INDIA alliance: ఇండియా కూటమి విచ్ఛిన్నం, కాంగ్రెస్దే బాధ్యత.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. ఇండియా కూటమిలో విభేదాలు..
- ఇండియా కూటమి విచ్ఛినమైతే కాంగ్రెస్దే బాధ్యత..
- శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA alliance: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమిలో విభజనకు దారి తీసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన విపక్షాలు, బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకుండా నిలువరించాయి, కానీ అధికారంలోకి రాకుండా మాత్రం అడ్డుకోలేదు. 400 సీట్లు అంటూ బీజేపీ పెట్టుకున్న లక్ష్యాన్ని, కేవలం 240 సీట్లకు మాత్రమే పరిమితం చేయగలిగింది ఇండియా కూటమి. అయితే, లోక్సభ ఎన్నికల తర్వాత హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం మరోసారి ఇండియా కూటమి పనితీరుపై అనుమానాలను లేవనెత్తింది. జార్ఖండ్లో గెలిచినప్పటికీ, అక్కడ కాంగ్రెస్ నామమాత్రమే. నిజానికి జార్ఖండ్లో హేమంత్ సోరెన్ పార్టీ జెఎంఎం ఎక్కువ సీట్లు గెలిచినప్పటికీ, ఓట్ల శాతం పరంగా బీజేపీ అన్ని పార్టీల కన్నా ముందుంది.
Read Also: Greenland: గ్రీన్ల్యాండ్ని కొనేందుకు ట్రంప్ ప్లాన్.. వాస్తవానికి ఆ ద్వీపం ఏ దేశానికి చెందినదంటే ?
Also Read
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
ఇదిలా ఉంటే, ఢిల్లీ ఎన్నికల విషయానికి వస్తే ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. అయితే, ఎంపీ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ కలిసి పోటీ చేసినప్పటికీ బీజేపీ ఢిల్లీలోని 07 ఎంపీ స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ఆప్, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ని కాదని, సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ వంటి పార్టీలు ఆప్కి మద్దతు ఇస్తున్నాయి.
ఈ నేపథ్యంలో శివసేన ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసి మంచి ఫలితాలను సాధించామని, తర్వాత ఇండియా కూటమని సజీవంగా ఉంచడానికి ఒక్క సమావేశం జరగలేదని అన్నారు. ఒమర్ అబ్దుల్లా, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు అందరూ ఇండియా కూటమికి ఇప్పుడు ఉనికి లేదని అంటున్నారని, ప్రజల మనస్సుల్లో అలాంటి భావన వస్తే, కూటమిలోని అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ దీనికి బాధ్యత వహిస్తుందని చెప్పారు. సమన్వయం లేదు, చర్చలు లేవని, దీంతో ఇండియా కూటమిలో అంతా బాగానే ఉందా..? అనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయని రౌత్ చెప్పారు. ఒకసారి ఇండియా కూటమి విడిపోతే మళ్లీ ఇంకెప్పటికీ కలవదని ఆయన జోస్యం చెప్పారు.
తాజావార్తలు
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!