PM Modi: ఆర్మీ హిమాలయాల వలే దృఢంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ గత సంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సారి కూడా దీపావళి వేడుకలను భారత సైన్యంతో కలిసి జరుపుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ‘‘మన సైన్యం దేశ సరిహద్దుల్లో హిమాలయాల మాదిరి దృఢంగా నిలబడినంత కాలం భారత్ సురక్షితంగా ఉంటుంది’’ అని ఆయన అన్నారు.
Read Also: Himaja Arrest: నేను అరెస్టు కాలేదు.. పోలీసులు అందుకే వచ్చారు- వీడియో రిలీజ్ చేసిన హిమజ
Also Read
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
- Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
- PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ప్రపంచవ్యాప్తంగా వివాదాల మధ్య సరిహద్దుల్లో భద్రత కల్పించడంలో ఆర్మీ పాత్రను ఆయన కొనియాడారు. ఈ రోజు ప్రపంచ పరిస్థితలను బట్టి, భారతదేశంపై అంచనాలు నిరంతరం పెరుగుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో భారత సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచడం ముఖ్యమని అన్నారు. మనం దేశంలో శాంతి వాతావరణాన్ని సృష్టిస్తున్నాము.. ఇందులో ఆర్మీ పాత్ర చాలా కీలకం అని ప్రధాని మోదీ అన్నారు. ‘‘నేను ప్రతీ ఏడాది మా ఆర్మీ సిబ్బందితో దీపావళి జరుపుకుంటున్నాను.. రాముడు ఉన్న అయోధ్య అని అంటారు.. నా వరకు మాత్రం భారత ఆర్మీ సిబ్బంది ఉన్న అయోధ్య అని, నేను ప్రధాని, సీఎంగా లేనప్పుడు కూడా దీపావళి జరుపుకునేందుకు సరిహద్దు ప్రాంతాలకు వెళ్లాను’’ అని మోడీ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆర్మీ ఎన్నోయుద్ధాలు చేసి దేశ హృదయాలను గెలుచుకున్నారని, అంతర్జాతీయ శాంతి మిషన్లో సైన్యం వల్లే భారత దేశ గ్లోబర్ ఇమేజ్ పెరిగిందని ప్రధాని కొనియాడారు.
లెప్చాలో సైనిక శిబిరాన్ని ఈ రోజు ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడి సైనికులతో ముచ్చటించారు. మిలిటరీ దుస్తులు ధరించిన మోడీ సైనికులతో మమేకమయ్యారు. 2014 నుంచి ప్రధాని మోదీ ప్రతీ సంవత్సరం సైనికులతో దీపావళిని జరుపుకుంటున్నారు. 2014లో తొలిసారి సియాచిన్ లో సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. గతేడాది కార్గిల్లో దీపావళి జరుపుకున్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!