాలను నిర్మిస్తామని హామీ ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం కన్నడ నాట ఓ వార్త మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. డీకే శివకుమార్ హనుమాన్ ఆగ్రహానికి గురయ్యారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మానిఫెస్టో ప్రకటించిన రోజు, ప్రచార నిమిత్తం హెలికాప్టర్ లో బయలుదేరిన సమయంలో ఓ పక్షిని ఢీకొట్టింది. దీంతో హెలికాప్టర్ ముందరి అద్దం పగిలిపోయింది. పైలెట్లు అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీంతో పెద్ద ప్రమాదం నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఆ తరువాత నిన్న గురువారం హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత కొద్ది దూరంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తం అయిన అగ్నిమాపక శాఖ మంటల్ని ఆర్పేసింది. హొన్నవరంలో ఈ ప్రమాదం జరిగింది. గత మూడు రోజుల్లో శివకుమార్ రెండు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకున్నారు. వరస ఘటనలతో కాంగ్రెస్ శ్రేణులు ఉలిక్కిపడుతున్నాయి.
తాజావార్తలు
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్కు వైద్యుల అల్టిమేటం.!
-
NTR : ఎన్టీఆర్కు సర్జరీ..కిమ్స్ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల
-
Yashwant Varma: జస్టిస్ యశ్వంత్ వర్మకు షాక్.. విచారణ కమిటీ సంచలన రిపోర్ట్
-
Tollywood : ఈమధ్య సినిమాలు ఫ్లాప్ అవడానికి కారణమిదేనా?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..